రసవత్తర రాజకీయం
మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్కు ముందే రసవత్తరంగా మారుతోంది. తాజాగా చౌటుప్పల్ ఎంపీపీ తాడూరి వెంకట్రెడ్డి తెరాసను వీడి భాజపాలో చేరడంతో నియోజకవర్గ వ్యాప్తంగా అధికార పార్టీలో కలకలం రేగింది.
చౌటుప్పల్ ఎంపీపీ పార్టీ మార్పుతో తెరాసలో కలకలం
ప్రజాప్రతినిధులు చేజారకుండా కాంగ్రెస్ నేతల సమీక్షలు
ఈనాడు, నల్గొండ: మునుగోడు ఉప ఎన్నిక నోటిఫికేషన్కు ముందే రసవత్తరంగా మారుతోంది. తాజాగా చౌటుప్పల్ ఎంపీపీ తాడూరి వెంకట్రెడ్డి తెరాసను వీడి భాజపాలో చేరడంతో నియోజకవర్గ వ్యాప్తంగా అధికార పార్టీలో కలకలం రేగింది. దీంతో తక్షణం రంగంలోకి దిగిన మంత్రి జగదీశ్రెడ్డి చౌటుప్పల్లోనే మకాం వేసి పరిస్థితులను పర్యవేక్షించారు. మరో మూడు రోజుల్లో మునుగోడులో సీఎం సభ జరగనున్న దృష్ట్యా ఈ పరిణామంతో మరింత మంది అసమ్మతి నేతలు సమావేశం పెట్టకుండా పార్టీకి ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు చేపట్టారు. మరోవైపు 21న మునుగోడులోనే జరిగే అమిత్షా సభలో మరింత మంది తెరాస ప్రజాప్రతినిధులు చేరుతారని తాజాగా పార్టీ మారిన తాడూరి వెంకట్రెడ్డి ప్రకటించడంతో అధికార పార్టీ మరింత అప్రమత్తమైంది. ఇన్నాళ్లూ ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని చేర్చుకోవడంపై దృష్టి సారించిన తెరాస తాజా పరిణామంతో తమ క్యాడర్ను కాపాడుకునే పనిలో నిమగ్నమైంది. నేతలు, కార్యకర్తలు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని, ఉప ఎన్నికలో సర్వేలన్నీ తెరాసకు అనుకూలంగా ఉన్నాయని అసమ్మతి నేతలను ఎమ్మెల్యేలు బుజ్జగిస్తున్నారు. మండలాల వారీగా సమీక్ష సమావేశాలు జరిపి ప్రజాదీవెన సభకు తరలిరావాలని వారు కోరుతున్నారు. ప్రతి మండలంలోని ముఖ్య కార్యకర్తలు, నాయకులతో పాటు కింది స్థాయి క్యాడర్ను కలుస్తున్న మండల ఇన్ఛార్జీలు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి పరిస్థితిని అధిష్ఠానానికి చేరవేస్తున్నారు.
రాజగోపాల్రెడ్డి లక్ష్యంగా కాంగ్రెస్
మరోవైపు తన సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలనే వ్యూహంతో బరిలోకి దిగుతున్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి లక్ష్యంగా మండలాల వారీగా సమీక్షలు నిర్వహిస్తోంది. తాజాగా మంగళవారం నాంపల్లి, మర్రిగూడ మండలాల్లో జరిగిన సమావేశాలకు రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ మధుయాస్కీగౌడ్, పీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, ఉప ఎన్నిక ఇన్ఛార్జి, మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి తదితరులు హాజరై క్యాడర్ చేజారకుండా ప్రణాళికలు వేస్తున్నారు. రానున్న కాలం కాంగ్రెస్దేనని, కార్యకర్తలంతా ఏడాది కాలం ఓపిక పట్టాలని వారు క్యాడర్కు దిశానిర్దేశం చేస్తున్నారు. ముఖ్యంగా సొంత కాంట్రాక్ట్ల కోసం కాంగ్రెస్ పార్టీని, సోనియాగాంధీని రాజగోపాల్రెడ్డి ఎలా మోసం చేశారో తెలియజేయాలని క్యాడర్ను నేతలు కార్యోన్ముఖులను చేస్తున్నారు. మరోవైపు ముఖ్య అనుచరులు, కాంగ్రెస్ పార్టీ నేతలతో రాజగోపాల్రెడ్డి సమావేశమవుతున్నారు. మంగళవారం చౌటుప్పల్లో సమావేశం నిర్వహించి తన వెంట రావాలని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను కోరారు. 21న నిర్వహించనున్న బహిరంగ సభకు జనసమీకరణ చేయాలని, పెద్ద ఎత్తున పార్టీలో చేరేందుకు కార్యకర్తలు తరలిరావాలని విజ్ఞప్తులు చేస్తున్నారు. తెరాసలోని అసమ్మతిని తనకు అనుకూలంగా వాడుకొని సద్వినియోగం చేసుకోవాలని పార్టీ ఆలోచిస్తున్న నేపథ్యంలో వీలైనంత ఎక్కువ మంది తెరాస ప్రజాప్రతినిధులను పార్టీలో చేరేలా వలసలను ప్రోత్సహించాలని నిర్ణయించారు. మరోవైపు భాజపా ఇంకా సన్నద్ధత మొదలుపెట్టకపోవడంతో ముందు నుంచీ భాజపాలో ఉన్న కార్యకర్తలు రాజగోపాల్రెడ్డి నిర్వహించే సమావేశాలకు హాజరుకావడం లేదు. అమిత్షా సభకు మరో నాలుగైదు రోజులే సమయం ఉండటంతో పార్టీ పరంగానూ త్వరలోనే ముఖ్య నేతలు ఇక్కడ రంగంలోకి దిగే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రభుత్వంపై విమర్శ.. రైతులకు భరోసా
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సుయాత్ర చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దానిని ఉమ్మడి జిల్లా నుంచే ప్రారంభించడంతో.. భారాస నేతలు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. -
బాలికలు.. భళా
[ 25-04-2024]
విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. -
మోదీతో తెలంగాణకు తీరని అన్యాయం
[ 25-04-2024]
కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ తెలంగాణకు తీరని అన్యాయం చేశారని నల్గొండ లోక్సభ ఇన్ఛార్జి, మంత్రి నల్లమాద ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. -
బాలికలదే హవా
[ 25-04-2024]
రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. -
ఉపాధి కూలీల సౌకర్యాలపై సమీక్ష
[ 25-04-2024]
పని ప్రదేశాలలో ఉపాధి కూలీలకు మౌలిక సౌకర్యాలు సమకూర్చాలని జిల్లా పరిషతు ముఖ్య కార్యనిర్వహణాధికారి శోభారాణి, ఆదనపు డీఆర్డీవో జి.సురేష్, సూచించారు. -
ప్రథమంలో 26.. ద్వితీయంలో 25
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. 2022-23లో జిల్లా ఉత్తీర్ణత శాతం 57 ఉండగా, ప్రస్తుతం 54.50 శాతానికి పడిపోయింది. -
ఊపందుకున్న నామినేషన్ల పర్వం
[ 25-04-2024]
నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాలకు బుధవారం వరకు 45 మంది చొప్పున నామినేషన్లు వేశారు. -
గిరిజన గురుకులాల్లో 88.60శాతం ఉత్తీర్ణత
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో కలిపి ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 88.60శాతం ఫలితాలు -
మతోన్మాద భాజపాను ఓడించండి: సీపీఐ
[ 25-04-2024]
దేశంలో మతోన్మాదం పేరుతో రాజకీయాలు చేస్తున్న భాజపాను ఓడించి కాంగ్రెస్ అభ్యర్ధులను భారీ మెజార్టీతో గెలిపించాలని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. -
విభజన హామీల అమలుకు కృషి
[ 25-04-2024]
భువనగిరి లోక్సభ ఎంపీగా తనను గెలిపిస్తే విభజన హామీలను అమలు చేసేందుకు, నిధులు రాబట్టేందుకు కృషి చేస్తానని భువనగిరి లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. -
తొలి ఎన్నికలోనే అత్యధిక మెజారిటీ
[ 25-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1951లో ఏర్పడగా.. తొలి ఎన్నికలు 1952లో జరిగాయి. -
రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం, వ్యక్తి అరెస్ట్
[ 25-04-2024]
రైల్వేశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని 17 మంది బాధితుల నుంచి నగదు వసూలు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు పోలీస్ ఇన్స్పెక్టర్ అశోక్రెడ్డి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు