logo

స్వాతంత్య్ర స్ఫూర్తిని వాడవాడలా చాటేందుకే వజ్రోత్సవాలు

భారతదేశ స్వాతంత్య్ర స్ఫూర్తిని వాడవాడలా చాటాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నాయని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌, కలెక్టర్‌ పాటిల్‌ హేమంత్‌ కేశవ్‌, ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ అన్నారు. సూర్యాపేటలో మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌

Published : 12 Aug 2022 06:08 IST

సూర్యాపేటలో ఫ్రీడం రన్‌ను ప్రారంభిస్తున్న ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌, కలెక్టర్‌ పాటిల్‌ హేమంత్‌ కేశవ్‌, ఎస్పీ రాజేంద్రప్రసాద్‌, పుర ఛైర్‌పర్సన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ,  జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్‌, మార్కెట్‌ కమిటీ ఛైర్‌పర్సన్‌ ఉప్పల లలిత, తదితరులు

సూర్యాపేట పురపాలిక, న్యూస్‌టుడే: భారతదేశ స్వాతంత్య్ర స్ఫూర్తిని వాడవాడలా చాటాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వజ్రోత్సవాలు నిర్వహిస్తున్నాయని ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌, కలెక్టర్‌ పాటిల్‌ హేమంత్‌ కేశవ్‌, ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ అన్నారు. సూర్యాపేటలో మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ పెరుమాళ్ల అన్నపూర్ణ, మార్కెట్‌ కమిటీ ఛైర్‌పర్సన్‌ ఉప్పల లలితతో కలిసి ఫ్రీడం రన్‌ను గురువారం ప్రారంభించారు. వజ్రోత్సవాల సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధుల పోరాట పటిమ, త్యాగనిరతిని రోజూ స్మరించుకోవాలన్నారు. వజ్రోత్సవాల్లో యువత, విద్యార్థులు, మహిళలు భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో డీఎస్పీ నాగభూషణం, తహసీల్దారు వెంకన్న, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.
అపశ్రుతి..  ఫ్రీడం రన్‌కు హాజరైన జిల్లా అటవీశాఖ అధికారి ముకుందారెడ్డి స్పృహతప్పి పడిపోయారు. సిబ్బంది సూర్యాపేటలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం డీఎఫ్‌వో ఆరోగ్యం నిలకడగా ఉందని సిబ్బంది తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని