లండన్లో బీటెక్ విద్యార్థి బలవన్మరణం
పిల్లల జీవితాలను అందంగా తీర్చిదిద్దాలనుకున్నారు. ఉన్నత చదువులకు లండన్ పంపారు. కానీ.. కొడుకు విషయంలో వారి ఆకాంక్షలు అర్థాంతరంగా ఛిద్రమయ్యాయి. తండ్రి మరణంతో పుట్టెడు దుఖంలో మునిగిన కూతురికి..
రైలు కిందపడటంతో ఛిద్రమైన శరీరం
తాత శంభిరెడ్డితో సాయి మోహన్రెడ్డి (పాత చిత్రం)
మేళ్లచెరువు, హుజూర్నగర్, న్యూస్టుడే: పిల్లల జీవితాలను అందంగా తీర్చిదిద్దాలనుకున్నారు. ఉన్నత చదువులకు లండన్ పంపారు. కానీ.. కొడుకు విషయంలో వారి ఆకాంక్షలు అర్థాంతరంగా ఛిద్రమయ్యాయి. తండ్రి మరణంతో పుట్టెడు దుఖంలో మునిగిన కూతురికి.. తన కొడుకూ ఇక లేడన్న వార్త తెలీడంతో కుప్పకూలిపోయింది. ఈ విషాదం లండన్లో ఈనెల 21తేదీన బుధవారం చోటుచేసుకుంది. సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం దొండపాడుకు చెందిన అన్నపురెడ్డి కనకారెడ్డి, మేళ్లచెరువు మండలం వేపలమాధారం వాసి గుజ్జల శంభిరెడ్డి కూతురు కవితకు పాతికేళ్ల కిందట వివాహమైంది. వారు హుజూర్నగర్లో ప్రింటింగ్ ప్రెస్ నిర్వహిస్తున్నారు. వారి కూతురు స్వాతి ఎంటెక్, కొడుకు సాయి మోహన్రెడ్డి(19) బీటెక్ చివరి ఏడాది లండన్లోని బర్మింగ్హామ్లో చదువుతున్నారు. వారిద్దరూ మేనమామ కూతురు నవ్య, భర్త అజయ్రెడ్డితో కలిసి ఉంటున్నారు.. కళాశాలకు 2 నెలలు సెలవులు పార్ట్ టైం ఉద్యోగంలో చేరారు. ఈనెల 21వ తేదీన అజయ్రెడ్డి, నవ్య ఉదయాన్నే విధులకు వెళ్లిపోయారు. అక్కను సాయి కారులో ఆఫీస్లో దింపి నలతగా ఉందని ఇంటికి వెళ్లిపోయారు. సాయంత్రం స్వాతి తమ్ముడికి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. ఈ విషయాన్ని స్వాతి అజయ్రెడ్డికి ఫోన్ చేసి చెప్పగా అతను వచ్చి ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. అంతకుముందే డ్యూటీ నుంచి ఇంటికి వస్తున్న అజయ్కు సాయి రోడ్డుపై కన్పించడంతో పలుకరించగా రూంకి తర్వాత వస్తానని చెప్పాడు. అప్పటి నుంచే ఫోన్ పనిచేయలేదు. అనుమానంతో తెలిసిన ప్రాంతాల్లో వెతికి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరుసటి రోజు గురువారం పోలీసులు గుర్తు తెలియని చరవాణి, చెప్పులు, కళ్లద్దాలను చూపించడంతో సాయివిగా గుర్తించారు. సాయంత్రం 5.30 తర్వాత ట్రైన్కు ఎదురుగా నిలబడి బలన్మరణానికి పాల్పడ్డారని ప్రమాద ఘటన గురించి పోలీసులు వారికి చెప్పారు. ప్రమాద దృశ్యాలను చూపించారు. రైలు కింద పడటంతో సాయి మృతదేహం ఛిద్రమైంది. ఈనెల 24వ తేదీన సాయి తాత గుజ్జుల శంభిరెడ్డి పెద్ద ఖర్మ వేపలమాధారంలో నిర్వహించనుండగా ఆ కార్యక్రమానికి వెళ్తున్న తల్లిదండ్రులకు ఈ ప్రమాద ఘటన తెలిసి గుండె పగిలినట్టైంది. కొడుకు వద్దకు వెళ్లాలని తల్లి కవిత వీసా కూడా సిద్ధం చేసుకున్నారు. 13వ తేదీన తండ్రి శంభిరెడ్డి మరణించడంతో వాయిదా వేసుకున్నారు. యువకుడి మేనమామ కొండారెడ్డి 19వ తేదీన సాయితో చరవాణిలో మాట్లాడారు. ఆ సమయంలో కొంత దిగాలుగా మాట్లాడినట్లు గుర్తించినా ఇలా ఆత్మహత్య చేసుకుంటాడని అనుమానంచలేదని ‘న్యూస్టుడే’ కు కొండారెడ్డి చెప్పారు. సాయికి ఏమి ఇబ్బంది వచ్చిందనే విషయం తమకూ అర్థం కావడం లేదని ఆ దంపతులు, బంధువులు తల్లఢిల్లిపోతున్నారు. యువకుడి మరణ వార్తతో రెండు గ్రామాల్లో విషాదం నెలకొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోరు.. ఖరారు..!
[ 29-03-2024]
నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాల్లో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, భారాస, భాజపా తమ అభ్యర్థులను ఖరారు చేసింది. -
బలవంతులకే.. మరింత బలమై..
[ 29-03-2024]
పోషకాలతో కూడిన ఆహారంతోనే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని భావించిన ప్రభుత్వం గత కొన్ని నెలలుగా రేషన్ బియ్యంలో పోషకాలు కలుపుతోంది. -
భూసారం తగ్గిపోతోంది
[ 29-03-2024]
పెరుగుతున్న రసాయన ఎరువుల వినియోగం.. సమగ్ర నీటి యాజమాన్య పద్ధతులు పాటించకపోవటం, సహజ ఎరువుల వాడకం పూర్తిగా తగ్గించటంతో ఏటా భూమిలో రసాయనాల ప్రభావంతో గాఢత పెరిగిపోతోంది. -
టెట్పై యువత గురి
[ 29-03-2024]
ఉపాధ్యాయ ఉద్యోగం పొందాలంటే ‘టెట్’ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) తప్పనిసరి అయినందున.. ఈ పరీక్ష ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రభుత్వం మెగా డీఎస్సీ ప్రకటించిన విషయం తెలిసిందే. -
బైండోవర్ అతిక్రమిస్తే జైలుకే
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావడంతో శాంతి భద్రతల విఘాతానికి దారి తీసే అంశాలపై పోలీసులు నిఘా పెడుతున్నారు. -
బార్ అధ్యక్షుడిగా సుదర్శన్రెడ్డి ఎన్నిక
[ 29-03-2024]
సూర్యాపేట జిల్లా కోర్టు బార్ అసోసియేషన్కు గురువారం జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా నూకల సుదర్శన్రెడ్డి ఎన్నికయ్యారు. -
కష్టాలెదురైనా విద్యాభ్యాసం కొనసాగించాలి
[ 29-03-2024]
బాలికలు కష్ట నష్టాలెదురైనా విద్యాభ్యాసాన్ని కొనసాగించాలని చౌటుప్పల్ న్యాయస్థానం జూనియర్ సివిల్ జడ్జి మహతి వైష్ణవి సూచించారు. -
లోక రక్షణ కోసమే క్రీస్తు రుధిర తర్పణం
[ 29-03-2024]
క్రీస్తు ప్రభువు మానవాళిని పాప విముక్తులుగా చేసేందుకే అవనిపై అవతరించాడు. -
యాదాద్రీశుడికి శతఘటాభిషేకం
[ 29-03-2024]
పంచనారసింహుల దివ్యక్షేత్రమైన యాదాద్రిలో గురువారం శ్రీలక్ష్మీనరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి సందర్భంగా ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. -
అప్పుతీర్చలేక హత్య చేశారు: డీఎస్పీ
[ 29-03-2024]
మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు.. అవసరం కోసం ఆమె వద్ద అప్పు తీసుకున్నారు.. తీసుకున్న అప్పు తిరిగి తీర్చమని నిలదీస్తే హత్యచేసి ఆనవాళ్లు లేకుండా చేయాలని ప్రయత్నించిన ముగ్గురిని అరెస్టు చేసినట్లు నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపారు. -
మహిళ హత్య కేసులో దోషికి యావజ్జీవ కారాగార శిక్ష
[ 29-03-2024]
మహిళ హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఆరె కుమార్ అలియాస్ చిన్నును దోషిగా తేల్చుతూ భువనగిరి మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టు తీర్పు చెప్పింది.
తాజా వార్తలు (Latest News)
-
‘పన్ను ఉగ్రవాదాన్ని ఆపండి’.. రూ.1823 కోట్ల నోటీసులపై కాంగ్రెస్ మండిపాటు
-
9 అసెంబ్లీ, 4 పార్లమెంట్ స్థానాలకు తెదేపా అభ్యర్థులు వీళ్లే
-
బిహార్లో తేలిన సీట్ల లెక్క.. 26 స్థానాల్లో ఆర్జేడీ, 9 చోట్ల కాంగ్రెస్
-
జనసేనలో చేరతానని నేను చెప్పలేదు.. కానీ: అనసూయ
-
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM