logo

మునుగోడులో కమలం పువ్వుకు తావులేదు: రేవంత్‌రెడ్డి

మునుగోడు ప్రాంతంలో కమలం పువ్వుకు తావులేదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. సంస్థాన్‌ నారాయణపురం మండలంలోని బోడిమీదితండ, మర్రిబావితండ, వాయిళ్లపల్లి, ఆరెగూడెం గ్రామాల్లో జరిగిన ఉప ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు.

Published : 26 Sep 2022 04:24 IST

పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నుదుట బొట్టు పెడుతున్న

మునుగోడు అభ్యర్థి పాల్వాయి స్రవంతి

సంస్థాన్‌నారాయణపురం, న్యూస్‌టుడే: మునుగోడు ప్రాంతంలో కమలం పువ్వుకు తావులేదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. సంస్థాన్‌ నారాయణపురం మండలంలోని బోడిమీదితండ, మర్రిబావితండ, వాయిళ్లపల్లి, ఆరెగూడెం గ్రామాల్లో జరిగిన ఉప ఎన్నికల ప్రచారంలో మాట్లాడారు. ఇప్పటివరకు ఇక్కడ 12 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌ 6, కమ్యూనిస్టు పార్టీ 5 సార్లు గెలిస్తే తెరాస ఒక్క సారి గెలిచిందన్నారు. ప్రజల గొంతుకగా నిలుస్తున్న కాంగ్రెస్‌ను చంపడానికి తెరాస, భాజపాలు కుట్రలు పన్నుతున్నాయని ఆరోపించారు. మునుగోడు పోరాటాల గడ్డ అని.. నిజాం నవాబును పైజాం ఊడగొట్టిన చరిత్ర ఈ ప్రాంతానికి ఉందన్నారు. అక్రమంగా సంపాదించిన సొమ్ముతో వస్తున్న నాయకులకు తగిన బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. స్రవంతి దగ్గర అక్రమంగా సంపాదించిన ఆస్తులు లేవు కానీ మీ కోసం అసెంబ్లీలో కొట్లాడే దమ్ము ఉందన్నారు. అనంతరం ఆయా గ్రామాలలో పలువురు రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. జనగాం గ్రామంలో ధర్మబిక్షం విగ్రహానికి పూలమాల వేశారు. కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని