అత్యాచారాల నిరోధానికి పకడ్బంది చర్యలు
గ్రామీణ స్థాయిలో ఎస్సీ, ఎస్టీ మహిళలపై జరుగుతున్న అత్యాచారాల నిరోధానికి తీసుకొచ్చిన చట్టాలపై ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ
జాతీయ స్థాయి హెల్ప్లైన్ నెంబర్ గోడపత్రికను ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి, కలెక్టర్ పమేలా సత్పతి, జడ్పీ ఛైర్మన్ సందీప్రెడ్డి, తదితరులు
భువనగిరి, న్యూస్టుడే: గ్రామీణ స్థాయిలో ఎస్సీ, ఎస్టీ మహిళలపై జరుగుతున్న అత్యాచారాల నిరోధానికి తీసుకొచ్చిన చట్టాలపై ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించాలని ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం కలెక్టర్ పమేలా సత్పతి అధ్యక్షతన గురువారం జరిగింది. గ్రామీణ స్థాయిలో నిరక్షరాస్యులే అధికంగా ఉన్నారని, వారికి చట్టాలపై అవగాహన కల్పించేందుకు సమావేశాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. అత్యాచారాల నిరోధానికి పకడ్బందీ చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ తెలిపారు. ఫిర్యాదులపై వెంటనే స్పందించి విచారించాలని అధికారులను ఆదేశించారు. డివిజన్ వారీగా నమోదైన కేసులపై సమీక్షించారు. ప్రతి నెల పౌరహక్కుల దినం నిర్వహించాలని తీర్మానించారు. అత్యాచారాల నిరోధానికి జాతీయ స్థాయి హెల్ప్లైన్ నెంబర్ గోడపత్రికను ఆవిష్కరించారు. జడ్పీ ఛైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, అదనపు కలెక్టర్ దీపక్ తివారి, ఎస్సీ అభివృద్ధి అధికారి జైపాల్రెడ్డి, ఆర్డీవో సూరజ్కుమార్, డీఏవో అనురాధ, ఏసీపీ వెంకట్రెడ్డి, అనధికార సభ్యులు సుదర్శన్, కె.నర్సింగ్రావు, శివలింగం, తిరుమలేశ్, భాస్కర్గౌడ్ పాల్గొన్నారు.
వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిద్దాం
భువనగిరి: స్వతంత్ర భారత వజ్రోత్సవాలను జిల్లాలో ఘనంగా నిర్వహించేందుకు అధికారులు సమాయత్తం కావాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. స్వాతంత్య్ర దిన వేడుకల ఏర్పాట్లపై కలెక్టరేట్ సమావేశ మందిరంలో గురువారం కలెక్టర్ సమీక్షించారు. నూతన కలెక్టరేట్ ఆవరణలోనే వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని సూచించారు. సంక్షేమ శాఖలు తాము చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై స్టాల్స్ ఏర్పాటు చేయాలని, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు విద్యార్థులను సన్నద్ధం చేయాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. రుణాలు, ఆస్తుల పంపిణీకి సంబంధించి సంబంధిత శాఖలు ముందస్తుగా నివేదికలను సిద్ధం చేసుకొని లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు సన్నద్ధం కావాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ దీపక్ తివారి, చౌటుప్పల్ ఆర్డీవో సూరజ్కుమార్, జడ్పీ సీఈవో కృష్ణారెడ్డి, కలెక్టరేట్ ఏవో నాగేశ్వరాచారి, ఏసీపీ వెంకట్రెడ్డి, సీపీవో మాన్యానాయక్, ఎస్ఈ అభివృద్ధి అధికారి జైపాల్రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యామ్సుందర్, డీఈవో నారాయణరెడ్డి, డీపీవో సుందన, డీఏవో అనురాధ, డీఎంహెచ్వో మల్లికార్జున్, మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి, డీటీవో సురేశ్, విద్యుత్తు, అగ్నిమాపక శాఖల అధికారులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దాహం కేకలు తీర్చేందుకు...తరలి వస్తున్న కృష్ణమ్మ
[ 19-04-2024]
నాగార్జునసాగర్ జలాశయం డెడ్స్టోరేజీ దిగువకు చేరినా వేసవిలో హైదరాబాద్ జంట నగరాలు, జిల్లా వాసుల దాహం కేకలు తీర్చేందుకు కృష్ణాజలాల సరఫరాకు హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ (జలమండలి) అధికారులు చేపడుతున్న చర్యలు సఫలీకృతమయ్యాయి -
సైబర్ బాధితులకు వారియర్స్ తోడు
[ 19-04-2024]
చరవాణుల ద్వారా డిజిటల్ లావాదేవీలు పెరగడంతో నిత్యం ఎక్కడో చోట అమాయకులు సైబర్ నేరగాళ్ల వలలో పడి ఆర్థికంగా నష్టపోతున్నారు. -
రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా: మంత్రి ఉత్తమ్
[ 19-04-2024]
కోదాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. -
గాడితప్పిన గస్తీ
[ 19-04-2024]
జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. వరుసగా గొలుసు చోరీలకు పాల్పడుతున్నారు. నిఘా పటిష్ఠం చేసి దొంగలను పట్టుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారు. -
ఆలయ భద్రతపై ఇంత నిర్లక్ష్యమా!
[ 19-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని నిత్యం వేల సంఖ్యలో భక్తులు సందర్శిస్తుంటారు. ఆలయంలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతే లోనికి అనుమతించేందుకు బ్యాగేజ్ స్కానింగ్, మెటల్ డిటెక్టర్, తదితర భద్రతా పరికరాలను వైటీడీఏ కొనుగోలు చేసింది. -
భక్తవత్సలుడికి సంప్రదాయ ఆరాధనలు
[ 19-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో గురువారం స్వయంభువులైన పంచనారసింహులను ఆరాధిస్తూ చేపట్టిన నిత్య పూజలు ఆలయ ఆచారంగా కొనసాగాయి -
కేసీఆర్కు సీఎం రేవంత్రెడ్డే సరైనోడు: రాజగోపాల్రెడ్డి
[ 19-04-2024]
తెలంగాణ ఇచ్చిన పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని.. ఆలస్యం అయినా ప్రవేశపెట్టిన పథకాలను నెరవేర్చి.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని భువనగిరి లోక్సభ ఇన్ఛార్జి, స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. -
నాయకులొస్తున్నారు..!
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్సభ స్థానాలైన నల్గొండ, భువనగిరిలో నామినేషన్ దాఖలు సందర్భంగా భారీ ఎత్తున ర్యాలీలు, సభలు నిర్వహించాలని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలు భారాస, భాజపాలు నిర్ణయించాయి -
67 ఏళ్లలో 69 శాతమే!
[ 19-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1952లో ఏర్పడగా.. 2019 వరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. 2019 నాటికి నియోజకవర్గానికి తొలి ఎన్నికలు జరిగి 67 ఏళ్లు గడిచాయి -
నల్గొండలో నలుగురు, భువనగిరిలో ముగ్గురు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం మొదలైంది. తొలి రోజు గురువారం నల్గొండ లోక్సభ స్థానానికి నలుగురు అభ్యర్థులు ఆరు సెట్లు నామినేషన్లను రిటర్నింగ్ అధికారి, నల్గొండ జిల్లా కలెక్టరు హరిచందనకు అందజేశారు. -
నల్గొండ.. నాయకులకు అండ!
[ 19-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గానికి 18వ సారి ఎన్నికలు జరుగనున్నాయి. ఉమ్మడి జిల్లాలో తొలిసారి ఏర్పడిన ఏకైక లోక్సభ నియోజకవర్గం నల్గొండ మాత్రమే. -
పార్లమెంటు.. ఎంపీ అంటే తెలుసా
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు తమదైన శైలిలో సమావేశాలు నిర్వహిస్తూ ఓటర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు -
వ్యాను ఢీకొని రైతు మృతి
[ 19-04-2024]
ద్విచక్రవాహనాన్ని వ్యాను ఢీకొనడంతో రైతు మృతి చెందిన ఘటన మఠంపల్లి మండలం రఘునాథపాలెం పరిధిలోని వెంకటాయపాలెంలో గురువారం జరిగింది. -
ఇంటి మీద.. అవార్డుల పంట
[ 19-04-2024]
మిద్దె తోటలు.. ఆరోగ్యానికి ఉపయోగపడే కూరగాయలతో పాటు పురస్కారాలనూ తీసుకొస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?