పండగ వేడుక.. పర్యాటకుల సందడి
పర్యాటకుల స్వర్గధామం రామోజీ ఫిల్మ్సిటీలో పండగ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. దసరా, దీపావళి సెలవులను ఆహ్లాదకర వాతావరణంలో ఆస్వాదించాలనుకొనే వారి కోసం....
రామోజీ ఫిల్మ్సిటీలో కోలాహలం
రామోజీ ఫిల్మ్సిటీ, న్యూస్టుడే: పర్యాటకుల స్వర్గధామం రామోజీ ఫిల్మ్సిటీలో పండగ సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. దసరా, దీపావళి సెలవులను ఆహ్లాదకర వాతావరణంలో ఆస్వాదించాలనుకొనే వారి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రామోజీ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ఆబాలగోపాలాన్ని అలరిస్తున్నాయి. మిరుమిట్లు గొలిపే విద్యుత్తు దీపకాంతుల వెలుగుల్లో ఫిల్మ్సిటీ అందాలు సరికొత్తగా కనిపిస్తూ పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 వరకు ఈ ప్రత్యేక సంబరాలు కొనసాగుతాయి. కలల లోకంలో తేలియాడేలా చేసే కార్నివాల్ పరేడ్లో పాల్గొంటూ.. ఫిల్మ్సిటీ వీధుల్లో విహరిస్తూ సందర్శకులు ఆనందతీరాలకు చేరుతున్నారు. ప్రకృతి రమణీయ ఉద్యానవనాల సందర్శన, కిలకిలారావాల పక్షుల పార్కు, సీతాకోకచిలుకల పార్కు సందర్శనతో మర్చిపోలేని జ్ఞాపకాలను సొంతం చేసుకుంటున్నారు. సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే యాక్షన్ ప్యాక్డ్ స్టంట్ షో, రైడ్స్, ఆకట్టుకొనే స్టేజ్ షోలు, మైమరిపించే సంగీతం సరికొత్త అనుభూతిని పంచుతున్నాయి. బాహుబలి సెట్ సందర్శన మరో ఆకర్షణగా నిలుస్తోంది. వినోదం, విహారంతో పాటు పండగ రుచులతో అందించే విందు ప్రత్యేకతను చాటుతోంది.
నృత్యాలతో హోరెత్తిస్తున్న కళాకారులు
సాయంత్రం వేళ దాండియా ఆటలు.. రామోజీ ఫెస్టివ్ సెలబ్రేషన్స్కు సాయంత్రం వేళ విచ్చేస్తున్న పర్యాటకులు దాండియా ఆటల్లో పాలుపంచుకుంటూ ఆనందోత్సాహాల్లో తేలియాడుతున్నారు. డీజే దాండియా ఆట పాటల్లో ఆడుతూ పాడుతూ గడుపుతున్నారు. సన్ ఫౌంటెయిన్ డ్యాన్స్ ఫ్లోర్లో డీజే బీట్లకు అనుగుణంగా నర్తిస్తూ ఆనందిస్తున్నారు. విభిన్న ప్రాంతీయ రుచులతో అందించే విందును ఆస్వాదిస్తున్నారు. సాయంత్రం వేళ పండగ సెలవులను ఆహ్లాదంగా గడపాలనుకునే వారికి ప్రత్యేక ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. ఆస్వాదించాలనుకుంటే... ఈ సెలబ్రేషన్స్ను మీరు ఆస్వాదించాలనుకుంటే డే, ఈవెనింగ్ ప్యాకేజీలను ఎంచుకొని రావచ్చు. సాధారణ, ప్రీమియం సహా అనేక ప్యాకేజీలు స్వాగతం పలుకుతున్నాయి. ఆకర్షణీయమైన స్టే ప్యాకేజీలతో లగ్జరీ హోటల్ సితార, కంఫర్ట్ హోటల్ తారా, శాంతినికేతన్, వసుంధర విల్లా, గ్రీన్స్ ఇన్, హోటల్ సహారాలో విడిది చేసే వీలుంటుంది. అంతేకాదండోయ్.. పర్యాటకులు తిరిగి వెళ్లే సమయంలో ఫిల్మ్సిటీ నుంచి ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ వరకు రవాణా సౌకర్యం ఉంటుంది. నిర్దేశించిన రుసుం చెల్లించి వినియోగించుకోవచ్చు.
వీక్షిస్తున్న సందర్శకులు
మరిన్ని వివరాలకు..
ఫోన్ నంబరు 1800 120 2999 లేదా www.ramojifilmcity.com
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉత్సాహంగా అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు
[ 25-04-2024]
జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో గురువారం జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు ఉత్సాహంగా సాగాయి. -
ప్రారంభమైన వేసవి క్రికెట్ శిక్షణ శిబిరం
[ 25-04-2024]
జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో గురువారం హైదరాబాద్ క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో వేసవి క్రికెట్ శిక్షణ శిబిరం ప్రారంభమైంది. -
తగ్గిన ఇంటర్ ఉత్తీర్ణత
[ 25-04-2024]
కిందటేడాది మాదిరిగానే ఈసారి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను బుధవారం ఒకేసారి విడుదల చేశారు. గత సంవత్సరంతో పోల్చితే ఈసారి జిల్లా ఉత్తీర్ణత శాతం కొద్దిగా తగ్గింది. -
అయిదేళ్లుగా ఎదురుచూపులే!
[ 25-04-2024]
కేంద్ర ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయం రైతులందరికి అందడం లేదు. ప్రారంభంలో ఉన్న రైతుల్లో నిబంధనల కారణంగా తొలగిస్తున్నా.. కొత్త వారిని చేర్చకపోవడంతో ఏటా సాయం పొందే రైతుల సంఖ్య తగ్గుతోంది. -
దిగజారిన ఫలితాలు..
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ బోర్డు బుధవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో జిల్లా గతేడాదితో పోలిస్తే అయిదు స్థానాలు కిందికి పడిపోయి రాష్ట్రంలో 7వ స్థానానికి పరిమితమైంది. అయినప్పటికీ ఉత్తమ ఫలితాలనే సాధించినట్లు సంబంధిత అధికారులు ప్రకటించారు. -
పక్కాగా ఎన్నికల సంఘం మార్గదర్శకాల అమలు
[ 25-04-2024]
పార్లమెంట్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులతో కలిసి జిల్లాల ఎన్నికల అధికారులు, పాలనాధికారులు, -
ఏసీబీ అధికారుల విస్తృత తనిఖీలు
[ 25-04-2024]
నాలుగు వరుసల రహదారి విస్తరణలో భాగంగా.. పరిహారం చెల్లింపులో జరిగిన అక్రమాలపై ‘ఈనాడు’ ప్రచురించిన వరుస కథనాలకు ఏసీబీ అధికారులు స్పందించారు. -
స్థిరాస్తి వ్యాపారుల్లో గుబులు
[ 25-04-2024]
ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడం, నిబంధనలు కాలరాసి వెంచర్లు వేసి అమాయకులను మోసం చేయడం, బాండ్ పేపర్ల మీద రాసుకుంటూ బీడీపీపీ భూములను విక్రయించడం, వివాదాస్పద భూములను వాటాలు వేసుకుని పంచుకోవడం, -
ఏనుగు దాడి ఘటనలో.. బాధిత కుటుంబాలకు పరిహారం
[ 25-04-2024]
కాగజ్నగర్ అటవీ డివిజన్ పరిధిలో ఏనుగు దాడిలో మృతి చెందిన ఇద్దరు రైతుల కుటుంబాలకు ప్రభుత్వం మంజూరు చేసిన పరిహారం చెక్కులను అందజేశారు. -
ఆరో రోజు 8 నామినేషన్లు
[ 25-04-2024]
పెద్దపల్లి లోక్సభ స్థానానికి ఆరో రోజు బుధవారం 8 మంది నామినేషన్లు దాఖలు చేశారు. భాజపా జిల్లా అధ్యక్షుడు చందుపట్ల సునీల్రెడ్డి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, నాయకులు కన్నం అంజయ్యలతో కలిసి -
ఫలితాల్లో దిగజారి.. అట్టడుగుకు చేరి
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ప్రథమ ద్వితీయ ఫలితాల్లో జిల్లాకు నిరాశే ఎదురైంది. -
అలా ఏర్పాటు.. ఇలా తొలగింపు
[ 25-04-2024]
ఆ యూటర్న్ మృత్యువుకు చిరునామాగా మారింది. ఇక్కడ జరిగిన రహదారి ప్రమాదాల్లో దాదాపు 10 మంది మృతి చెందారు. వీరంతా యూటర్న్ వద్దకు రాగానే ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయారు. -
మొరం తవ్వేస్తున్నారు.. వెంచర్లలో నింపేస్తున్నారు
[ 25-04-2024]
జిల్లాలో ఏ గుట్టను చూసినా అక్రమ దందా ఎలా సాగుతుందో తెలుస్తోంది. యథేచ్ఛగా మొరం తవ్వకాలు జరుగుతున్నా.. సిబ్బంది లేకనే ఇబ్బందులు ఉన్నాయంటూ సంబంధిత అధికారులు ప్రకటించడం చూస్తుంటే పరోక్షంగా వారికి ఎలా అండగా ఉన్నారో తెలిసిపోతోంది. -
అమ్మాయిలదే హవా
[ 25-04-2024]
ఇంటర్ వార్షిక పరీక్ష ఫలితాల్లో జిల్లాలో బాలికలదే పైచేయిగా నిలిచింది. గత ఏడాది సైతం వారే ముందంజలో ఉన్నారు. రెగ్యులర్ కోర్సుల్లో గత సంవత్సరంకంటే రాష్ట్రస్థాయిలో దిగజారినా ఒకేషనల్లో మాత్రం కొంత మెరుగైంది. -
ఇంటర్లో మెరిసిన విద్యాకుసుమాలు
[ 25-04-2024]
బోథ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, ఆదర్శ పాఠశాల విద్యార్థులు బుధవారం వెలువడిన ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సర ఫలితాలలో సత్తా చాటారు. -
నమ్మించి మోసం చేసిన హోంగార్డు అరెస్ట్
[ 25-04-2024]
ప్రజలను నమ్మించి మోసం చేసిన హోంగార్డు షమీ ఉల్లాఖాన్ను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణ సీఐ అనిల్ తెలిపిన వివరాల ప్రకారం షమీ ఉల్లాఖాన్ కొద్ది రోజుల క్రితం పట్టణంలో ట్రాఫిక్ విధులు నిర్వహించారు. -
చర్చనీయాంశంగా మాజీ ఎంపీ నామపత్రం దాఖలు
[ 25-04-2024]
మాజీ ఎంపీ రాఠోడ్ రమేష్ ఒక్కరే వచ్చి భాజపా తరఫున నామపత్రం దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది. భాజపా అభ్యర్థి గోడం నగేష్ చేపట్టిన ర్యాలీలో పాల్గొన్న ఆయన ఆ తర్వాత
తాజా వార్తలు (Latest News)
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్
-
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
-
రూ.29కే జియోసినిమా ప్రీమియం.. యాడ్ ఫ్రీ కంటెంట్, 4K వీడియో క్వాలిటీ
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు