logo

ఆ పార్టీలకు గుణపాఠం చెప్పండి: విప్‌

దళితుల సంక్షేమనికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషి చేస్తున్నారని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ అన్నారు. మర్రిగూడ మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మండల కేంద్రంలో దళితవాడలో సోమవారం

Published : 26 Sep 2022 04:24 IST

మర్రిగూడలో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌

నాంపల్లి, మర్రిగూడ, న్యూస్‌టుడే: దళితుల సంక్షేమనికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషి చేస్తున్నారని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ అన్నారు. మర్రిగూడ మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మండల కేంద్రంలో దళితవాడలో సోమవారం నిర్వహించే సహపంక్తి భోజన ఏర్పాట్లను పరిశీలించారు. మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్‌, భాజపాలకు గుణపాఠం చెప్పాలన్నారు. తెరాస అభ్యర్థి గెలుపునకు కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఎంపీపీ మెండు మోహన్‌రెడ్డి, దళితబంధు జిల్లా కమిటీ సభ్యుడు లపంగి నర్సింహ, తెరాస మండల అధ్యక్షుడు తోటకూరి శంకర్‌, వర్కాల వెంకటేశ్‌, ఊరుపక్క నగేశ్‌, భిక్షం, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని