logo

రక్తదానం మహాదానం: కంచర్ల

రక్తదానానికి మించిన దానం మరొకటి లేదని నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా బుధవారం జిల్లా కేంద్రంలోని జనరల్‌ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన

Published : 18 Aug 2022 05:09 IST

రక్తదాన శిబిరం ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి

నల్గొండ అర్బన్‌, న్యూస్‌టుడే: రక్తదానానికి మించిన దానం మరొకటి లేదని నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి అన్నారు. భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా బుధవారం జిల్లా కేంద్రంలోని జనరల్‌ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన ఉచిత రక్తదాన శిబిరంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎక్కువసార్లు రక్తదానం చేసిన పలువురికి ప్రశంసా పత్రాలు అందజేశారు. మున్సిపల్‌ ఛైర్మన్‌ మందడి సైదిరెడ్డి, డీసీహెచ్‌ మాతృనాయక్‌, డీఎంహెచ్‌వో కొండల్‌రావు, ఆసుపత్రి సూపరింటెండెంట్‌ లచ్చునాయక్‌, డా.పుల్లారావు, ప్రశాంత్‌ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా కేంద్రం సమీపంలోని 12వ పటాలంలో బుధవారం ఏర్పాటు చేసిన ఉచిత రక్తదాన శిబిరంలో కమాండెంట్‌ ఎన్వీ సాంబయ్య పాల్గొని మాట్లాడారు. జిల్లా కేంద్రంలోని జైలులో ఉచిత వైద్య శిబిరంలో జిల్లా ఇండస్ట్రియల్‌ అధికారి కోటేశ్వర్‌రావు జైలు సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడారు. జైలు సూపరింటెండెంట్‌ దేవ్‌లా, జైలర్‌ అనిల్‌కుమార్‌, సిబ్బంది నరేష్‌, శ్రీనివాస్‌రెడ్డి, రామలింగయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని