వ్యాయామం.. ఆహారం.. ఆరోగ్యానికి ఔషధం
మారుతున్న కాలంలో వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు బీపీ, మధుమేహం వ్యాధుల బారిన పడుతున్నారు.. నడక, యోగా, ధ్యానం, ఆహార నియమాలతో ఆ రోగాలకు స్వస్తి చెప్పొచ్చని నల్గొండకు చెందిన జిల్లా
మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు అదుపులో ఉంటాయన్న నిపుణులు
ఈనాడు-ఈటీవీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు
సదస్సులో పాల్గొన్న సీనియర్ సిటిజన్లు, యువత
నల్గొండ అర్బన్, న్యూస్టుడే: మారుతున్న కాలంలో వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు బీపీ, మధుమేహం వ్యాధుల బారిన పడుతున్నారు.. నడక, యోగా, ధ్యానం, ఆహార నియమాలతో ఆ రోగాలకు స్వస్తి చెప్పొచ్చని నల్గొండకు చెందిన జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డా.మాతృనాయక్, విశ్వ హృదయ ఆసుపత్రి గుండె వైద్య నిపుణుడు డా. నరహరి అభిప్రాయపడ్డారు. ‘ఈనాడు-ఈటీవీ’ ఆధ్వర్యంలో గుండె సంబంధిత, షుగర్ వ్యాధులపై నల్గొండ జిల్లా కేంద్రంలోని కాకతీయ డిగ్రీ కళాశాలలో శనివారం అవగాహన సదస్సు జరిగింది. స్థానికులు, బాధితులు పాల్గొని వైద్యులకు తమ సమస్యలు వివరించి సందేహాలు నివృత్తి చేసుకున్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వైద్యులు వ్యాధులకు కారణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట ఈనాడు యూనిట్ ఇన్ఛార్జి పి.ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.
శారీరక శ్రమ లేక జబ్బులు
- డా.మాతృనాయక్, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి, నల్గొండ
మానసిక ఒత్తిడి, కనీస శారీరక శ్రమ లేకపోవడంతో ఎక్కువ మంది రోగాల బారిన పడుతున్నారు. కొంత కాలం క్రితం వరకు షుగర్, గుండె జబ్బులు వంశపారంపర్యంగా 50 శాతం వరకు సంక్రమించేది. కానీ, ప్రస్తుత కాలంలో అలాంటిది పెద్దగా కన్పించడం లేదు. ఎక్కువ శాతం కదలకుండా కూర్చొని చరవాణిలో పనులు చేస్తున్నారు. రేడియేషన్ ప్రభావం, తగిన శ్రమ లేని కారణంగా అన్ని వర్గాల వారికి జబ్బులు వస్తున్నాయి. ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయడం సరైంది కాదు. వయసు పైబడిన వారిలో హైబీపీ, లోబీపీ వంటి సమస్యలు వస్తాయి. జీవన విధానంలో మార్పులు చేసుకోవడంతో పాటు వైద్యుల సూచనలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. నిత్యం వ్యాయామం చేయడం మరువకూడదు.
గుండె నొప్పిని నిర్లక్ష్యం చేయొద్దు
- డా. నరహరి, విశ్వ హృదయ ఆసుపత్రి గుండె వైద్య నిపుణుడు, నల్గొండ
ఇటీవల అన్ని వర్గాల వారిలో గుండె జబ్బులు పెరిగాయి. వారం రోజుల్లో 24 నుంచి 26 ఏళ్ల వయసు లోపు ఐదుగురు యువకులకు గుండె కవాటాలు వేయాల్సి రావడం బాధ కలిగించింది. ఎక్కువ మందిలో మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ తగ్గడం, పొగ తాగడం, జంకు ఫుడ్డు తీసుకోవడంతో పాటు బీపీ, షుగర్ వ్యాధులపై నిర్లక్ష్యం చేయడం కారణంగా గుండె జబ్బులు ఎక్కువగా వస్తున్నాయి. ఛాతీ మధ్య నుంచి ఎడమ వైపు నొప్పి రావడం గుండె నొప్పిగా భావించి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరముంది. ఉదయం 4 గంటల నుంచి 8 గంటల మధ్యలో మాత్రమే ఎక్కువగా గుండె నొప్పి వస్తుందనేది గ్రహించుకోవాలి. ఆ లక్షణాలు కన్పిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. కొలెస్ట్రాల్ మందులు వాడడం మూలంగా ఇతర సమస్యలు ఎలాంటివి తలెత్తవు. గుండె జబ్బు ఉన్నా లేకపోయినా అన్ని రకాల నూనెలను వాడుకోవచ్చు. కానీ, ఏ నూనెలైనా అతిగా వాడకుండా తగిన మోతాదులో వాడుకోవడం శ్రేయస్కరం. కొనుగోలు చేసిన వాటి కంటే స్వయంగా పట్టించిన నూనెలకు ప్రాధాన్యమివ్వాలి. సన్ఫ్లవర్ ఆయిల్ వల్ల నష్టం అంతగా ఉండదు.
ఆహార అలవాట్లపై అవగాహన అవసరం
నర్సిరెడ్డి, కాకతీయ కళాశాల నల్గొండ
ప్రతి ప్రకృతి వైపరిత్యాల సమయంలో ప్రజలను ఆదుకోవడంలో ‘ఈనాడు-ఈటీవీ’ సంస్థలు ముందువరుసలో ఉంటాయి. ప్రస్తుత కాలంలో ఆరోగ్యం, ఆహార అలవాట్లపై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరం. అవగాహన లేని కారణంగానే కొంత మంది చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోతున్నారు.
ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలి
- చొల్లేటి ప్రభాకర్, విశ్రాంత ఐఏఎస్ అధికారి
జీవితంలో ఇతర పనులతో పాటు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. శారీరక శ్రమ, సమయ పాలన ఎంచుకుని యోగా, ధ్యానం సాధన చేయాలి. ఆహార అలవాట్లలో మార్పులు, వైద్యుల సూచనలు తీసుకోవాలి.
వైద్యసలహా కోసం వచ్చాను
- యండీ జాఫర్, విశ్రాంత ఉపాధ్యాయుడు
‘ఈనాడు’ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహిస్తున్నారని తెలుసుకొని వైద్య సలహాల కోసం ఇక్కడికి వచ్చాను. వయసు పెరిగే సమయంలో బీపీలో తేడాలు ఎలా ఉంటాయో వైద్యుడిని అడిగి తెలుసుకున్నా. జీవన విధానంలో మార్పులు, వ్యాయామం ద్వారా ఎలా ఆరోగ్యం ఎలా మెరుగు పరుచుకోవాలో వైద్యులు సూచనలు ఇచ్చారు.
మధుమేహంపై తగిన సమాచారం పొందా
- శంకరయ్య, విశ్రాంత ఉద్యోగి
ఒక్కసారి శరీరంలో చక్కెర స్థాయి పెరిగిన తరువాత ప్రతి నెలకోసారి క్రమం తప్పకుండా రక్త పరీక్షలు చేయించుకోవాలి. పరిగడుపున ఒకసారి ఏదైన తిన్న తరువాత గంటన్నరకు మరో సారి రక్త పరీక్ష చేయించుకుని షుగర్ స్థాయి బట్టి మాత్రలు వాడుకోవాలని సూచించారు. మాత్రలు ప్రతి సారి మార్చాల్సిన పని ఉండదని వైద్యులు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
[ 24-04-2024]
నల్గొండ జిల్లా వేములపల్లి వద్ద భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం జరిగింది. -
కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు
[ 24-04-2024]
యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి దీవెనలు, భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో నామినేషన్ వేశానని భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. -
భారాస 2 ఎంపీ సీట్లు గెలిచినా మంత్రి పదవికి రాజీనామా చేస్తా: కోమటిరెడ్డి
[ 24-04-2024]
కాంగ్రెస్పై విమర్శలు చేసే కేసీఆర్.. ఎంపీ ఎన్నికల్లో కనీసం 2 స్థానాల్లోనైనా గెలవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. -
నామినేషన్ దాఖలు చేసిన భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి
[ 24-04-2024]
భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. -
మాటలే తూటాలై..!
[ 24-04-2024]
‘నల్గొండ జిల్లా సాగునీటి రంగానికి కేసీఆర్ తీరని అన్యాయం చేశారు. బస్సు యాత్ర కాదు, మోకాళ్ల యాత్ర చేసినా భారాసకు ఎవరూ ఓటేయరు. -
వైభవంగా హనుమాన్ జయంతి
[ 24-04-2024]
హనుమాన్ జయంతి సందర్భంగా మంగళవారం ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపించారు. స్వామి వారికి సింధూరంతో అభిషేకం, తమల పాకులతో పూజలు నిర్వహించారు. -
పాఠాలకు బై.. ఆటలకు సై..!
[ 24-04-2024]
వేసవి సెలవులు వచ్చేశాయ్.. పది నెలల పాటు నిత్యం బడుల్లో పాఠాలు చదవడం, రాయడం తదితర పనుల్లో నిమగ్నమై ఉన్న చిన్నారులకు ఈ నెల 24 (బుధవారం) నుంచి మొదలయ్యే సెలవులతో ఉపశమనం లభించింది. -
అట్టహాసంగా కంచర్ల నామినేషన్
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతలకు తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. -
పార్టీ గుర్తుల చరిత్ర ఇదే
[ 24-04-2024]
రాజకీయ పార్టీలనగానే గుర్తొచ్చేది వాటి గుర్తులే. ప్రధానంగా ఎన్నికల సమయంలో పార్టీ అభ్యర్థుల కంటే గుర్తులకే ప్రాధాన్యం ఉంటుంది. -
వారు.. శాసనసభకు, లోక్సభకు ఎన్నికయ్యారు!
[ 24-04-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కొందరు నేతలు శాసనసభకు, లోక్సభకు ఎన్నికయ్యారు. దేశంలోనే అత్యధిక ఓట్లు సాధించి రికార్డు సృష్టించారు. -
ప్రలోభాల ఎర.. తప్పదు చెర!
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికలు మే 13న జరగనున్నాయి. ఇప్పటికే నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో ప్రచారం ఊపందుకుంటోంది. -
ఆహారం సేకరించి.. అభాగ్యుల ఆకలి తీర్చి..
[ 24-04-2024]
దేశంలో ఒక వైపు రెండు పూటలా తినడానికి తిండి లేక వేలాది మంది అవస్థలు పడుతున్నారు. మరో వైపు నిత్యం లక్షల టన్నుల ఆహార పదార్థాలు వ్యర్థాలుగా మారుతున్నాయి. -
లోక్సభలో గళం విప్పే అవకాశం ఇవ్వండి: జహంగీర్
[ 24-04-2024]
ప్రజాసమస్యల పరిష్కారానికి జనం వెన్నంటే ఉండి నిరంతరం పోరాటాలు చేస్తున్న తనకు మద్దతుగా నిలిచి గెలిపిస్తే పార్లమెంటులో ఈ ప్రాంత సమస్యలపై గళం విప్పుతానని భువనగిరి లోక్సభ సీపీఎం అభ్యర్థి ఎండీ.జహంగీర్ అన్నారు. -
గత పొరపాట్లు పునరావృతం కావొద్దు: కలెక్టర్
[ 24-04-2024]
త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో సెక్టార్, పోలీసు అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ వెంకటరావు అన్నారు. -
బడికి నిధులు
[ 24-04-2024]
యాదాద్రి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం రూ.25 కోట్లు మంజూరు చేసింది. ఈ పనులను అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా చేపట్టనున్నారు. -
అతిథులు తరలొచ్చె.. బూర పూరించె..!
[ 24-04-2024]
ఓట్ల కోసం అనాదిగా మత రాజకీయాలు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీయేనని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. -
వేస్తున్నారు నామినేషన్లు..!
[ 24-04-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కొనసాగుతోంది. -
అభ్యర్థులిద్దరూ ‘బీఎన్ రెడ్డి’లే..!
[ 24-04-2024]
మిర్యాలగూడ లోక్సభ నియోజకవర్గంలో 1989, 1991 ఎన్నికల్లో ప్రధాన అభ్యర్థులిద్దరూ బీఎన్రెడ్డిలే. ఒకరు వాస్తుశిల్పి బద్దం నర్సింహారెడ్డి. మరొకరు భీంరెడ్డి నర్సింహారెడ్డి. -
1,29,766 ఓట్లు కొల్లగొట్టిన స్వతంత్రులు
[ 24-04-2024]
ఫ్లోరైడ్కు వ్యతిరేకంగా జలసాధన సమితి ఆధ్వర్యంలో 1996 లోక్సభ ఎన్నికల్లో 476 మంది స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో వీరు 1,29,766 ఓట్లు సాధించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్