ఒడిశా నుంచి హైదరాబాద్కు..
ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పోలీసుల కళ్లుగప్పి సరిహద్దు దాటి గంజాయి రవాణా చేస్తున్న వాహనం తెలంగాణ పోలీసులకు చిక్కింది. మరో అరగంటలో గంజాయితో రాజధాని హైదరాబాద్కు చేరుతామనకున్న ఇద్దరు
గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు నిందితుల రిమాండ్
28 కిలోల సరకు స్వాధీనం
భువనగిరిలో కేసు వివరాలు వెల్లడిస్తున్న డీసీపీ నారాయణరెడ్డి, చిత్రంలో ఏసీపీ ఉదయ్రెడ్డి, సీఐ శ్రీనివాస్రెడ్డి, ఎస్సై సైదులు
భువనగిరి నేరవిభాగం, న్యూస్టుడే: ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పోలీసుల కళ్లుగప్పి సరిహద్దు దాటి గంజాయి రవాణా చేస్తున్న వాహనం తెలంగాణ పోలీసులకు చిక్కింది. మరో అరగంటలో గంజాయితో రాజధాని హైదరాబాద్కు చేరుతామనకున్న ఇద్దరు నిందితులు ధూనం అరవింద్, పప్పుల తిరుపతిలను యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని రెడ్డిబావి క్రాస్రోడ్డు వద్ద అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ నారాయణరెడ్డి తెలిపారు. నిందితుల వద్ద నుంచి రూ.2.80 లక్షల విలువైన 28 కిలోల గంజాయి, రెండు చరవాణులు, రూ.13,800 నగదు, కారును స్వాధీనం చేసుకున్నామని వివరించారు. భువనగిరి పట్టణంలోని డీసీసీ క్యాంపు కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో చౌటుప్పల్ ఏసీపీ ఉదయ్రెడ్డితో కలిసి కేసు వివరాలను ఆయన వెల్లడించారు. డీసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ జిల్లాకేంద్రానికి చెందిన 22 ఏళ్ల ధూనం అరవింద్ డెలివరి బాయ్గా పనిచేస్తాడు.
అక్రమ సంపాదన కోసం గంజాయి సరఫరా చేయాలని పథకం రచించాడు. ఒడిశా రాష్ట్రం మాలకాంగిరి జిల్లా పప్పులూరు మండలం నాగుళూరుకు చెందిన 19 ఏళ్ల తిరుపతిని కలిశాడు. అక్కడి అప్పారావు అనే వ్యక్తి దగ్గర నుంచి 28 కిలోల గంజాయి కొనుగోలు చేసి వారు కారులో హైదరాబాద్కు తీసుకొస్తున్నారు. రాజమండ్రి, విజయవాడ, సూర్యాపేట మీదుగా కారులో వస్తుండగా సమాచారం మేరకు చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ప్లాజాకు చేరుకోకముందే రెడ్డిబావి క్రాస్రోడ్డు వద్ద గంజాయి తరలిస్తున్న వాహనాన్ని సోమవారం సాయంత్రం పోలీసులు ఆపారు. వాహనాన్ని తనిఖీ చేయగా అందులో గంజాయి దొరకడంతో నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ చెప్పారు. ఆ గంజాయిని హైదరాబాద్లోని కాలే సాహెబ్కు విక్రయించేందుకు తీసుకెళ్తున్నట్లు దర్యాప్తులో నిందితులు వెల్లడించారని తెలిపారు. నిందితులకు సరకు సరఫరా చేసిన అప్పారావుతోపాటు హైదరాబాద్ వాసి కాలే సాహేబ్ పరారీలో ఉన్నట్లు పేర్కొన్నారు. నిందితులను రిమాండ్కు తరలించినట్లు వివరించారు. సమావేశంలో చౌటుప్పల్ సీఐ శ్రీనివాస్, ఎస్సై సైదులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రభుత్వంపై విమర్శ.. రైతులకు భరోసా
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సుయాత్ర చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దానిని ఉమ్మడి జిల్లా నుంచే ప్రారంభించడంతో.. భారాస నేతలు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. -
బాలికలు.. భళా
[ 25-04-2024]
విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. -
మోదీతో తెలంగాణకు తీరని అన్యాయం
[ 25-04-2024]
కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ తెలంగాణకు తీరని అన్యాయం చేశారని నల్గొండ లోక్సభ ఇన్ఛార్జి, మంత్రి నల్లమాద ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. -
బాలికలదే హవా
[ 25-04-2024]
రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. -
ఉపాధి కూలీల సౌకర్యాలపై సమీక్ష
[ 25-04-2024]
పని ప్రదేశాలలో ఉపాధి కూలీలకు మౌలిక సౌకర్యాలు సమకూర్చాలని జిల్లా పరిషతు ముఖ్య కార్యనిర్వహణాధికారి శోభారాణి, ఆదనపు డీఆర్డీవో జి.సురేష్, సూచించారు. -
ప్రథమంలో 26.. ద్వితీయంలో 25
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. 2022-23లో జిల్లా ఉత్తీర్ణత శాతం 57 ఉండగా, ప్రస్తుతం 54.50 శాతానికి పడిపోయింది. -
ఊపందుకున్న నామినేషన్ల పర్వం
[ 25-04-2024]
నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాలకు బుధవారం వరకు 45 మంది చొప్పున నామినేషన్లు వేశారు. -
గిరిజన గురుకులాల్లో 88.60శాతం ఉత్తీర్ణత
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో కలిపి ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 88.60శాతం ఫలితాలు -
మతోన్మాద భాజపాను ఓడించండి: సీపీఐ
[ 25-04-2024]
దేశంలో మతోన్మాదం పేరుతో రాజకీయాలు చేస్తున్న భాజపాను ఓడించి కాంగ్రెస్ అభ్యర్ధులను భారీ మెజార్టీతో గెలిపించాలని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. -
విభజన హామీల అమలుకు కృషి
[ 25-04-2024]
భువనగిరి లోక్సభ ఎంపీగా తనను గెలిపిస్తే విభజన హామీలను అమలు చేసేందుకు, నిధులు రాబట్టేందుకు కృషి చేస్తానని భువనగిరి లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. -
తొలి ఎన్నికలోనే అత్యధిక మెజారిటీ
[ 25-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1951లో ఏర్పడగా.. తొలి ఎన్నికలు 1952లో జరిగాయి. -
రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం, వ్యక్తి అరెస్ట్
[ 25-04-2024]
రైల్వేశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని 17 మంది బాధితుల నుంచి నగదు వసూలు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు పోలీస్ ఇన్స్పెక్టర్ అశోక్రెడ్డి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్