పౌరసేవ.. ఆన్లైన్ తోవ
పురపాలికల్లో ప్రజలకు మెరుగైన సేవలు సత్వరం అందించేలా ప్రత్యేకంగా ఆన్లైన్లో వెబ్సైట్ ద్వారా పౌరసేవలు అందించేందుకు పురపాలిక శాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు.
మిర్యాలగూడ, న్యూస్టుడే
మిర్యాలగూడ పురపాలిక కార్యాలయం
పురపాలికల్లో ప్రజలకు మెరుగైన సేవలు సత్వరం అందించేలా ప్రత్యేకంగా ఆన్లైన్లో వెబ్సైట్ ద్వారా పౌరసేవలు అందించేందుకు పురపాలిక శాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. పౌరసేవా కేంద్రాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని పురపాలిక శాఖ సంచాలకులు సత్యనారాయణ ఇటీవల ఆదేశాలు జారీచేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అన్ని పురపాలికల్లో అధికారులు ఈ తరహా పౌరసేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పాత పురపాలికల్లో మేనేజర్లు ఉండగా , కొత్త పురపాలికల్లో రెవెన్యూ విభాగం వారికి అప్పగించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. విదేశాల్లో ఉండే వారు సైతం తమ ఇళ్లకు సంబంధించిన సమస్యలు నేరుగా ఆన్లైన్లో ఫిర్యాదు చేయొచ్ఛు పురపాలిక కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరముండదు. నేరుగా సెల్ఫోన్లోనే ఫిర్యాదు చేస్తే నిర్ణీత సమయంలో పరిష్కరిస్తారు. దీన్ని పురపాలిక ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తారు. దీంతో కింది స్థాయి సిబ్బంది సకాలంలో స్పందించి సమస్య పరిష్కరిస్తారు.
రాష్ట్రస్థాయిలో ‘ఈ మున్సిపల్ డాట్ తెలంగాణ డాట్ జీవోవీ డాట్ ఇన్’ వెబ్సైట్తో అన్ని పురపాలికలను అనుసంధానించనున్నారు. ఈ బాధ్యతను వీ- మాక్స్ ఈసొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారికి అప్పగించారు. ప్రతి పురపాలికలో మేనేజర్లను నోడల్ అధికారులుగా, కంప్యూటర్ నైపుణ్యమున్న వారిని సహాయ నోడల్ అధికారిగా నియమిస్తారు. ప్రత్యేకంగా వెబ్సైట్ ఏర్పాటు చేసి అందులో ఆయా పురపాలికల పూర్తి సమాచారం పొందుపరచాలని సూచించారు. పురపాలిక అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యుల వివరాలు ఫొటోలతో సహా నమోదు చేయాలి. అమృత్ పట్టణాలైతే వాటి నిధుల సమాచారం పేర్కొనాలి. పురపాలికల్లో ఆయా విభాగాల అధికారులు, సిబ్బంది ఫిర్యాదులు చేయాల్సిన వివరాలు, పురపాలికల్లో జరిగే టెండర్ల సమాచారం ఇందులో ప్రదర్శిస్తారు.
ప్రజలకు సత్వర సేవలు
రవీందర్ సాగర్, కమిషనర్
పట్టణాల్లో వార్డుల సమస్యలు పురపాలిక కార్యాలయం వరకు వచ్చి ఫిర్యాదు చేసే అవసరముండదు. నేరుగా తమ ఫోన్లో ఫిర్యాదు చేయొచ్ఛు రాత్రి సమయంలో చేసిన ఫిర్యాదులు ఉదయం సంబంధిత పారిశుద్ధ్య, నీటి సరఫరా, విద్యుత్తు సిబ్బంది స్పందించే అవకాశముంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వెబ్సైట్ రూపొందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దాహం కేకలు తీర్చేందుకు...తరలి వస్తున్న కృష్ణమ్మ
[ 19-04-2024]
నాగార్జునసాగర్ జలాశయం డెడ్స్టోరేజీ దిగువకు చేరినా వేసవిలో హైదరాబాద్ జంట నగరాలు, జిల్లా వాసుల దాహం కేకలు తీర్చేందుకు కృష్ణాజలాల సరఫరాకు హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ (జలమండలి) అధికారులు చేపడుతున్న చర్యలు సఫలీకృతమయ్యాయి -
సైబర్ బాధితులకు వారియర్స్ తోడు
[ 19-04-2024]
చరవాణుల ద్వారా డిజిటల్ లావాదేవీలు పెరగడంతో నిత్యం ఎక్కడో చోట అమాయకులు సైబర్ నేరగాళ్ల వలలో పడి ఆర్థికంగా నష్టపోతున్నారు. -
రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా: మంత్రి ఉత్తమ్
[ 19-04-2024]
కోదాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. -
గాడితప్పిన గస్తీ
[ 19-04-2024]
జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. వరుసగా గొలుసు చోరీలకు పాల్పడుతున్నారు. నిఘా పటిష్ఠం చేసి దొంగలను పట్టుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారు. -
ఆలయ భద్రతపై ఇంత నిర్లక్ష్యమా!
[ 19-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని నిత్యం వేల సంఖ్యలో భక్తులు సందర్శిస్తుంటారు. ఆలయంలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతే లోనికి అనుమతించేందుకు బ్యాగేజ్ స్కానింగ్, మెటల్ డిటెక్టర్, తదితర భద్రతా పరికరాలను వైటీడీఏ కొనుగోలు చేసింది. -
భక్తవత్సలుడికి సంప్రదాయ ఆరాధనలు
[ 19-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో గురువారం స్వయంభువులైన పంచనారసింహులను ఆరాధిస్తూ చేపట్టిన నిత్య పూజలు ఆలయ ఆచారంగా కొనసాగాయి -
కేసీఆర్కు సీఎం రేవంత్రెడ్డే సరైనోడు: రాజగోపాల్రెడ్డి
[ 19-04-2024]
తెలంగాణ ఇచ్చిన పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని.. ఆలస్యం అయినా ప్రవేశపెట్టిన పథకాలను నెరవేర్చి.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని భువనగిరి లోక్సభ ఇన్ఛార్జి, స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. -
నాయకులొస్తున్నారు..!
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్సభ స్థానాలైన నల్గొండ, భువనగిరిలో నామినేషన్ దాఖలు సందర్భంగా భారీ ఎత్తున ర్యాలీలు, సభలు నిర్వహించాలని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలు భారాస, భాజపాలు నిర్ణయించాయి -
67 ఏళ్లలో 69 శాతమే!
[ 19-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1952లో ఏర్పడగా.. 2019 వరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. 2019 నాటికి నియోజకవర్గానికి తొలి ఎన్నికలు జరిగి 67 ఏళ్లు గడిచాయి -
నల్గొండలో నలుగురు, భువనగిరిలో ముగ్గురు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం మొదలైంది. తొలి రోజు గురువారం నల్గొండ లోక్సభ స్థానానికి నలుగురు అభ్యర్థులు ఆరు సెట్లు నామినేషన్లను రిటర్నింగ్ అధికారి, నల్గొండ జిల్లా కలెక్టరు హరిచందనకు అందజేశారు. -
నల్గొండ.. నాయకులకు అండ!
[ 19-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గానికి 18వ సారి ఎన్నికలు జరుగనున్నాయి. ఉమ్మడి జిల్లాలో తొలిసారి ఏర్పడిన ఏకైక లోక్సభ నియోజకవర్గం నల్గొండ మాత్రమే. -
పార్లమెంటు.. ఎంపీ అంటే తెలుసా
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు తమదైన శైలిలో సమావేశాలు నిర్వహిస్తూ ఓటర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు -
వ్యాను ఢీకొని రైతు మృతి
[ 19-04-2024]
ద్విచక్రవాహనాన్ని వ్యాను ఢీకొనడంతో రైతు మృతి చెందిన ఘటన మఠంపల్లి మండలం రఘునాథపాలెం పరిధిలోని వెంకటాయపాలెంలో గురువారం జరిగింది. -
ఇంటి మీద.. అవార్డుల పంట
[ 19-04-2024]
మిద్దె తోటలు.. ఆరోగ్యానికి ఉపయోగపడే కూరగాయలతో పాటు పురస్కారాలనూ తీసుకొస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
భారాస అధినేత కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ ఖరారు
-
మెటా ప్లాట్ఫామ్స్లో ఏఐ.. వాట్సప్లో ఇక చిత్రాలూ రూపొందించొచ్చు!
-
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
-
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా?
-
పురందేశ్వరి సహా రెండో రోజు ప్రముఖుల నామినేషన్లు
-
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్