logo

పాఠశాల బస్సు కింద పడి చిన్నారి మృతి

పాఠశాల బస్సు కింద పడి ఓ చిన్నారి మృతి చెందిన ఘటన చౌటుప్పల్‌ పట్టణంలో మంగళవారం సాయంత్రం జరిగింది. చిన్నకొండూరు రోడ్డులోని హైస్కూల్‌ సమీపంలో నివాసం ఉండే గోపాల్‌, నాగరాణి దంపతుల

Published : 17 Aug 2022 04:39 IST


త్రినేశ్‌

చౌటుప్పల్‌గ్రామీణం, న్యూస్‌టుడే: పాఠశాల బస్సు కింద పడి ఓ చిన్నారి మృతి చెందిన ఘటన చౌటుప్పల్‌ పట్టణంలో మంగళవారం సాయంత్రం జరిగింది. చిన్నకొండూరు రోడ్డులోని హైస్కూల్‌ సమీపంలో నివాసం ఉండే గోపాల్‌, నాగరాణి దంపతుల రెండో కుమారుడు పాలకూర్ల త్రినేశ్‌(7) మల్లికార్జున పాఠశాలలో చదువుతున్నాడు. సాయంత్రం పాఠశాల ముగిసిన అనంతరం బస్సులో ఇంటికి బయలుదేరాడు. హైస్కూల్‌ వద్ద డ్రైవర్‌ బస్సును నిలుపగా.. విద్యార్థి త్రినేశ్‌ బస్సు దిగే క్రమంలో అదుపు తప్పి కిందపడ్డాడు. డ్రైవర్‌ గమనించకుండానే ముందుకు కదిలించడంతో విద్యార్థి పైనుంచి బస్సు వెనుక టైరు వెళ్లింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విద్యార్థి త్రినేశ్‌ను మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందాడు. ఈ విషయమై చౌటుప్పల్‌ ఎస్సై సైదులును సంప్రదించగా తమకు సమాచారం అందిందని, ఇంకా ఫిర్యాదు రాలేదని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు