మునుగోడులో మండలాల వారీగా ఇన్ఛార్జులు
మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని, మంచి మెజార్టీతో విజయం సాధించాలని భాజపా స్టీరింగ్ కమిటీ నిర్ణయించింది. ఛైర్మన్ జి.వివేక్ వెంకటస్వామి అధ్యక్షతన మునుగోడు స్టీరింగ్ కమిటీ తొలి సమావేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో
ప్రకటించిన భాజపా స్టీరింగ్ కమిటీ
ఈనాడు, హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని, మంచి మెజార్టీతో విజయం సాధించాలని భాజపా స్టీరింగ్ కమిటీ నిర్ణయించింది. ఛైర్మన్ జి.వివేక్ వెంకటస్వామి అధ్యక్షతన మునుగోడు స్టీరింగ్ కమిటీ తొలి సమావేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం జరిగింది. ఇందులో పార్టీ అభ్యర్థిగా బరిలో దిగనున్న కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి, కమిటీ సమన్వయకర్త గంగిడి మనోహర్రెడ్డితో పాటు సభ్యులు ఈటల రాజేందర్, ఏపీ జితేందర్రెడ్డి, స్వామిగౌడ్ తదితరులు పాల్గొన్నారు. మండల ఇన్ఛార్జులు, సహ ఇన్ఛార్జులను వేయాలని సభ్యులు సూచించగా జాబితా రూపొందించారు. సమావేశం అనంతరం స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ జాబితాను ప్రకటించి విలేకరులతో మాట్లాడారు. మునుగోడులో గెలిచేందుకే కేసీఆర్ గిరిజన బంధును ప్రకటించారని, ఏడాది క్రితం హుజూరాబాద్ ఎన్నికలప్పుడు ప్రకటించిన దళితబంధునే సక్రమంగా అమలు చేయడం లేదని ధ్వజమెత్తారు. కేసీఆర్ అవినీతి, కుటుంబ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. ఎన్నికలప్పుడే ఫాంహౌస్ నుంచి వచ్చే ముఖ్యమంత్రి తర్వాత ప్రజల సమస్యలు మరిచిపోతారంటూ ధ్వజమెత్తారు.
ఇన్ఛార్జిలు, సహ ఇన్ఛార్జులు వీరే..
చౌటుప్పల్- కూన శ్రీశైలంగౌడ్ (సహ ఇన్ఛార్జులు- జిట్టా బాలకృష్ణారెడ్డి, కె.రాములు)
చౌటుప్పల్ మున్సిపాలిటీ- రేవూరి ప్రకాశ్రెడ్డి (సుభాష్ ఛందర్జీ, కర్నాటి ధనుంజయ)
నారాయణపూర్- ఎం.రఘునందన్రావు (రమేశ్రాథోడ్, కాసం వెంకటేశ్వర్లు)
మునుగోడు- చాడ సురేష్రెడ్డి (బొడిగ శోభ, రవికుమార్ యాదవ్)
చండూరు-టి.నందీశ్వర్గౌడ్ (వన్నాల శ్రీరాములు, అందె బాబయ్య)
చండూరు మున్సిపాలిటీ- ఎం.ధర్మారావు (విజయ్పాల్రెడ్డి, నాగూరావు నామాజిజి)
నాంపల్లి- ఏనుగు రవీందర్రెడ్డి (అందె శ్రీరాములు యాదవ్, రితేశ్ రాథోడ్)
మర్రిగూడెం- కొండా విశ్వేశ్వర్రెడ్డి (ఎర్రబల్లి ప్రదీప్రావు, తుల ఉమ)
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దాహం కేకలు తీర్చేందుకు...తరలి వస్తున్న కృష్ణమ్మ
[ 19-04-2024]
నాగార్జునసాగర్ జలాశయం డెడ్స్టోరేజీ దిగువకు చేరినా వేసవిలో హైదరాబాద్ జంట నగరాలు, జిల్లా వాసుల దాహం కేకలు తీర్చేందుకు కృష్ణాజలాల సరఫరాకు హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ (జలమండలి) అధికారులు చేపడుతున్న చర్యలు సఫలీకృతమయ్యాయి -
సైబర్ బాధితులకు వారియర్స్ తోడు
[ 19-04-2024]
చరవాణుల ద్వారా డిజిటల్ లావాదేవీలు పెరగడంతో నిత్యం ఎక్కడో చోట అమాయకులు సైబర్ నేరగాళ్ల వలలో పడి ఆర్థికంగా నష్టపోతున్నారు. -
రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా: మంత్రి ఉత్తమ్
[ 19-04-2024]
కోదాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. -
గాడితప్పిన గస్తీ
[ 19-04-2024]
జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. వరుసగా గొలుసు చోరీలకు పాల్పడుతున్నారు. నిఘా పటిష్ఠం చేసి దొంగలను పట్టుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారు. -
ఆలయ భద్రతపై ఇంత నిర్లక్ష్యమా!
