logo

BJP: మునుగోడు బహిరంగ సభకు భాజపా ఇన్‌ఛార్జ్‌ల నియామకం

నల్గొండ జిల్లా మనుగోడులో భాజపా నిర్వహించతలపెట్టిన బహిరంగ సభకు జనసమీకరణ, ఇతర ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఆ పార్టీ  అధ్యక్షుడు బండి సంజయ్‌ ఇన్‌ఛార్జ్‌లను నియమించారు.

Published : 17 Aug 2022 23:56 IST

హైదరాబాద్‌: నల్గొండ జిల్లా మనుగోడులో భాజపా నిర్వహించతలపెట్టిన బహిరంగ సభకు జనసమీకరణ, ఇతర ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఆ పార్టీ  అధ్యక్షుడు బండి సంజయ్‌ ఇన్‌ఛార్జ్‌లను నియమించారు. మండలానికి ఇద్దరు చొప్పున సీనియర్ నేతలకు బాధ్యతలను అప్పగించారు.

చౌటుప్పల్ రూరల్‌ మండలానికి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, చౌటుప్పల్ మున్సిపాలిటీకి గరికపాటి మోహన్ రావు, ఏనుగు రవీందర్ రెడ్డి, మునుగోడుకు ఎమ్మెల్యే ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, సంస్థాన్ నారాయణపురానికి మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, మాజీ ఎంపీ రవీంద్ర నాయక్, చండూరుకు మాజీ ఎంపీ చాడా సురేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, చండూరు మున్సిపాలిటీకి ఎమ్మెల్యే రాజాసింగ్, విజయపాల్ రెడ్డి, గట్టుప్పల్‌కు ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్‌, మర్రిగూడెంకు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, టి.ఆచారి, నాంపల్లికి మాజీ మంత్రి ఏ.చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే ధర్మారావును నియమించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని