అడిగినంత ఇవ్వకుంటే..కరెంటు షా( సా)కులే
ముడుపులిస్తే ముందుకు.. లేదంటే ఆగినట్టే..’ ఇలా డిమాండ్లు పెట్టిమరీ విద్యుత్ అధికారులు రైతుల వద్ద వసూళ్లకు తెగబడుతున్నారు. లేదంటే అనివార్యమైన పనుల్ని పక్కన పడేస్తున్నారు. రైతుల్ని ఆర్థికంగా కుంగదీస్తున్నారు. మానసిక వ్యథకు గురి చేస్తున్నారు. వీరిలో శాఖ వారు కొందరైతే.
అన్నదాతలను ఆర్థికంగా కుంగదీస్తున్న ఘటనలు కోకొల్లలు
మేళ్లచెరువు, న్యూస్టుడే: ‘ముడుపులిస్తే ముందుకు.. లేదంటే ఆగినట్టే..’ ఇలా డిమాండ్లు పెట్టిమరీ విద్యుత్ అధికారులు రైతుల వద్ద వసూళ్లకు తెగబడుతున్నారు. లేదంటే అనివార్యమైన పనుల్ని పక్కన పడేస్తున్నారు. రైతుల్ని ఆర్థికంగా కుంగదీస్తున్నారు. మానసిక వ్యథకు గురి చేస్తున్నారు. వీరిలో శాఖ వారు కొందరైతే.. ఈ శాఖ పేరు చెప్పుకుని జేబులు నింపుకునే అక్రమార్కులు మరికొందరు. రైతుల అవసరాన్నే అవకాశంగా తీసుకుని రెచ్చిపోతున్నారు. అందినకాడికి దండుకుంటున్నారు. ఈ ద్వయానికి ముడుపులివ్వకుంటే అన్నీ కరెంటు షా(సా)కులే చూపిస్తున్నారు. ఇక్కడ విశేషమేంటంటే.. జిల్లాలో విద్యుత్ శాఖాధికారులను అవినీతి నిరోధక శాఖ వలకు పట్టించే వారు ఆ శాఖ గుత్తేదారులుగా ఉండడం!
జేబులు నింపుకొనే తీరుకు నిదర్శనం
మేళ్లచెరువులో ఇటీవల కాలంలో కొందరు రైతులు రెండు వ్యవసాయ విద్యుత్ నియంత్రికలకు డీడీలు చెల్లించారు. వారికి నియంత్రికలతో పాటు దాదాపు 40 స్తంభాలు, లైను అవసరమైన తీగలు మంజూరయ్యాయి. ఇందుకు ఓ అధికారి పేరుచెప్పి రూ.30 వేలు ఒకరు రైతుల నుంచి వసూలు చేశాడు. నెలలు తిరిగినా పనికాలేదు. మళ్లీ ఇదే శాఖకు చెందిన మరొకరు రూ.లక్ష ఇస్తే చేయిస్తానన్నాడు. నగదు పోయినా అవసరం తీరాలంటూ రూ. 50 వేలు ముట్టజెప్పారు. తర్వాత రైతులే నియంత్రికలు తెచ్చుకున్నారు. దిమ్మెలు కట్టుకున్నారు. గుంతలు తీసుకున్నారు. స్తంభాలు పాతుకున్నారు. లైన్లూ లాక్కున్నారు. ఈమధ్యే పనులు పూర్తి చేసుకున్నారు. వాస్తవంగా ఇవన్నీ గుత్తేదారు చేయాల్సిన పనులు. సదరు గుత్తేదారు నగదు మిగిల్చుకునేందుకు తెలివిగా రైతులతో చేయించారు. మొత్తమ్మీద చెల్లించిన డీడీలకు రెట్టింపుగా ముడుపులు చెల్లించాల్సి వచ్చింది. ఇలా వందల సంఖ్యలో వ్యవసాయ కనెక్షన్ల పేరుతో దండుకుంటున్న వైనాలు బోలెడున్నాయి.
దొరికితేనే దొంగ..
అవినీతి నిరోధక శాఖకు దొరికిన వారే ఈ శాఖలో దోషులుగా కన్పిస్తున్నారు. దొరక్కండా దోపిడీ పర్వాన్ని కొనసాగిస్తున్న వారు రూ.కోట్లకు పడగలెత్తుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఇలాంటి వారు ఈ వ్యవస్థనే ప్రభావితం చేస్తున్నారు. ఏసీబీకి పట్టుబడినా శాఖలో మార్పు రావడం లేదు. చిన్నపనికీ అధికారులు, సిబ్బంది చేయి తడపనిదే పనులు కావడం లేదు. వీరికి ఈ మధ్య కొందరు గుత్తేదారులు తోడయ్యారు. ఒప్పుకున్న పనిని వీరూ నిర్లక్ష్యం చేస్తున్నారు. తేడావస్తే పనినే ఎగ్గొడుతున్నారు. వెరసి.. నిర్లక్ష్యానికి ప్రాణాల్నే మూల్యంగా చెల్లించుకోవాల్సి వస్తోంది. మేళ్లచెరువు మండలంలో గతంలో ముగ్గురు ఏఈలు, సిబ్బంది సస్పెన్షన్కు కారణాలివే.
వారూ వీరూ బంధువులే
ఉమ్మడి జిల్లా విద్యుత్ శాఖలో చాలామంది బంధువులే ఉన్నట్టు తెలుస్తోంది. కొందరు అధికారులు, రిటైర్డైన వారు, కిందిస్థాయి సిబ్బందితో సహా చాలామంది వారి బంధుప్రీతి ప్రదర్శిస్తున్నారని విమర్శలు బలంగా విన్పిస్తున్నాయి. ఈ శాఖ పనులు చేపట్టాలంటే గుత్తేదారులు అవసరం. వివిధ పద్ధతుల్లో పనులు సొంతం చేసుకునేందుకు పైన పేర్కొన్న వారిలో కొందరు వారి బంధువులనే గుత్తేదారు అవతారమెత్తిస్తున్నారని విశ్వసనీయ సమాచారం. కొన్నేళ్లుగా పనులు ఇలాగే చేపడుతున్నారన్న వాదనలు ఉన్నాయి. ప్రధానంగా వ్యవసాయ విద్యుత్ నియంత్రికల మంజూరు, దిమ్మెల నిర్మాణం, స్తంభాలు, లైన్ల ఏర్పాటు, విద్యుత్ లైన్ల మార్పిడి వంటి పనులు చేపట్టే క్రమంలో.. అనుమతులు, లావాదేవీలతో ముడిపడి ఉంటాయనేది బహిరంగ రహస్యమైంది. ఈ క్రమంలోనే పనుల్లో జాప్యం, రైతుల్లో అసంతృప్తి చెలరేగడం, గుత్తేదారులు, అధికారుల మధ్య సమన్వయ లోపం వెరసి.. పైవిధంగా ఏసీబీ కి పట్టుబడే పరిస్థితులకు దారితీస్తున్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాటలే తూటాలై..!
[ 24-04-2024]
‘నల్గొండ జిల్లా సాగునీటి రంగానికి కేసీఆర్ తీరని అన్యాయం చేశారు. బస్సు యాత్ర కాదు, మోకాళ్ల యాత్ర చేసినా భారాసకు ఎవరూ ఓటేయరు. -
వైభవంగా హనుమాన్ జయంతి
[ 24-04-2024]
హనుమాన్ జయంతి సందర్భంగా మంగళవారం ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపించారు. స్వామి వారికి సింధూరంతో అభిషేకం, తమల పాకులతో పూజలు నిర్వహించారు. -
పాఠాలకు బై.. ఆటలకు సై..!
[ 24-04-2024]
వేసవి సెలవులు వచ్చేశాయ్.. పది నెలల పాటు నిత్యం బడుల్లో పాఠాలు చదవడం, రాయడం తదితర పనుల్లో నిమగ్నమై ఉన్న చిన్నారులకు ఈ నెల 24 (బుధవారం) నుంచి మొదలయ్యే సెలవులతో ఉపశమనం లభించింది. -
అట్టహాసంగా కంచర్ల నామినేషన్
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతలకు తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. -
పార్టీ గుర్తుల చరిత్ర ఇదే
[ 24-04-2024]
రాజకీయ పార్టీలనగానే గుర్తొచ్చేది వాటి గుర్తులే. ప్రధానంగా ఎన్నికల సమయంలో పార్టీ అభ్యర్థుల కంటే గుర్తులకే ప్రాధాన్యం ఉంటుంది. -
వారు.. శాసనసభకు, లోక్సభకు ఎన్నికయ్యారు!
[ 24-04-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కొందరు నేతలు శాసనసభకు, లోక్సభకు ఎన్నికయ్యారు. దేశంలోనే అత్యధిక ఓట్లు సాధించి రికార్డు సృష్టించారు. -
ప్రలోభాల ఎర.. తప్పదు చెర!
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికలు మే 13న జరగనున్నాయి. ఇప్పటికే నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో ప్రచారం ఊపందుకుంటోంది. -
ఆహారం సేకరించి.. అభాగ్యుల ఆకలి తీర్చి..
[ 24-04-2024]
దేశంలో ఒక వైపు రెండు పూటలా తినడానికి తిండి లేక వేలాది మంది అవస్థలు పడుతున్నారు. మరో వైపు నిత్యం లక్షల టన్నుల ఆహార పదార్థాలు వ్యర్థాలుగా మారుతున్నాయి. -
లోక్సభలో గళం విప్పే అవకాశం ఇవ్వండి: జహంగీర్
[ 24-04-2024]
ప్రజాసమస్యల పరిష్కారానికి జనం వెన్నంటే ఉండి నిరంతరం పోరాటాలు చేస్తున్న తనకు మద్దతుగా నిలిచి గెలిపిస్తే పార్లమెంటులో ఈ ప్రాంత సమస్యలపై గళం విప్పుతానని భువనగిరి లోక్సభ సీపీఎం అభ్యర్థి ఎండీ.జహంగీర్ అన్నారు. -
గత పొరపాట్లు పునరావృతం కావొద్దు: కలెక్టర్
[ 24-04-2024]
త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో సెక్టార్, పోలీసు అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ వెంకటరావు అన్నారు. -
బడికి నిధులు
[ 24-04-2024]
యాదాద్రి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం రూ.25 కోట్లు మంజూరు చేసింది. ఈ పనులను అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా చేపట్టనున్నారు. -
అతిథులు తరలొచ్చె.. బూర పూరించె..!
[ 24-04-2024]
ఓట్ల కోసం అనాదిగా మత రాజకీయాలు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీయేనని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. -
వేస్తున్నారు నామినేషన్లు..!
[ 24-04-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కొనసాగుతోంది. -
అభ్యర్థులిద్దరూ ‘బీఎన్ రెడ్డి’లే..!
[ 24-04-2024]
మిర్యాలగూడ లోక్సభ నియోజకవర్గంలో 1989, 1991 ఎన్నికల్లో ప్రధాన అభ్యర్థులిద్దరూ బీఎన్రెడ్డిలే. ఒకరు వాస్తుశిల్పి బద్దం నర్సింహారెడ్డి. మరొకరు భీంరెడ్డి నర్సింహారెడ్డి. -
1,29,766 ఓట్లు కొల్లగొట్టిన స్వతంత్రులు
[ 24-04-2024]
ఫ్లోరైడ్కు వ్యతిరేకంగా జలసాధన సమితి ఆధ్వర్యంలో 1996 లోక్సభ ఎన్నికల్లో 476 మంది స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో వీరు 1,29,766 ఓట్లు సాధించారు.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
-
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
-
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్
-
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్