[ 19-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని నిత్యం వేల సంఖ్యలో భక్తులు సందర్శిస్తుంటారు. ఆలయంలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతే లోనికి అనుమతించేందుకు బ్యాగేజ్ స్కానింగ్, మెటల్ డిటెక్టర్, తదితర భద్రతా పరికరాలను వైటీడీఏ కొనుగోలు చేసింది. -
భక్తవత్సలుడికి సంప్రదాయ ఆరాధనలు
[ 19-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో గురువారం స్వయంభువులైన పంచనారసింహులను ఆరాధిస్తూ చేపట్టిన నిత్య పూజలు ఆలయ ఆచారంగా కొనసాగాయి -
కేసీఆర్కు సీఎం రేవంత్రెడ్డే సరైనోడు: రాజగోపాల్రెడ్డి
[ 19-04-2024]
తెలంగాణ ఇచ్చిన పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని.. ఆలస్యం అయినా ప్రవేశపెట్టిన పథకాలను నెరవేర్చి.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని భువనగిరి లోక్సభ ఇన్ఛార్జి, స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. -
నాయకులొస్తున్నారు..!
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్సభ స్థానాలైన నల్గొండ, భువనగిరిలో నామినేషన్ దాఖలు సందర్భంగా భారీ ఎత్తున ర్యాలీలు, సభలు నిర్వహించాలని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలు భారాస, భాజపాలు నిర్ణయించాయి -
67 ఏళ్లలో 69 శాతమే!
[ 19-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1952లో ఏర్పడగా.. 2019 వరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. 2019 నాటికి నియోజకవర్గానికి తొలి ఎన్నికలు జరిగి 67 ఏళ్లు గడిచాయి -
నల్గొండలో నలుగురు, భువనగిరిలో ముగ్గురు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం మొదలైంది. తొలి రోజు గురువారం నల్గొండ లోక్సభ స్థానానికి నలుగురు అభ్యర్థులు ఆరు సెట్లు నామినేషన్లను రిటర్నింగ్ అధికారి, నల్గొండ జిల్లా కలెక్టరు హరిచందనకు అందజేశారు. -
నల్గొండ.. నాయకులకు అండ!
[ 19-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గానికి 18వ సారి ఎన్నికలు జరుగనున్నాయి. ఉమ్మడి జిల్లాలో తొలిసారి ఏర్పడిన ఏకైక లోక్సభ నియోజకవర్గం నల్గొండ మాత్రమే. -
పార్లమెంటు.. ఎంపీ అంటే తెలుసా
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు తమదైన శైలిలో సమావేశాలు నిర్వహిస్తూ ఓటర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు -
వ్యాను ఢీకొని రైతు మృతి
[ 19-04-2024]
ద్విచక్రవాహనాన్ని వ్యాను ఢీకొనడంతో రైతు మృతి చెందిన ఘటన మఠంపల్లి మండలం రఘునాథపాలెం పరిధిలోని వెంకటాయపాలెంలో గురువారం జరిగింది. -
ఇంటి మీద.. అవార్డుల పంట
[ 19-04-2024]
మిద్దె తోటలు.. ఆరోగ్యానికి ఉపయోగపడే కూరగాయలతో పాటు పురస్కారాలనూ తీసుకొస్తున్నాయి.