పటిష్ఠం చేస్తేనే.. ప్రాణాలు నిలుస్తాయి..
వాహనాల రద్దీ ఉన్న హైదరాబాద్- విజయవాడ 65వ నెంబర్ జాతీయ రహదారిపై నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనిపై నిత్యం 32 వేల వరకు వాహనాలు ఉమ్మడి జిల్లా మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి.
క్షతగాత్రులకుఆరగంటలోనేమెరుగైనచికిత్స
నకిరేకల్, న్యూస్టుడే
65వ నెంబర్ జాతీయ రహదారిపై నిత్యం ఇలా.. ప్రమాదాలు (దాచిన చిత్రం)
వాహనాల రద్దీ ఉన్న హైదరాబాద్- విజయవాడ 65వ నెంబర్ జాతీయ రహదారిపై నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనిపై నిత్యం 32 వేల వరకు వాహనాలు ఉమ్మడి జిల్లా మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి. ఆదివారాలు, పండగలు, సెలవు రోజుల్లో వాహనాల సంఖ్య 40 వేలకు చేరుతుంది. ఇంత రద్దీ ఉన్నా ఇప్పట్లో దీనిని ఆరు వరుసలుగా విస్తరిస్తారన్న ఆశలు సన్నగిల్లాయి. ప్రమాదాల్లో గాయపడిన వారికి సకాలంలో వైద్యం అందక మృత్యువాత పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో 170 కి.మీ. మేర విస్తరించిన ఈ రహదారిపై ఏటా 150కిపైగా ప్రమాదాలు నమోదవుతున్నాయి. 200 మందికిపైగా గాయపడుతున్నారు. 80 నుంచి 100 మంది వరకు మృత్యువాత పడుతున్నారు. ఈ హైవేపై ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పటిష్ఠం చేసి క్షతగాత్రులకు తక్షణ వైద్యం అందించేలా ఏర్పాట్లు చేస్తే గాయపడిన వారిని 90 శాతం వరకు ప్రాణాపాయం నుంచి కాపాడేందుకు వీలుందని వైద్యులు వెల్లడిస్తున్నారు. ఈ దిశగా అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ప్రజానీకం కోరుతోంది. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలన్న తపనతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు కృషి చేస్తున్నారు. ఈ దశలో హైవే పీహెచ్సీలను పటిష్ఠం చేసేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక ప్రతిపాదనలు పంపి కృషి చేయాలన్న విజ్ఞప్తులు ఉన్నాయి.
వెలిమినేడు పీహెచ్సీ (హైవేపై ఇలాంటివి ఉమ్మడి జిల్లాలో ఆరు ఉన్నాయి)
ప్రస్తుతం వైద్యసేవలు ఇలా..
170 కిలోమీటర్ల హైవేపై ఉమ్మడి జిల్లాలో చౌటుప్పల్, నకిరేకల్, సూర్యాపేట, కోదాడల్లో మాత్రమే రోడ్డు ప్రమాద బాధితులకు వైద్య అందించే ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి. చౌటుప్పల్, నకిరేకల్, కోదాడల్లో 30 పడకల ఆసుపత్రులు (సీహెచ్సీలు), సూర్యాపేటలో జనరల్ ఆసుపత్రి అందుబాటులో ఉన్నాయి. క్షతగాత్రులను ఈ వైద్యశాలలకు చేర్చేందుకు 30 నుంచి 40 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. తీవ్రంగా గాయపడిన బాధితులకు మొదటి గంటలోపుగానే వైద్యం అందిస్తే ప్రాణాలు దక్కే వీలుంది. క్షతగాత్రులకు మొదటి గంటను ‘గోల్డెన్ అవర్గా’ పరిగణించి చికిత్స అందిస్తేనే వారికి ప్రాణాపాయం తప్పుతుంది.మొదటి గంటలో దాదాపు 40 నిమిషాల వరకు విలువైన సమయం వైద్యశాలలకు చేరుకోవడానికే సరిపోతోంది.
24 గంటల సేవలు అవసరం
హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై వెలిమినేడు(చిట్యాల మండలం), చిట్యాల, నార్కట్పల్లి, కట్టంగూరు, కేతేపల్లి, మునగాల పీహెచ్సీలు ఉన్నాయి. వీటిని గతంలో ప్రసూతి సేవల కోసం 24 గంటల పీహెచ్సీలుగా గుర్తించి రాత్రివేళల్లో కూడా స్టాప్నర్సు సేవలు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఆ సేవలు నామమాత్రంగా మారాయి. రహదారి ప్రమాద బాధితులతోపాటు గ్రామాల్లోని పాము, తేలుకాటు, క్రిమిసంహార మందు తాగి ప్రమాద స్థితికి చేరిన వారికి, కలుషితాహార బాధితులకు అత్యవసర సేవలు ఈ పీహెచ్సీల్లో అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంది. 24 గంటలు వైద్యులు, నర్సులు, మందులు, యంత్ర పరికరాలు వీటిలో అందుబాటులో పెడితే అత్యవసర సేవల కోసం హైవేపై ప్రతి 10 నుంచి 15 కి.మీ.కు ఒక వైద్యశాల అందుబాటులోకి వచ్చినట్లవుతుంది. రోడ్డు ప్రమాద క్షతగాత్రులకు కనీస మెరుగైన ప్రథమ చికిత్స అయినా వీటిల్లో అందించే వీలుంటుంది. వీటి ద్వారా బాధితులకు అరగంటలోపుగానే ప్రాథమిక వైద్యం అంది ప్రాణాపాయం నుంచి బయటపడతారు.
ప్రథమ చికిత్సలకు ఏర్పాట్లు : - అన్నెమళ్ల కొండల్రావు, డీఎంహెచ్వో, నల్గొండ
హైవేపై ఉన్న సీహెచ్సీలతో పాటు పీహెచ్సీల్లో కూడా అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్సలు అందించేలా వైద్యులను అప్రమత్తం చేశాం. పీహెచ్సీల పనివేళలు ముగిసిన తర్వాత అత్యవసర పరిస్థితుల్లో ఫోన్కాల్పై వైద్యుడు వచ్చి సేవలందించాలని ఆదేశించాం. మరింత మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. బాధితులకు అత్యవసర సేవలు అందని పరిస్థితుల్లో ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతాక స్థాయికి ప్రచారం
[ 23-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఉమ్మడి నల్గొండ జిల్లాలో పతాక స్థాయికి చేరింది. భువనగిరి లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డికి మద్దతుగా ఆదివారం భువనగిరి పట్టణంలో -
కుటుంబ పాలనను తరిమికొట్టాలి
[ 23-04-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాకు మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి కుటుంబాలతో పాటూ జానారెడ్డి కుటుంబం చేసిందేమీ లేదని కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి విమర్శించారు. -
అనర్థం.. చెత్తలో బయో వ్యర్థం
[ 23-04-2024]
నల్గొండ జిల్లా పరిషత్తు, న్యూస్టుడే: ఆసుపత్రుల్లో జాగ్రత్తలు తీసుకునే వైద్యులు తమ ఆసుపత్రుల నుంచి వెలువడే వ్యర్థాలను మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. -
విత్తనం.. ఎవరిదీ పెత్తనం
[ 23-04-2024]
వరి విత్తనాలకు ప్రభుత్వం రాయితీ ఇవ్వడం లేదు. రైతన్నలపై విత్తన భారం పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం పరిశోధనా స్థానాలు, ఐఆర్ఆర్, ఐసీఏఆర్ తదితర కేంద్ర సంస్థల నుంచి విడుదలైన విత్తన రకాలనే సరఫరా చేస్తుంది. -
భగభగ మండే
[ 23-04-2024]
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
కరదీపిక.. సందేహాల నివృత్తికి వేదిక
[ 23-04-2024]
ఎన్నికల నిర్వహణలో పోలింగ్ విధులు నిర్వర్తించే అధికారుల పాత్ర కీలకం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండ, భువనగిరి లోక్సభ నియోజకవర్గాల్లో నామపత్రాల స్వీకరణ -
పేదల హృదయాల్లో నిలిచె
[ 23-04-2024]
ప్రజాభీష్టంతో మూడు పర్యాయాలు నాటి మిర్యాలగూడ ఎంపీగా ఎన్నికై, పేదల అభ్యున్నతికి పాటుపడిన దివంగత జీఎస్ రెడ్డి(గోపు శౌరెడ్డి).. -
ఈవీఎంలకు 35 ఏళ్లు
[ 23-04-2024]
ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంల పాత్ర అత్యంత ముఖ్యం. ఈ యంత్రం తొలుత వినియోగం, పుట్టు పూర్వోత్తరాలను పరిశీలించినట్లైతే.. -
అక్షరంతో సహవాసం.. వ్యక్తిత్వ వికాసం
[ 23-04-2024]
వ్యక్తి వికాసానికి, సమాజ చైతన్యానికి పుస్తకాలే ఆధారం. గతించిన కాలాన్ని భవిష్యత్ తరాలకు తెలియజేసే సాధనం పుస్తకం. పుస్తకాలను స్నేహితులుగా భావిస్తారు. -
జీవితంలో పాస్ అవుదాం..!
[ 23-04-2024]
పదో తరగతి, ఇంటర్, డిగ్రీ పరీక్షల్లో ఫెయిలయ్యామంటూ.. మార్కులు తక్కువ వచ్చాయంటూ.. పోటీ పరీక్షల్లో సీట్లు రాలేదంటూ.. ఏటా పలువురు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్న తరుణంలో.. -
నిర్మాణాల్లో.. అమలు కాని నిబంధనలు
[ 23-04-2024]
ఆలేరు పురపాలికగా ఏర్పడ్డాక ఏటా వందకు పైగా ఇళ్ల నిర్మాణాల అనుమతుల కోసం దరఖాస్తులు వస్తున్నాయి. కొత్త పురపాలిక చట్టం అమలులోకి వచ్చాక నిర్మాణాల అనుమతుల నిబంధనలు కఠినతరం చేశారు. -
బాలుడు మరణించిన 10 రోజులకు తండ్రి ఫిర్యాదు
[ 23-04-2024]
సంపులో పడి 22 నెలల బాలుడు మృతి చెందిన ఘటన మండలంలోని రెడ్డినాయక్తండాలో ఈ నెల 11న చోటు చేసుకుంది. -
ఎన్నికలయ్యే వరకు అప్రమత్తంగా ఉండండి: కలెక్టర్
[ 23-04-2024]
పోలింగ్ ప్రక్రియ ముగిసేంత వరకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి వెంకటరావు అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి