పదిలో మెరిశారు..
పది పరీక్షల్లో నల్గొండ జిల్లా 93.57 శాతంతో 14వ స్థానంలో నిలిచింది. జిల్లా నుంచి 19747 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 18477 మంది ఉత్తీర్ణులయ్యారు. ఈసారి జిల్లాలోని అన్ని యజమాన్యాల నుంచి 461 మంది పది జీపీఏ సాధించడం
జిల్లాలో 461 మంది విద్యార్థులకు 10 జీపీఏ
నల్గొండ విద్యావిభాగం, న్యూస్టుడే
పది పరీక్షల్లో నల్గొండ జిల్లా 93.57 శాతంతో 14వ స్థానంలో నిలిచింది. జిల్లా నుంచి 19747 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 18477 మంది ఉత్తీర్ణులయ్యారు. ఈసారి జిల్లాలోని అన్ని యజమాన్యాల నుంచి 461 మంది పది జీపీఏ సాధించడం గమనార్హం. ఈ లెక్కన ఉత్తీర్ణులైన వారిలో 2.49 శాతం మంది 10 జీపీఏ సాధించారు. బాలుర కంటే బాలికల ఉత్తీర్ణత 3.17 శాతం ఉండటం గమనార్హం. బాలురు 10273 మంది హాజరుకాగా 92.05శాతంతో 9456 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 9474 మంది హాజరుకాగా 95.22 శాతంతో 9021 మంది ఉత్తీర్ణులయ్యారు. పదో తరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లాలోని అన్ని యజమాన్యాల ఫాఠశాలల నుంచి 461 మంది 10జీపీఏ సాధించారు. జిల్లా పరిషత్తు పాఠశాలల్లో 9 మంది, ఎయిడెడ్ పాఠశాలల్లో 21 మంది, బీసీ సంక్షేమ శాఖ పాఠశాలల్లో 40 మంది, ఆదర్శ పాఠశాలల నుంచి 10 మంది, మైనార్టీ గురుకులాలల నుంచి 5 గురు, సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాల నుంచి 20 మంది, గిరిజన సంక్షేమ గురుకులాల నుంచి 6 గురు, ప్రైవేట్ పాఠశాలల నుంచి 350 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించారు.
ఉత్తమ ఫలితాలు సాధించారు
- బి.భిక్షపతి (జిల్లా విద్యాశాఖాధికారి, నల్గొండ)
పదో తరగతి పరీక్షల్లో జిల్లా విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారు. కరోనా నేపథ్యంలో గత రెండేళ్లుగా పరీక్షలు నిర్వహించలేకపోయినా ఈసారి మొదటి నుంచే పాఠశాల ప్రణాళికలు, ప్రత్యేక తరగతులు నిర్వహించడం వంటివి చేశాం. పరీక్షల కోసం అనుభవజ్జులచే స్టడీమెటీరియల్ రూపొందించాం. విద్యార్థులు బాగా చదువుకునేలా ప్రత్యేక శ్రద్ధపెట్టాం. ప్రత్యేక తరగతులు నిర్వహించాం. పిల్లలు మంచి ఫలితాలు సాధించారు. 93.57 ఉత్తీర్ణత సాధించడంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుల సహకారం, తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో ఉంది. ఇదే స్ఫూర్తితో ముందు ముందు మరింత మెరుగుగా విద్యాబోధన అందించి విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తాం. ఉత్తీర్ణులైన విద్యార్థులకు అభినందనలు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రభుత్వంపై విమర్శ.. రైతులకు భరోసా
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సుయాత్ర చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దానిని ఉమ్మడి జిల్లా నుంచే ప్రారంభించడంతో.. భారాస నేతలు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. -
బాలికలు.. భళా
[ 25-04-2024]
విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. -
మోదీతో తెలంగాణకు తీరని అన్యాయం
[ 25-04-2024]
కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ తెలంగాణకు తీరని అన్యాయం చేశారని నల్గొండ లోక్సభ ఇన్ఛార్జి, మంత్రి నల్లమాద ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. -
బాలికలదే హవా
[ 25-04-2024]
రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. -
ఉపాధి కూలీల సౌకర్యాలపై సమీక్ష
[ 25-04-2024]
పని ప్రదేశాలలో ఉపాధి కూలీలకు మౌలిక సౌకర్యాలు సమకూర్చాలని జిల్లా పరిషతు ముఖ్య కార్యనిర్వహణాధికారి శోభారాణి, ఆదనపు డీఆర్డీవో జి.సురేష్, సూచించారు. -
ప్రథమంలో 26.. ద్వితీయంలో 25
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. 2022-23లో జిల్లా ఉత్తీర్ణత శాతం 57 ఉండగా, ప్రస్తుతం 54.50 శాతానికి పడిపోయింది. -
ఊపందుకున్న నామినేషన్ల పర్వం
[ 25-04-2024]
నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాలకు బుధవారం వరకు 45 మంది చొప్పున నామినేషన్లు వేశారు. -
గిరిజన గురుకులాల్లో 88.60శాతం ఉత్తీర్ణత
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో కలిపి ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 88.60శాతం ఫలితాలు -
మతోన్మాద భాజపాను ఓడించండి: సీపీఐ
[ 25-04-2024]
దేశంలో మతోన్మాదం పేరుతో రాజకీయాలు చేస్తున్న భాజపాను ఓడించి కాంగ్రెస్ అభ్యర్ధులను భారీ మెజార్టీతో గెలిపించాలని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. -
విభజన హామీల అమలుకు కృషి
[ 25-04-2024]
భువనగిరి లోక్సభ ఎంపీగా తనను గెలిపిస్తే విభజన హామీలను అమలు చేసేందుకు, నిధులు రాబట్టేందుకు కృషి చేస్తానని భువనగిరి లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. -
తొలి ఎన్నికలోనే అత్యధిక మెజారిటీ
[ 25-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1951లో ఏర్పడగా.. తొలి ఎన్నికలు 1952లో జరిగాయి. -
రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం, వ్యక్తి అరెస్ట్
[ 25-04-2024]
రైల్వేశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని 17 మంది బాధితుల నుంచి నగదు వసూలు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు పోలీస్ ఇన్స్పెక్టర్ అశోక్రెడ్డి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
-
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..