వీఆర్వోల సర్దుబాటు.. తీరనున్న ఖాళీల కొరత
వీఆర్వోలను మున్సిపాలిటీలకు బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. నల్గొండ జిల్లాలోని పాత పురపాలికలతో పాటు కొత్త పురపాలికలకు జూనియర్ అసిస్టెంట్లు, వార్డు అధికారులుగా బాధ్యతలు అప్పగించారు.
మాట్లాడుతున్న అదనపు కలెక్టర్ రాహుల్శర్మ, పక్కన పుర కమిషనర్ రమణాచారి
నల్గొండ పురపాలిక, న్యూస్టుడే: వీఆర్వోలను మున్సిపాలిటీలకు బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. నల్గొండ జిల్లాలోని పాత పురపాలికలతో పాటు కొత్త పురపాలికలకు జూనియర్ అసిస్టెంట్లు, వార్డు అధికారులుగా బాధ్యతలు అప్పగించారు. దీంతో ప్రస్తుతం పనిచేస్తున్న అధికారులపై భారం తగ్గడంతోపాటు చాలా వరకు అధికారుల కొరత తీరనుంది. జిల్లాలో ఎనమిది పురపాలికలు ఉండగా అందులో కొత్తగా రూపాంతరం చెందిన చండూరు, చిట్యాల, నందికొండ, హాలియా, నకిరేకల్లో ఇప్పటి వరకు ఉద్యోగులను భర్తీ చేయలేదు. దీంతో గత నాలుగేళ్లుగా ఆయా పురపాలిక ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఆయా మున్సిపాలిటీలకు కొత్త పోస్టులు మంజూరు చేసి సిబ్బందిని భర్తీ చేయాలని పలు మార్లు పురఛైర్మన్లు, ప్రజాప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయారు. వీఆర్వోలను గత కొంత కాలం నుంచి విధులకు దూరంగా ఉంచిన ప్రభుత్వం తాజాగా వారిని మున్సిపాలిటీలకు సర్దుబాటు చేసింది. జిల్లా వ్యాప్తంగా 55 మంది వీఆర్వోలను 8 మున్సిపాలిటీలకు సర్దుబాటు చేశారు. అందులో నల్గొండ మున్సిపాలిటీకి-6, దేవరకొండ-3, మిర్యాలగూడ-4, చిట్యాల-8, చండూరు-6, నందికొండ-7, హాలియా-7, నకిరేకల్-6 మంది చొప్పున కేటాయించారు. వారి అర్హతను అనుసరించి జూనియర్ అసిసెంట్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, వార్డు అధికారులు. శానిటరీ సూపర్వైజర్లు, గణంకాధికారులగా బాధ్యతలు అప్పగించారు.
ఉద్యోగులకు శిక్షణ..రెవెన్యూశాఖ నుంచి మున్సిపాలిటీకి సర్దుబాటు చేసిన ఉద్యోగులకు శనివారం నల్గొండ మున్సిపాలిటీ కార్యాలయంలో జిల్లా యంత్రాంగం శిక్షణ ఇచ్చింది. మున్సిపాలిటీ కార్యకలాపాలు, పాలన, విధులు, బాధ్యతలు, సేవలు వంటి అంశాలపై విభాగాల వారీగా నల్గొండ పుర కమిషనర్ రమణాచారి ఆధ్వర్యంలో శిక్షణ నిర్వహించారు. కొత్తగా వచ్చిన అధికారులు విధి నిర్వహణలో లోపాలు, అవకతవకలు జరగకుండా విధులు నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్శర్మ వారికి సూచించారు. రెవెన్యూశాఖ విధులకు, మున్సిపాలిటీ సేవలకు తేడా ఉంటుందని అందుకు అనుగుణంగా బాధ్యతలు నిర్వహించాలని ఆయన సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోరు.. ఖరారు..!
[ 29-03-2024]
నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాల్లో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, భారాస, భాజపా తమ అభ్యర్థులను ఖరారు చేసింది. -
బలవంతులకే.. మరింత బలమై..
[ 29-03-2024]
పోషకాలతో కూడిన ఆహారంతోనే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని భావించిన ప్రభుత్వం గత కొన్ని నెలలుగా రేషన్ బియ్యంలో పోషకాలు కలుపుతోంది. -
భూసారం తగ్గిపోతోంది
[ 29-03-2024]
పెరుగుతున్న రసాయన ఎరువుల వినియోగం.. సమగ్ర నీటి యాజమాన్య పద్ధతులు పాటించకపోవటం, సహజ ఎరువుల వాడకం పూర్తిగా తగ్గించటంతో ఏటా భూమిలో రసాయనాల ప్రభావంతో గాఢత పెరిగిపోతోంది. -
టెట్పై యువత గురి
[ 29-03-2024]
ఉపాధ్యాయ ఉద్యోగం పొందాలంటే ‘టెట్’ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) తప్పనిసరి అయినందున.. ఈ పరీక్ష ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రభుత్వం మెగా డీఎస్సీ ప్రకటించిన విషయం తెలిసిందే. -
బైండోవర్ అతిక్రమిస్తే జైలుకే
[ 29-03-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావడంతో శాంతి భద్రతల విఘాతానికి దారి తీసే అంశాలపై పోలీసులు నిఘా పెడుతున్నారు. -
బార్ అధ్యక్షుడిగా సుదర్శన్రెడ్డి ఎన్నిక
[ 29-03-2024]
సూర్యాపేట జిల్లా కోర్టు బార్ అసోసియేషన్కు గురువారం జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా నూకల సుదర్శన్రెడ్డి ఎన్నికయ్యారు. -
కష్టాలెదురైనా విద్యాభ్యాసం కొనసాగించాలి
[ 29-03-2024]
బాలికలు కష్ట నష్టాలెదురైనా విద్యాభ్యాసాన్ని కొనసాగించాలని చౌటుప్పల్ న్యాయస్థానం జూనియర్ సివిల్ జడ్జి మహతి వైష్ణవి సూచించారు. -
లోక రక్షణ కోసమే క్రీస్తు రుధిర తర్పణం
[ 29-03-2024]
క్రీస్తు ప్రభువు మానవాళిని పాప విముక్తులుగా చేసేందుకే అవనిపై అవతరించాడు. -
యాదాద్రీశుడికి శతఘటాభిషేకం
[ 29-03-2024]
పంచనారసింహుల దివ్యక్షేత్రమైన యాదాద్రిలో గురువారం శ్రీలక్ష్మీనరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి సందర్భంగా ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. -
అప్పుతీర్చలేక హత్య చేశారు: డీఎస్పీ
[ 29-03-2024]
మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నారు.. అవసరం కోసం ఆమె వద్ద అప్పు తీసుకున్నారు.. తీసుకున్న అప్పు తిరిగి తీర్చమని నిలదీస్తే హత్యచేసి ఆనవాళ్లు లేకుండా చేయాలని ప్రయత్నించిన ముగ్గురిని అరెస్టు చేసినట్లు నల్గొండ డీఎస్పీ శివరాంరెడ్డి తెలిపారు. -
మహిళ హత్య కేసులో దోషికి యావజ్జీవ కారాగార శిక్ష
[ 29-03-2024]
మహిళ హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఆరె కుమార్ అలియాస్ చిన్నును దోషిగా తేల్చుతూ భువనగిరి మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టు తీర్పు చెప్పింది.
తాజా వార్తలు (Latest News)
-
రూ.2లక్షల రుణమాఫీ.. విధివిధానాలు రూపొందిస్తున్నాం: మంత్రి తుమ్మల
-
జాతీయ నాయకత్వం కితాబు మనకు గర్వకారణం: రేవంత్రెడ్డి
-
బెంగళూరు కేఫ్ పేలుడు.. నిందితుల ఆచూకీ చెబితే రూ.20లక్షల రివార్డు
-
ప్రభుత్వం మారినప్పుడు కఠిన చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
-
ఫోన్ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు 14 రోజుల రిమాండ్
-
అనన్య-ఆదిత్య ఫొటోషూట్.. అల్లు అర్జున్-స్నేహారెడ్డి స్పెషల్ మూమెంట్