సీఎం కేసీఆర్ పాలన చూసి ఈర్ష్య పడుతున్న మోదీ: మంత్రి
తెలంగాణలో సంక్షేమ పథకాలతో అద్భుత పాలన చేస్తున్న సీఎం కేసీఆర్ను చూసి ప్రధాని మోదీ ఈర్ష్య పడుతున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు. ప్రజల హృదయాల్లో చొచ్చుకుపోయే విధంగా సీఎం కేసీఆర్ పథకాలు అమలు చేస్తున్నారన్నారు.
తెరాస కుటుంబ ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడుతున్న మంత్రి జగదీశ్రెడ్డి, చిత్రంలో
నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, నకిరేకల్,
భువనగిరి ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, పైళ్ల శేఖర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, తదితరులు
మునుగోడు, న్యూస్టుడే: తెలంగాణలో సంక్షేమ పథకాలతో అద్భుత పాలన చేస్తున్న సీఎం కేసీఆర్ను చూసి ప్రధాని మోదీ ఈర్ష్య పడుతున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించారు. ప్రజల హృదయాల్లో చొచ్చుకుపోయే విధంగా సీఎం కేసీఆర్ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. నల్గొండ జిల్లా మునుగోడులో శుక్రవారం నిర్వహించిన తెరాస కుటుంబ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో అందిస్తున్న 24 గంటలు ఉచిత కరెంట్ను చూసి గుజరాత్ రైతులు మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని చెప్పారు. మానవీయ కోణంలో పరిపాలన సాగిస్తున్న సీఎం కేసీఆర్పై మోదీ, అమిత్షా విషం చిమ్ముతున్నారని ఆరోపించారు.చిన్న చిన్న అభిప్రాయ బేధాలు వస్తే వెంటనే పరిష్కరించుకోవాలని, పార్టీకి నష్టం కలిగించే విధంగా వ్యవహరించొద్దని నాయకులకు సూచించారు. ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, నల్గొండ, నకిరేకల్, భువనగిరి ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్రెడ్డి, చిరుమర్తి లింగయ్య, పైళ్ల శేఖర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, ఎంపీపీ కర్నాటి స్వామి యాదవ్, తెరాస రాష్ట్ర నాయకుడు నారబోయిన రవిముదిరాజ్, తెరాస మండల అధ్యక్షుడు బండ పురుషోత్తంరెడ్డి, మండల ఉపాధ్యక్షులు మందుల సత్యం తదితరులు పాల్గొన్నారు.
చౌటుప్పల్: ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో రైతులు బిల్లు కట్టకపోతే నిర్దాక్షిణ్యంగా కరెంటు మీటర్లు తొలిగించే కసాయి ప్రభుత్వం ఉందని, ప్రజాక్షేత్రంలో భాజపాకు శిక్ష తప్పదని మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. చౌటుప్పల్లోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ప్రాంగణంలో రూ.57లక్షలతో 750 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో ఎరువుల గోదాము, రూ.10లక్షలతో ప్రహరీ నిర్మాణానికి ఆయన శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సభలో డీసీసీబీ ఛైర్మన్ గంగిడి మహేందర్రెడ్డి మాట్లాడుతూ.. మునుగోడు ఉప ఎన్నికలో తెరాసకు మద్దతుగా నిలవాలని అన్నారు. ఈ క్రమంలో సభా వేదికపై ఉన్న భాజపాకు చెందిన పీఏసీఎస్ డైరెక్టర్లు కిష్టయ్య, సాయిలు, వెంకట్రెడ్డి ప్రసంగానికి అడ్డు తగిలారు. ఇది రాజకీయ వేదిక కాదని అభ్యంతరం తెలిపారు. స్వల్ప గలాటా జరిగింది. సభకు ఆటంకం కలిగిస్తున్నారని పోలీసులు వారిని వేదికపై నుంచి కిందికి దింపి పక్కకు తీసుకెళ్లారు.
చౌటుప్పల్ పీఏసీఎస్ గోదాము శంకుస్థాపన సభా వేదికపై నుంచి భాజపా డైరెక్టర్లను బయటకు తీసుకెళ్తున్న పోలీసులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రభుత్వంపై విమర్శ.. రైతులకు భరోసా
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సుయాత్ర చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దానిని ఉమ్మడి జిల్లా నుంచే ప్రారంభించడంతో.. భారాస నేతలు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. -
బాలికలు.. భళా
[ 25-04-2024]
విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. -
మోదీతో తెలంగాణకు తీరని అన్యాయం
[ 25-04-2024]
కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ తెలంగాణకు తీరని అన్యాయం చేశారని నల్గొండ లోక్సభ ఇన్ఛార్జి, మంత్రి నల్లమాద ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. -
బాలికలదే హవా
[ 25-04-2024]
రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. -
ఉపాధి కూలీల సౌకర్యాలపై సమీక్ష
[ 25-04-2024]
పని ప్రదేశాలలో ఉపాధి కూలీలకు మౌలిక సౌకర్యాలు సమకూర్చాలని జిల్లా పరిషతు ముఖ్య కార్యనిర్వహణాధికారి శోభారాణి, ఆదనపు డీఆర్డీవో జి.సురేష్, సూచించారు. -
ప్రథమంలో 26.. ద్వితీయంలో 25
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. 2022-23లో జిల్లా ఉత్తీర్ణత శాతం 57 ఉండగా, ప్రస్తుతం 54.50 శాతానికి పడిపోయింది. -
ఊపందుకున్న నామినేషన్ల పర్వం
[ 25-04-2024]
నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాలకు బుధవారం వరకు 45 మంది చొప్పున నామినేషన్లు వేశారు. -
గిరిజన గురుకులాల్లో 88.60శాతం ఉత్తీర్ణత
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో కలిపి ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 88.60శాతం ఫలితాలు -
మతోన్మాద భాజపాను ఓడించండి: సీపీఐ
[ 25-04-2024]
దేశంలో మతోన్మాదం పేరుతో రాజకీయాలు చేస్తున్న భాజపాను ఓడించి కాంగ్రెస్ అభ్యర్ధులను భారీ మెజార్టీతో గెలిపించాలని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. -
విభజన హామీల అమలుకు కృషి
[ 25-04-2024]
భువనగిరి లోక్సభ ఎంపీగా తనను గెలిపిస్తే విభజన హామీలను అమలు చేసేందుకు, నిధులు రాబట్టేందుకు కృషి చేస్తానని భువనగిరి లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. -
తొలి ఎన్నికలోనే అత్యధిక మెజారిటీ
[ 25-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1951లో ఏర్పడగా.. తొలి ఎన్నికలు 1952లో జరిగాయి. -
రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం, వ్యక్తి అరెస్ట్
[ 25-04-2024]
రైల్వేశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని 17 మంది బాధితుల నుంచి నగదు వసూలు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు పోలీస్ ఇన్స్పెక్టర్ అశోక్రెడ్డి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
రోజుకు 10వేల పౌండ్లు ఇవ్వమని కోరా: వీరేంద్ర సెహ్వాగ్
-
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
-
బ్యాంకింగ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు.. రాణించిన సూచీలు
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!