జాతీయ పతాకం ఎగురవేసి ఐక్యత చాటాలి: విప్ సునీత
ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేసి దేశ ఐక్యతను చాటాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత పిలుపునిచ్చారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గురువారం ఉదయం యాదగిరిగుట్ట పట్టణంలో నిర్వహించిన 2కే ఫ్రీడమ్ రన్లో
యాదగిరిగుట్టలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్రీడం రన్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ సునీత, పుర ఛైర్పర్సన్ సుధ, తదితరులు
యాదగిరిగుట్ట అర్బన్, న్యూస్టుడే: ప్రతి ఇంటిపై జాతీయ పతాకాన్ని ఎగురవేసి దేశ ఐక్యతను చాటాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత పిలుపునిచ్చారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గురువారం ఉదయం యాదగిరిగుట్ట పట్టణంలో నిర్వహించిన 2కే ఫ్రీడమ్ రన్లో ఆమె పాల్గొన్నారు. ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, యువకులు, విద్యార్థులు త్రివర్ణ పతాకాలు పట్టుకొని పరుగులు తీస్తూ నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. కార్యక్రమంలో పురపాలిక అధ్యక్షురాలు సుధ, ఎంపీపీ చీర శ్రీశైలం, జడ్పీటీసీ సభ్యురాలు తోటకూరి అనురాధ, పట్టణ సీఐ సైదులు, ఎంపీడీవో ప్రభాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆత్మకూరు(ఎం): ఓ శుభకార్యానికి హాజరయ్యేందుకు ఎమ్మెల్యే గొంగిడి సునీత గురువారం ఆత్మకూరు వచ్చారు. దారి మధ్యలో తెరాస మండల కార్యదర్శి బూడిద శేఖర్ నిర్వహిస్తున్న దుకాణంలో రాఖీలు కొనుగోలు చేశారు.
భువనగిరి పట్టణంలో పరుగు తీస్తున్న ఎమ్మెల్యే శేఖర్రెడ్డి, అదనపు కలెక్టర్ దీపక్ తివారి
స్వాతంత్య్ర స్ఫూర్తి చాటడం గర్వకారణం
భువనగిరి నేరవిభాగం: స్వతంత్ర వజ్రోత్సవాల్లో అందరూ పాల్గొని స్వాతంత్య్ర స్ఫూర్తిని చాటడం గ్వరకారణమని ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. భువనగిరిలోని హైదరాబాద్ చౌరస్తాలో గురువారం ఉదయం నిర్వహించిన ఫ్రీడం రన్ను అదనపు కలెక్టర్ దీపక్తివారితో కలిసి ఆయన ప్రారంభించారు. జాతీయ గీతం ఆలపించి జెండాలను చేతబూని పరుగు తీశారు. హైదరాబాద్ చౌరస్తా నుంచి జూనియర్ కళాశాల మైదానం వరకు పరుగు కొనసాగింది. కార్యక్రమంలో ఏసీపీ వెంకట్రెడ్డి, పుర ఛైర్మన్ ఆంజనేయులు, వైస్ ఛైర్మన్ చింతల కిష్టయ్య, కమిషనర్ నాగిరెడ్డి, ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోరు.. ఖరారు..!
[ 29-03-2024]
నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాల్లో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, భారాస, భాజపా తమ అభ్యర్థులను ఖరారు చేసింది. -
బలవంతులకే.. మరింత బలమై..
[ 29-03-2024]
పోషకాలతో కూడిన ఆహారంతోనే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని భావించిన ప్రభుత్వం గత కొన్ని నెలలుగా రేషన్ బియ్యంలో పోషకాలు కలుపుతోంది. -
భూసారం తగ్గిపోతోంది
[ 29-03-2024]
పెరుగుతున్న రసాయన ఎరువుల వినియోగం.. సమగ్ర నీటి యాజమాన్య పద్ధతులు పాటించకపోవటం, సహజ ఎరువుల వాడకం పూర్తిగా తగ్గించటంతో ఏటా భూమిలో రసాయనాల ప్రభావంతో గాఢత పెరిగిపోతోంది. -
టెట్పై యువత గురి
[ 29-03-2024]
ఉపాధ్యాయ ఉద్యోగం పొందాలంటే ‘టెట్’ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) తప్పనిసరి అయినందున.. ఈ పరీక్ష ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రభుత్వం మెగా డీఎస్సీ ప్రకటించిన విషయం తెలిసిందే. -
బైండోవర్ అతిక్రమిస్తే జైలుకే
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావడంతో శాంతి భద్రతల విఘాతానికి దారి తీసే అంశాలపై పోలీసులు నిఘా పెడుతున్నారు. -
బార్ అధ్యక్షుడిగా సుదర్శన్రెడ్డి ఎన్నిక
[ 29-03-2024]
సూర్యాపేట జిల్లా కోర్టు బార్ అసోసియేషన్కు గురువారం జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా నూకల సుదర్శన్రెడ్డి ఎన్నికయ్యారు. -
కష్టాలెదురైనా విద్యాభ్యాసం కొనసాగించాలి
[ 29-03-2024]
బాలికలు కష్ట నష్టాలెదురైనా విద్యాభ్యాసాన్ని కొనసాగించాలని చౌటుప్పల్ న్యాయస్థానం జూనియర్ సివిల్ జడ్జి మహతి వైష్ణవి సూచించారు. -
లోక రక్షణ కోసమే క్రీస్తు రుధిర తర్పణం
[ 29-03-2024]
క్రీస్తు ప్రభువు మానవాళిని పాప విముక్తులుగా చేసేందుకే అవనిపై అవతరించాడు. -
యాదాద్రీశుడికి శతఘటాభిషేకం
[ 29-03-2024]
పంచనారసింహుల దివ్యక్షేత్రమైన యాదాద్రిలో గురువారం శ్రీలక్ష్మీనరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి సందర్భంగా ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. -
అప్పుతీర్చలేక హత్య చేశారు: డీఎస్పీ
[ 29-03-2024]
మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు.. అవసరం కోసం ఆమె వద్ద అప్పు తీసుకున్నారు.. తీసుకున్న అప్పు తిరిగి తీర్చమని నిలదీస్తే హత్యచేసి ఆనవాళ్లు లేకుండా చేయాలని ప్రయత్నించిన ముగ్గురిని అరెస్టు చేసినట్లు నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపారు. -
మహిళ హత్య కేసులో దోషికి యావజ్జీవ కారాగార శిక్ష
[ 29-03-2024]
మహిళ హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఆరె కుమార్ అలియాస్ చిన్నును దోషిగా తేల్చుతూ భువనగిరి మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టు తీర్పు చెప్పింది.
తాజా వార్తలు (Latest News)
-
రూ.2లక్షల రుణమాఫీపై విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్