ప్రేయసి మాట తప్పడంతోనే ప్రియుడి బలవన్మరణం
లండన్లో హుజూర్నగర్కు చెందిన బీటెక్ విద్యార్థి సాయి మోహన్రెడ్డి బలన్మరణానికి ప్రేమ వైఫల్యమే కారణమని తెలిసింది. ఈ ఘటన వెనక కారణాలు తెలుసుకున్న కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు.
తీవ్ర మనోవేదనలో కుటుంబం
మేళ్లచెరువు, హుజూర్నగర్, న్యూస్టుడే: లండన్లో హుజూర్నగర్కు చెందిన బీటెక్ విద్యార్థి సాయి మోహన్రెడ్డి బలన్మరణానికి ప్రేమ వైఫల్యమే కారణమని తెలిసింది. ఈ ఘటన వెనక కారణాలు తెలుసుకున్న కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సాయి హైదరాబాద్లో ఇంటర్ చదువుతున్న రోజుల్లోనే మిర్యాలగూడకు చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. ఈ విషయం తల్లిదండ్రులకు తెలిసి అప్పట్లోనే మందలించారు. ఆ తర్వాత ఇంటర్ పూర్తవ్వగానే సాయి చదువుల కోసం లండన్కు వెళ్లారు. ప్రేయసి కూడా బీటెక్ కోసం పంజాబ్ వెళ్లింది. అప్పటి నుంచి అప్పుడప్పుడు వీరు ఫోన్లో మాట్లాడుతూనే ఉన్నారు. కొన్నాళ్లకు ఇతనూ ఆమెను పెళ్లాడేందుకు సిద్ధమయ్యాడు. ముందస్తు ప్రణాళికతో ఈనెల 5వ తేదీన హైదరాబాద్ వచ్చారు. కొంత నగదు, బంగారు వస్తువులు తెచ్చి ఆమెకు ఇచ్చాడు. స్నేహితులతో వారిద్దరూ హైదరాబాద్, చెన్నైలో సరదాగా గడిపారు. ఈనెల 13వ తేదీన తాతా మరణించినప్పుడు సాయి హైదరాబాద్లోనే ఉన్నారు. అంత్యక్రియలకు రాలేనని చెప్పడంతో కుటుంబ సభ్యులు నమ్మారు. 15వ తేదీన సాయి లండన్కు ప్రియురాలు పంజాబ్కు వెళ్లిపోయారు. రెండ్రోజులు గడిచిన తర్వాత ఆమెతో ఫోన్ మాట్లాడుతున్నప్పుడు.. తను వేరే యువకుడిని ప్రేమిస్తున్నానని చెప్పింది. ఒక్కసారిగా సాయి షాక్కు గురయ్యాడు. ఈ విషయంలో వారిద్దరి మధ్య చాలా సేపు వాదన జరిగింది. ఆ తర్వాత ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సాయి ఆ రోజు ఆఫీస్కు వెళ్లలేదు. సాయంత్రం రూం నుంచి బయట వెళ్లి డ్యూటీ నుంచి వస్తున్న అన్న అజయ్ చూసి పలకరించాడు. ఐనా.. విషయం చెప్పలేదు. నేను తర్వాత వస్తానని చెప్పి ముందుకు కదిలాడు. కొద్దిసేపట్లోనే రైలు పట్టాలెక్కి బలన్మరణానికి పాల్పడ్డాడు. మృతదేహాన్ని అప్పగించే విషయంలో ఇంకా సందిగ్థం నెలకొంది. సోమవారం వరకు అక్కడి పోలీసులు సమాచారం ఇస్తామని చెప్పినట్టు మృతుని మామ కొండారెడ్డి గోవిందరెడ్డి తెలిపారు. అక్కడికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు పేర్కొన్నారు. సాయి లేడన్న బాధతో అక్కడ అక్క స్వాతి, అన్నవదినలు అజయ్, నవ్యలు విలపిస్తున్నారు.
ఎమ్మెల్యే పరామర్శ: ఎమ్మెల్యే సైదిరెడ్డి సాయి కుటుంబ సభ్యుల్ని శనివారం పరామర్శించారు. సాయి తాతా శంభిరెడ్డి పెద్ద ఖర్మకు హాజరైన ఆయన వారి చిత్ర పటాలకు పుష్పాంజలి ఘటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నామినేషన్ దాఖలు చేసిన భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి
[ 24-04-2024]
భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. -
మాటలే తూటాలై..!
[ 24-04-2024]
‘నల్గొండ జిల్లా సాగునీటి రంగానికి కేసీఆర్ తీరని అన్యాయం చేశారు. బస్సు యాత్ర కాదు, మోకాళ్ల యాత్ర చేసినా భారాసకు ఎవరూ ఓటేయరు. -
వైభవంగా హనుమాన్ జయంతి
[ 24-04-2024]
హనుమాన్ జయంతి సందర్భంగా మంగళవారం ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపించారు. స్వామి వారికి సింధూరంతో అభిషేకం, తమల పాకులతో పూజలు నిర్వహించారు. -
పాఠాలకు బై.. ఆటలకు సై..!
[ 24-04-2024]
వేసవి సెలవులు వచ్చేశాయ్.. పది నెలల పాటు నిత్యం బడుల్లో పాఠాలు చదవడం, రాయడం తదితర పనుల్లో నిమగ్నమై ఉన్న చిన్నారులకు ఈ నెల 24 (బుధవారం) నుంచి మొదలయ్యే సెలవులతో ఉపశమనం లభించింది. -
అట్టహాసంగా కంచర్ల నామినేషన్
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతలకు తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. -
పార్టీ గుర్తుల చరిత్ర ఇదే
[ 24-04-2024]
రాజకీయ పార్టీలనగానే గుర్తొచ్చేది వాటి గుర్తులే. ప్రధానంగా ఎన్నికల సమయంలో పార్టీ అభ్యర్థుల కంటే గుర్తులకే ప్రాధాన్యం ఉంటుంది. -
వారు.. శాసనసభకు, లోక్సభకు ఎన్నికయ్యారు!
[ 24-04-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కొందరు నేతలు శాసనసభకు, లోక్సభకు ఎన్నికయ్యారు. దేశంలోనే అత్యధిక ఓట్లు సాధించి రికార్డు సృష్టించారు. -
ప్రలోభాల ఎర.. తప్పదు చెర!
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికలు మే 13న జరగనున్నాయి. ఇప్పటికే నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో ప్రచారం ఊపందుకుంటోంది. -
ఆహారం సేకరించి.. అభాగ్యుల ఆకలి తీర్చి..
[ 24-04-2024]
దేశంలో ఒక వైపు రెండు పూటలా తినడానికి తిండి లేక వేలాది మంది అవస్థలు పడుతున్నారు. మరో వైపు నిత్యం లక్షల టన్నుల ఆహార పదార్థాలు వ్యర్థాలుగా మారుతున్నాయి. -
లోక్సభలో గళం విప్పే అవకాశం ఇవ్వండి: జహంగీర్
[ 24-04-2024]
ప్రజాసమస్యల పరిష్కారానికి జనం వెన్నంటే ఉండి నిరంతరం పోరాటాలు చేస్తున్న తనకు మద్దతుగా నిలిచి గెలిపిస్తే పార్లమెంటులో ఈ ప్రాంత సమస్యలపై గళం విప్పుతానని భువనగిరి లోక్సభ సీపీఎం అభ్యర్థి ఎండీ.జహంగీర్ అన్నారు. -
గత పొరపాట్లు పునరావృతం కావొద్దు: కలెక్టర్
[ 24-04-2024]
త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో సెక్టార్, పోలీసు అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ వెంకటరావు అన్నారు. -
బడికి నిధులు
[ 24-04-2024]
యాదాద్రి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం రూ.25 కోట్లు మంజూరు చేసింది. ఈ పనులను అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా చేపట్టనున్నారు. -
అతిథులు తరలొచ్చె.. బూర పూరించె..!
[ 24-04-2024]
ఓట్ల కోసం అనాదిగా మత రాజకీయాలు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీయేనని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. -
వేస్తున్నారు నామినేషన్లు..!
[ 24-04-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కొనసాగుతోంది. -
అభ్యర్థులిద్దరూ ‘బీఎన్ రెడ్డి’లే..!
[ 24-04-2024]
మిర్యాలగూడ లోక్సభ నియోజకవర్గంలో 1989, 1991 ఎన్నికల్లో ప్రధాన అభ్యర్థులిద్దరూ బీఎన్రెడ్డిలే. ఒకరు వాస్తుశిల్పి బద్దం నర్సింహారెడ్డి. మరొకరు భీంరెడ్డి నర్సింహారెడ్డి. -
1,29,766 ఓట్లు కొల్లగొట్టిన స్వతంత్రులు
[ 24-04-2024]
ఫ్లోరైడ్కు వ్యతిరేకంగా జలసాధన సమితి ఆధ్వర్యంలో 1996 లోక్సభ ఎన్నికల్లో 476 మంది స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో వీరు 1,29,766 ఓట్లు సాధించారు.
తాజా వార్తలు (Latest News)
-
యూట్యూబ్కు పోటీగా.. వీడియోల కోసం ‘ఎక్స్’ టీవీ యాప్!
-
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
-
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
-
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. సీఆర్పీఎఫ్ డీఎస్పీ మృతి
-
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు