ముఖ్యమంత్రీ.. మూసీ పరివాహక ప్రాంతంపై దయలేదేమీ?
మూడో విడత ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా బీబీనగర్, పోచంపల్లి మండలాల్లో పాదయాత్ర చేసిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూసీ నది ప్రవాహాన్ని పరిశీలించారు.
కేసీఆర్కు సంజయ్ బహిరంగ లేఖ
భూదాన్పోచంపల్లి మండలం పెద్దరావులపల్లి గ్రామంలో మూసీనదిని పరిశీలిస్తున్న బండి సంజయ్
భువనగిరి, భూదాన్ పోచంపల్లి, న్యూస్టుడే: మూడో విడత ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా బీబీనగర్, పోచంపల్లి మండలాల్లో పాదయాత్ర చేసిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూసీ నది ప్రవాహాన్ని పరిశీలించారు. మూసీ దుస్థితిని, ఇక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి ఆయన చలించిపోయి ముఖ్యమంత్రి కేసీఆర్కు బహిరంగ లేఖ రాశారు. ముక్తాపూర్ సమీపంలో జరిగిన విలేకరుల సమావేశంలో సీఎంకు రాసిన లేఖను విడుదల చేశారు.
జోరువానలో పాదయాత్ర
భూదాన్పోచంపల్లి, బీబీనగర్: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర శుక్రవారం బీబీనగర్ మండలం భట్టుగూడెం నుంచి పెద్దరావులపల్లి గ్రామంలోకి ప్రవేశించింది. ఆయా గ్రామాల్లో ఆ పార్టీ శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. పెద్దరావులపల్లి గ్రామంలోని మూసీ నదిని పరిశీలించి మూసీనీటిని సీసాలో సేకరించారు. ఆ గ్రామంలో ఏర్పాటు చేసిన రచ్చబండలో గ్రామస్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. బండి సంజయ్ మాట్లాడుతూ.. జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్రావు మూసీ నది ప్రక్షాళనకు నమో మూసీ పేరుతో పాదయాత్ర చేశారని, జిట్టా బాలకృష్ణారెడ్డి నియోజకవర్గంలో నీటిశుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. ప్రభుత్వానికి ప్రజాసమస్యలపై పట్టింపులేదని విమర్శించారు. గ్రామంలో ఇల్లులేక డబ్బాలో నివాసం ఉంటున్న దివ్యాంగ దంపతులైన గుండె శ్రీనివాస్, రేణుక దంపతులతో మాట్లాడారు. వారి సమస్యకు చలించి సొంతఖర్చుతో ఒక గది నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు. గౌస్కొండ శివారులో భోజన అనంతరం వర్షంలోనే ముక్తాపూర్ వరకు పాదయాత్ర సాగించారు. యాత్రలో నాయకులు గొంగిడి మనోహర్రెడ్డి, గూడూరు నారాయణరెడ్డి, కాసం వెంకటేశం, సినీనటి కవిత, నందకుమార్, కర్నాటి ధనంజయ్య, దాసరి మల్లేశం, సుర్కంటి రంగారెడ్డి, చింతల రామకృష్ణ, ఎన్నం శివకుమార్, చొక్కారెడ్డి పాల్గొన్నారు. అంతకు ముందు గురువారం రాత్రి బస చేసిన బీబీనగర్ మండలం భట్టుగూడెంలో శుక్రవారం ఆయన విలేకరులతో ఇష్టగోష్ఠిలో మాట్లాడారు. ఎవరెన్ని వ్యూహాలు రచించినా మునుగోడ ఉపఎన్నికలో గెలిచేది భాజపానేనని ధీమా వ్యక్తం చేశారు.
ముక్తాపూర్లో వర్షంలో కొనసాగుతున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర
లేఖలోని ముఖ్యాంశాలు..
* నాలుగోరోజు పాదయాత్రలో భాగంగా శుక్రవారం మూసీ పరివాహక ప్రాంతమైన పెద్దరావులపల్లి నుంచి వెళ్తుండగా మూసీ దుస్థితిని చూశాను.. ప్రజలు పడుతున్న ఇబ్బందులు నన్ను కన్నీరు పెట్టించాయి.
* మహిళలకు గర్భస్రావాలు జరుగుతున్నాయి. శారీరక, మానసిక వైకల్యంతో పిల్లలు పుడుతున్నారు.
* మూసీ నీటితో సాగు చేసిన ఆకుకూరల్లో రసాయన అవశేషాలు ఎక్కువ స్థాయిలో ఉన్నట్లు వ్యవసాయశాఖ ఓ పరిశోధనలో తేలింది.
* మూసీ నుంచి 5 కి.మీ వరకు ప్రభావం ఉంది.. 3 కి.మీ పరిధిలో తీవ్రత ఎక్కువగా ఉంది.
* వికారాబాద్ నుంచి వాడపల్లి వరకు 23 కత్వాల ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు అందేది. ఈ కత్వాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. తెరాస ప్రభుత్వ ఈ కత్వాలను పునరుద్దరించే చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరం.
* గుజరాత్లోని సబర్మతి మాదిరిగా మూసీని సుందరీకిస్తామన్నారు. ఆ దిశగా ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు.
* పారిశ్రామిక వ్యర్థాలను మూసీలో కలుపుతున్నా చర్యలు శూన్యం.
* పరివాహక ప్రాంత ప్రజలు బతకలేని దుస్థితిలో ఉన్నారు. వాళ్లు ఎంత దుర్భర పరిస్థితుల్లో ఉన్నారో తెలిసేందుకే మూసీ నీళ్లను కొరియర్ చేస్తున్నా. ఆ నీళ్లను తాగుతావో.. స్నానం చేస్తావో.. ఇంకేం చేస్తావో మీ ఇష్టం.
* ఇప్పటికైనా ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని మూసీ ప్రక్షాళన చేపట్టాలి. ఇందు కోసం రూ. 4 వేల కోట్లు విడుదల చేయాలి. ఎలా స్పందిస్తారో మీ ఇష్టం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల కంట్రోల్ రూమ్ పరిశీలన
[ 25-04-2024]
భువనగిరి ఎన్నికల జనరల్ అబ్జర్వర్ రాబర్ట్ సింగ్ క్షేత్రిమయుమ్ కలెక్టరేటులోని ఎన్నికల కంట్రోల్ రూమ్ను సందర్శించారు. -
భువనగిరి లోక్సభ స్థానానికి 61 మంది నామినేషన్లు
[ 25-04-2024]
భువనగిరి లోక్సభ నియోజకవర్గంలో నామినేషన్ల ఘట్టం ముగిసింది. రికార్డ్ స్థాయిలో 61 మంది నామినేషన్లు వేశారు. -
రిక్షాలో వచ్చి నామినేషన్ పత్రాల్లో తప్పులు సవరించుకున్న ఎంపీ అభ్యర్థి
[ 25-04-2024]
దేశానికి మోదీ అవసరం ఇప్పుడు లేదని శివసేన బలపర్చిన టీపీఎస్ అభ్యర్థి పూస శ్రీనివాస్ అన్నారు. -
ప్రభుత్వంపై విమర్శ.. రైతులకు భరోసా
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సుయాత్ర చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దానిని ఉమ్మడి జిల్లా నుంచే ప్రారంభించడంతో.. భారాస నేతలు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. -
బాలికలు.. భళా
[ 25-04-2024]
విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. -
మోదీతో తెలంగాణకు తీరని అన్యాయం
[ 25-04-2024]
కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ తెలంగాణకు తీరని అన్యాయం చేశారని నల్గొండ లోక్సభ ఇన్ఛార్జి, మంత్రి నల్లమాద ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. -
బాలికలదే హవా
[ 25-04-2024]
రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. -
ఉపాధి కూలీల సౌకర్యాలపై సమీక్ష
[ 25-04-2024]
పని ప్రదేశాలలో ఉపాధి కూలీలకు మౌలిక సౌకర్యాలు సమకూర్చాలని జిల్లా పరిషతు ముఖ్య కార్యనిర్వహణాధికారి శోభారాణి, ఆదనపు డీఆర్డీవో జి.సురేష్, సూచించారు. -
ప్రథమంలో 26.. ద్వితీయంలో 25
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. 2022-23లో జిల్లా ఉత్తీర్ణత శాతం 57 ఉండగా, ప్రస్తుతం 54.50 శాతానికి పడిపోయింది. -
ఊపందుకున్న నామినేషన్ల పర్వం
[ 25-04-2024]
నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాలకు బుధవారం వరకు 45 మంది చొప్పున నామినేషన్లు వేశారు. -
గిరిజన గురుకులాల్లో 88.60శాతం ఉత్తీర్ణత
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో కలిపి ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 88.60శాతం ఫలితాలు -
మతోన్మాద భాజపాను ఓడించండి: సీపీఐ
[ 25-04-2024]
దేశంలో మతోన్మాదం పేరుతో రాజకీయాలు చేస్తున్న భాజపాను ఓడించి కాంగ్రెస్ అభ్యర్ధులను భారీ మెజార్టీతో గెలిపించాలని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. -
విభజన హామీల అమలుకు కృషి
[ 25-04-2024]
భువనగిరి లోక్సభ ఎంపీగా తనను గెలిపిస్తే విభజన హామీలను అమలు చేసేందుకు, నిధులు రాబట్టేందుకు కృషి చేస్తానని భువనగిరి లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. -
తొలి ఎన్నికలోనే అత్యధిక మెజారిటీ
[ 25-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1951లో ఏర్పడగా.. తొలి ఎన్నికలు 1952లో జరిగాయి. -
రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం, వ్యక్తి అరెస్ట్
[ 25-04-2024]
రైల్వేశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని 17 మంది బాధితుల నుంచి నగదు వసూలు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు పోలీస్ ఇన్స్పెక్టర్ అశోక్రెడ్డి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
30 వైడ్ బాడీ విమనాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM