అధికారుల దోపిడీ..!
రూ.లక్షల్లో జీతాలు.. బాధ్యతాయుతమైన ఉద్యోగం.. గౌరవప్రదమైన హోదా.. ఇవన్నీ ఉన్నప్పటికీ కొందరు అధికారులు కాసులకు కక్కుర్తిపడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అద్దె కార్ల దందాను....
సూర్యాపేట పట్టణం, న్యూస్టుడే
సూర్యాపేట: తెలుపురంగు ప్లేటుతో ప్రభుత్వ వాహనం
రూ.లక్షల్లో జీతాలు.. బాధ్యతాయుతమైన ఉద్యోగం.. గౌరవప్రదమైన హోదా.. ఇవన్నీ ఉన్నప్పటికీ కొందరు అధికారులు కాసులకు కక్కుర్తిపడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అద్దె కార్ల దందాను యథేచ్ఛగా కొనసాగిస్తూ నిరుద్యోగులకు ఉపాధి లేకుండా చేస్తున్నారు. ట్యాక్సీ పేరిట ప్రతినెలా బిల్లులు కాజేస్తూ ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్నారు. ప్రభుత్వ అధికారులు పర్యటించేందుకు సొంత వాహనాలను ప్రభుత్వం కొనుగోలు చేసే పరిస్థితి లేకపోవడంతో అవసరమైన వాహనాలను అద్దెకు తీసుకునే వెసులుబాటును ఆయా శాఖల కమిషనర్లకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. అందుకోసం ఒక్కో వాహనానికి ప్రతినెలా రూ. 33 వేలు అద్దె చెల్లిస్తామని స్పష్టం చేసింది.
జిల్లాలో ఇదీ పరిస్థితి..
ఇంజినీరింగ్, అటవీ, వ్యవసాయ, విద్యుత్తు, ఐసీడీఎస్, మైనింగ్, జిల్లా పరిషత్తు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఇతర జిల్లా, మండల అధికారులకు ట్యాక్సీ సౌకర్యం వర్తిస్తుంది. జిల్లా వ్యాప్తంగా దాదాపు 156 మంది అధికారులు అద్దె కార్లను వినియోగిస్తున్నారు. వీరిలో చాలామంది సొంత కార్లను వినియోగిస్తూ అద్దె కార్ల పేరిట రూ.లక్షల్లో బిల్లులు కాజేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వ్యక్తిగత వాహనాల ద్వారా బిల్లులు పెట్టుకోవడం సాధ్యం కాకపోవడంతో కొన్ని ప్రైవేటు ట్రావెల్స్తో కమీషన్ మాట్లాడుకుంటున్నారు. ట్యాక్సీప్లేట్ వాహనాల పేరిట దొంగ బిల్లులను జతపరిచి ప్రతినెలా దోపిడీకి పాల్పడుతున్నారనే వాదనలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో ఉన్నతాధికారులు సైతం ఇదే వైఖరి అవలంబిస్తుండటం గమనార్హం.
నిరుద్యోగులకు దక్కని ఉపాధి!
అద్దె కార్లు వాడాల్సిన అధికారులు తప్పనిసరిగా ట్యాక్సీ ప్లేట్ నంబర్ కలిగిన వాహనం మాత్రమే వాడాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బ్యాంకు రుణాలు, రాయితీ, కార్పొరేషన్లతోపాటు ఓనర్ కం డ్రైవర్ వంటి పథకాలను ప్రవేశపెట్టి నిరుద్యోగులకు ఉపాధి కల్పించినట్లు అవుతుందని ప్రభుత్వం భావించింది. అద్దెకు తీసుకోవాలనుకున్నప్పుడు వాహనం కండిషన్గా ఉండటంతో పాటు డ్రైవర్కు బ్యాడ్జీ నంబర్తో కూడిన లైసెన్స్ తప్పనిసరి. నిబంధనల ప్రకారం నెలకు కనీసం 2,300కి.మీ. వాహనం తిరగాలి. గతంలో వాహనం అద్దె, పెట్రోల్ లేదా డీజిల్ కలిపి నెలకు రూ.24 వేలు ఇవ్వగా ప్రస్తుతం రూ.33 వేలకు ప్రభుత్వం పెంచింది. ఇదే అదనుగా కొందరు అధికారులు సొంత వాహనాలను బినామీ పేరిట నమోదు చేయించి అద్దె ప్రాతిపదికన వాటిని వినియోగిస్తున్నారు. బినామీ పేర్లతో ప్రతినెలా బిల్లులు కాజేస్తూ నిరుద్యోగుల పొట్ట కొట్టడంతోపాటు ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నారు.
తెలుపురంగు ప్లేటుతో దర్శనం!
అధికారులకు సంబంధించిన వాహనాలపై ‘ఆన్ గౌట్ డ్యూటీ’ పేరిట వైట్ నంబర్ ప్లేట్లు దర్శనమిస్తున్నాయి. ఇలాంటి వాహనాలు ప్రభుత్వ పనుల కోసం బహిరంగంగానే రోడ్లపై తిరుగుతున్నా రవాణా శాఖ అధికారులు మాత్రం పట్టించుకోవటం లేదు. కొన్ని శాఖల్లో అయితే ఉద్యోగులే రెండు, మూడు పాత కార్లు కొని అద్దె పేరిట బిల్లులు కాజేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వానికి నివేదిస్తాం: మోహన్రావు, అదనపు కలెక్టర్
అద్దె కార్ల వ్యవహారంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న అధికారుల గురించి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం. ప్రభుత్వ ఆదేశానుసారం చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రభుత్వంపై విమర్శ.. రైతులకు భరోసా
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సుయాత్ర చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దానిని ఉమ్మడి జిల్లా నుంచే ప్రారంభించడంతో.. భారాస నేతలు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. -
బాలికలు.. భళా
[ 25-04-2024]
విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. -
మోదీతో తెలంగాణకు తీరని అన్యాయం
[ 25-04-2024]
కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ తెలంగాణకు తీరని అన్యాయం చేశారని నల్గొండ లోక్సభ ఇన్ఛార్జి, మంత్రి నల్లమాద ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. -
బాలికలదే హవా
[ 25-04-2024]
రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. -
ఉపాధి కూలీల సౌకర్యాలపై సమీక్ష
[ 25-04-2024]
పని ప్రదేశాలలో ఉపాధి కూలీలకు మౌలిక సౌకర్యాలు సమకూర్చాలని జిల్లా పరిషతు ముఖ్య కార్యనిర్వహణాధికారి శోభారాణి, ఆదనపు డీఆర్డీవో జి.సురేష్, సూచించారు. -
ప్రథమంలో 26.. ద్వితీయంలో 25
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. 2022-23లో జిల్లా ఉత్తీర్ణత శాతం 57 ఉండగా, ప్రస్తుతం 54.50 శాతానికి పడిపోయింది. -
ఊపందుకున్న నామినేషన్ల పర్వం
[ 25-04-2024]
నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాలకు బుధవారం వరకు 45 మంది చొప్పున నామినేషన్లు వేశారు. -
గిరిజన గురుకులాల్లో 88.60శాతం ఉత్తీర్ణత
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో కలిపి ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 88.60శాతం ఫలితాలు -
మతోన్మాద భాజపాను ఓడించండి: సీపీఐ
[ 25-04-2024]
దేశంలో మతోన్మాదం పేరుతో రాజకీయాలు చేస్తున్న భాజపాను ఓడించి కాంగ్రెస్ అభ్యర్ధులను భారీ మెజార్టీతో గెలిపించాలని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. -
విభజన హామీల అమలుకు కృషి
[ 25-04-2024]
భువనగిరి లోక్సభ ఎంపీగా తనను గెలిపిస్తే విభజన హామీలను అమలు చేసేందుకు, నిధులు రాబట్టేందుకు కృషి చేస్తానని భువనగిరి లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. -
తొలి ఎన్నికలోనే అత్యధిక మెజారిటీ
[ 25-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1951లో ఏర్పడగా.. తొలి ఎన్నికలు 1952లో జరిగాయి. -
రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం, వ్యక్తి అరెస్ట్
[ 25-04-2024]
రైల్వేశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని 17 మంది బాధితుల నుంచి నగదు వసూలు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు పోలీస్ ఇన్స్పెక్టర్ అశోక్రెడ్డి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్