కాంట్రాక్టుల కోసమే సొంత పార్టీకి వెన్నుపోటు: కాంగ్రెస్
కాంట్రాక్టుల కోసమే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి భాజపాలో చేరుతున్నారని టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లు రవి, మాజీ పార్లమెంటు సభ్యుడు
నాంపల్లిలో కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి చిత్రంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు
మాధవి, చెరుకు సుధాకర్, చల్లమల్ల కృష్ణారెడ్డి, టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లు రవి, మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జి
గాలి అనిల్కుమార్, మాజీ ఎంపీ అంజన్కుమార్ యాదవ్, పున్న కైలాశ్ నేత, పాల్వాయి స్రవంతి
నాంపల్లి, న్యూస్టుడే: కాంట్రాక్టుల కోసమే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి భాజపాలో చేరుతున్నారని టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లు రవి, మాజీ పార్లమెంటు సభ్యుడు అంజన్కుమార్ యాదవ్, మాజీ మంత్రి, కాంగ్రెస్ సీˆనియర్ నాయకులు రాంరెడ్డి దామోదర్రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా నాంపల్లిలో మంగళవారం నిర్వహించిన మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. 2018 ఎన్నికల్లో రాష్ట్రంలో తెరాస పార్టీ గాలి వీస్తుంటే మునుగోడు నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థిగా రాజగోపాల్రెడ్డికి 22 వేల ఓట్ల మెజార్టీతో విజయం కట్టబెట్టారని పేర్కొన్నారు. కార్యకర్తల అభిమానాన్ని భాజపా, అమిత్షా వద్ద తాకట్టు పెట్టారని విమర్శించారు. భాజపా, తెరాస నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలను ప్రలోభాలకు గురి చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. మునుగోడు గడ్డ కాంగ్రెస్కు అడ్డా వంటిదని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా పార్టీ టికెట్ ఇచ్చిన అభ్యర్థిని గెలిపించి గుణపాఠం చెప్పాలన్నారు. రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అనే నినాదాన్ని ప్రజలకు చేరేలా కార్యకర్తలు కృషి చేయాలన్నారు. ఈ నెల 20 నుంచి పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మునుగోడు నియోజకవర్గంలో పర్యటిస్తారని, అదే రోజు రాజీవ్గాంధీ జయంతి పురస్కరించుకొని ప్రతి గ్రామంలో పార్టీ జెండాలు ఎగురవేయాలని రాంరెడ్డి దామోదర్రెడ్డి కార్యకర్తలకు సూచించారు. నల్గొండ డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జి గాలి అనిల్కుమార్, సూర్యాపేట డీసీసీ అధ్యక్షుడు వెంకన్నయాదవ్, జిల్లా మహిళా అధ్యక్షురాలు గోపు మాధవి, పాల్వాయి స్రవంతి, నాయకులు చలమల్ల కృష్ణారెడ్డి, పల్లె రవికుమార్, పున్న కైలాశ్ నేత, చెరుకు సుధాకర్, చండూరు ఎంపీపీ కళ్యాణి, తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నీటిలోని చేపొచ్చి.. నేలమీద పడుతోంది..!
[ 28-03-2024]
తగ్గుతున్న భూగర్భ జలాలతో రైతులతో పాటు మత్స్యకారులు నష్టపోతున్నారు. ఉమ్మడి జిల్లాలోని చెరువుల నీటిమట్టాలు రోజురోజుకూ తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో చెరువుల్లోని చేపలు తగినంత పరిమాణం పెరగక ముందే పట్టేసి విక్రయించాల్సిన దుస్థితి నెలకొంది. -
వారివి చుట్టపు చూపులే..!
[ 28-03-2024]
గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన అస్తవ్యస్తంగా మారింది. ఎంపీడీవోలు, పంచాయతీరాజ్, నీటిపారుదల, పశుసంవర్థక,రెవెన్యూ, విద్యాశాఖాధికారులను క్లస్టర్ల వారీగా ప్రత్యేకాధికారులుగా ప్రభుత్వం నియమించింది. -
కోడిపిల్లల అరుపు.. వినిపించదేం..!
[ 28-03-2024]
ఉమ్మడి జిల్లా నుంచి కొందరు రాయితీ కోడి పిల్లల పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. ఏడాది క్రితం రూ.1030, రూ.600 చొప్పున డీడీలు తీశారు. అప్పటి నుంచి పశుసంవర్ధక శాఖ అధికారుల చుట్టూ తిరుగుతున్నా.. -
నేటి నుంచి ధాన్యం కొనుగోళ్లు: అదనపు కలెక్టర్
[ 28-03-2024]
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలు గురువారం నుంచి ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. -
పురంలో.. దాహం తీరేలా..!
[ 28-03-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పురపాలికల్లో ప్రజల దాహార్తిని తీర్చేందుకు అమృత్-2.0 పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగసామ్యంతో రూ.491.46 కోట్లతో చేపట్టనున్న పనులకు సెప్టెంబరు 2023లో రాష్ట్ర పురపాలకశాఖ పరిపాలనా అనుమతి మంజూరు చేసింది. -
దగా ఆలోచనలపై.. నిఘా
[ 28-03-2024]
గత అసెంబ్లీ ఎన్నిల సందర్భంగా 28 ఏళ్ల యువకుడు భువనగిరి నియోజకవర్గంలో ప్రధాన పార్టీ అభ్యర్థికి సంబంధించిన అభ్యంతరకరమైన వీడియోను సృష్టించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. -
గ్రామాల్లో డ్రోన్ కలకలం
[ 28-03-2024]
యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని పాచిల్ల, తుర్కలషాపురం, రామారం, వంగాల, గుండాల గ్రామాల మీదుగా నిత్యం డ్రోన్లు ఎగురవేస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. -
ఆట కట్టించలేరా..?
[ 28-03-2024]
జిల్లాలో జూదం జోరుకు కళ్లెం పడటం లేదు. పచ్చని కాపురాల్లో ఈ ఆట చిచ్చుపెడుతోంది. పోలీసుల దాడులకూ వెరవడం లేదు. ఈ నెల 16న ‘ఈనాడు’లో ప్రచురితమైన ‘తోటలో కాసుల వేట’... -
చివరికి అందేలా..ఆశలు నెరవేరేలా..!
[ 28-03-2024]
కొత్త ప్రభుత్వం ముక్త్యాల బ్రాంచి కాలువ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నాగార్జునసాగర్ ఎడమ కాలువ పరిధిలోని అతిపెద్ద బ్రాంచి కాలువ అయిన ముక్త్యాలకు ఆధునికీకరణ పనులు మళ్లీ మొదలయ్యాయి. -
వాడే ముందు జాగ్రత్త
[ 28-03-2024]
రోడ్డు ప్రమాదంలో కోదాడ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి కాలికి స్వల్ప గాయమవడంతో పట్టణంలోని ఓ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ కాలపరిమితి దాటిన బ్యాండేజీ కాలుకి కట్టడంతో వాపు తగ్గలేదు. -
బంధం ఎందుకో.. బలహీన పడుతోంది
[ 28-03-2024]
వివాహేతర సంబంధం, వేధింపులు.. కారణం ఏదైనా కడదాక కలిసి ఉంటామని పెళ్లి మండపంలో ప్రమాణం చేసిన కొందరు మహిళలు కట్టుకున్న భర్తలను అర్ధంతరంగా కానరాని లోకాలకు పంపేస్తున్నారు. -
ప్రచార అనుమతులకు సువిధ
[ 28-03-2024]
ఓటింగ్ ప్రక్రియను సులభతరం చేయడంతో పాటు సాంకేతికతను ఉపయోగించడం ద్వారా సమయాన్ని ఆదా చేయడంతో పాటు ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. -
సాఫ్ట్గా రాణిస్తూ.. పతకాలు కొట్టేస్తూ..!
[ 28-03-2024]
గ్రామీణ ప్రాంతాల వారికి కబడ్డీ, ఖో ఖో, వాలీబాల్ లాంటి ఆటలు మాత్రమే ఎక్కువగా పరిచయం. సాఫ్ట్బాల్ క్రీడ చాలామందికి కొత్తదే. అయినప్పటికీ పల్లెల్లో దశాబ్దకాలంగా విద్యార్థులు ఈ క్రీడపై ఆసక్తి కనబర్చుతున్నారు. -
భువనగిరి బరిలో చామల
[ 28-03-2024]
ఎడతెగని ఉత్కంఠ నడుమ అధికార కాంగ్రెస్ పార్టీ తమ భువనగిరి లోక్సభ ఎంపీ అభ్యర్థిగా చామల కిరణ్కుమార్రెడ్డిని ప్రకటించింది. ఆయన ఇక్కడి నుంచి ఎంపీగా పోటీ చేయడం ఇదే తొలిసారి.
తాజా వార్తలు (Latest News)
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
-
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!
-
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ
-
పార్ట్టైమ్ ఉద్యోగాల స్కామ్.. రూ.32.34 కోట్లు అటాచ్
-
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు