దోమల నివారణకు చర్యలేవి..?
భువనగిరి నియోజకవర్గంలో మూడు నెలలుగా జ్వరాలు విజృంభిస్తున్నాయి. వందలాది మంది ప్రజలు దోమకాటుతో జ్వరాల బారిన పడి ఆసుపత్రుల పాలయ్యారు. ఎక్కువగా మలేరియా, చికున్ గన్యా, డెంగీ, టైఫాయిడ్ లక్షణాలతో మంచంపట్టిన వారే ఉన్నారు.
బీబీనగర్, న్యూస్టుడే: భువనగిరి నియోజకవర్గంలో మూడు నెలలుగా జ్వరాలు విజృంభిస్తున్నాయి. వందలాది మంది ప్రజలు దోమకాటుతో జ్వరాల బారిన పడి ఆసుపత్రుల పాలయ్యారు. ఎక్కువగా మలేరియా, చికున్ గన్యా, డెంగీ, టైఫాయిడ్ లక్షణాలతో మంచంపట్టిన వారే ఉన్నారు. దోమల వల్ల రోగాలు వ్యాపిస్తున్నా.. పల్లెల్లో నివారణ చర్యలు తీసుకోవడంపై ప్రజాప్రతినిధులు, అధికారులు శ్రద్ధచూపడం లేదు. ఇందుకు నిదర్శనం సరిపడా ఫాగింగ్ యంత్రాలు లేకపోవడం. భువనగిరి నియోజకవర్గంలో 112 గ్రామ పంచాయతీలో 30 గ్రామాల్లోనే ఫాగింగ్ యంత్రాలు ఉన్నాయి. మిగతా చోట యంత్రాలు లేవనే సాకుతో మశకాలను నియంత్రించకపోవడంతో గ్రామీణులు సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు.
బీబీనగర్లో పోచంపల్లి రోడ్డు వైపు కాలనీలో నిలిచిన మురుగు
పరిశుభ్రతతో సరి
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గ్రామాల్లో కంప చెట్ల తొలగించి, శిథిలావస్థకు చేరిన పూరిళ్లను కూల్చేశారు. పరిసరాలను శుభ్రం చేయించారు. కానీ, దోమల నియంత్రణకు గ్రామాల్లో ఫాగింగ్ చేయించడం లేదు. ఇటీవల తరచూ వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాల్లో వరద నిలిచి మడుగులను తలపిస్తున్నాయి. అలాంటి మురుగు ప్రాంతాలు దోమలకు ఆవాసంగా మారి జ్వరాల వ్యాప్తికి కారణమవుతున్నాయి. గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులను పలకరిస్తే ఫాగింగ్ యంత్రాలు అందుబాటులో లేవని చెబుతూ దాటవేస్తున్నారని గ్రామీణలు వాపోతున్నారు.
మూసీ పరివాహక ప్రాంతంలో ముప్పు
మూసీ పరివాహక ప్రాంతమైన బీబీనగర్ మండలంలోని మక్తఅనంతారం, రుద్రవెళ్లి, పల్లెగూడెం, భట్టుగూడెం, చిన్నరావులపల్లి, గుర్రాలదండి, బ్రాహ్మణపల్లి, భూదాన్పోచంపల్లి మండలంలోని పిలాయిపల్లి, జూలూరు, పెద్దగూడెం, పెద్దరావులపల్లి, భువనగిరి మండలంలోని బొల్లెపల్లి, వలిగొండ మండలంలోని టేకులసోమారం, సంగెం తదితర గ్రామాల్లో పదుల సంఖ్యలో ప్రజలు జ్వరాలతో ఆసుపత్రి పాలయ్యారు. వీరిలో ఎక్కువ మంది దోమకాటుతో రోగాల బారిన పడ్డవారే ఉన్నారు. అధికారులు స్పందించి ఫాగింగ్ చేసి మశకాలను నియంత్రించాలని గ్రామీణులు కోరుతున్నారు.
లార్వా దశలోనే నియంత్రణ చర్యలు
-సునంద, జిల్లా పంచాయతీ అధికారిణి
జిల్లాలో దోమల నివారణకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం. మశకాలు వృద్ధి చెందకుండా లార్వ దశలోనే నియంత్రించేందుకు నిల్వ ఉండే నీటిలో ఆయిల్ బాల్స్ వేయించాం. చాలా గ్రామాల్లో యంత్రాల ద్వారా ఫాగింగ్ చేయిస్తున్నాం. యంత్రాలు అందుబాటులో లేకున్నా. మరమ్మతులకు గురైనా పక్క గ్రామాల నుంచి తెప్పిస్తున్నాం. ప్రతి గ్రామపంచాయతీలో ఫాగింగ్ యంత్రం ఏర్పాటుచేసేలా చర్యలు తీసుకుంటున్నాం.
నిధుల కొరత..
-రమేష్, సర్పంచి, గొల్లగూడెం
మా గ్రామ పంచాయతీలో పరిసరాలను శుభ్రం చేశాం. శిథిలావస్థకు చేరిన పూరిళ్లకు నోటీసులు ఇచ్చి కూల్చేశాం. దోమల నివారణకు యంత్రాలు లేక ఫాగింగ్ చేయించలేకపోయాం. గ్రామపంచాయతీలో నిధుల కొరతతో ఆ యంత్రాన్ని కొనుగోలు చేయలేకపోయాం. దోమల నివారణకు ముందస్తుగా నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో ఆయిల్ బాల్స్ వేయించాం.
ఫాగింగ్ చేపట్టాలి
-మన్నే సంజీవరావు, జియాపల్లి
మా గ్రామంలో దోమలు కుట్టడంతో విష జ్వరాల బారిన పడి సుమారు ఇరవై మందికిపైగా ఆసుపత్రి పాలయ్యారు. ఒక్కొక్కరికి రూ.10 వేల వరకు ఖర్చయ్యాయి. నేటికీ గ్రామంలో దోమల నివారణకు చర్యలు తీసుకోవడం లేదు. ఫాగింగ్ చేపట్టాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపాకు ఓటు అడిగే నైతిక హక్కు లేదు: కేసీఆర్
[ 25-04-2024]
తెలంగాణకు అన్ని విధాల నష్టం చేసిన భాజపాకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని భారాస అధినేత కేసీఆర్ విమర్శించారు.. -
ఎన్నికల కంట్రోల్ రూమ్ పరిశీలన
[ 25-04-2024]
భువనగిరి ఎన్నికల జనరల్ అబ్జర్వర్ రాబర్ట్ సింగ్ క్షేత్రిమయుమ్ కలెక్టరేటులోని ఎన్నికల కంట్రోల్ రూమ్ను సందర్శించారు. -
భువనగిరి లోక్సభ స్థానానికి 61 మంది నామినేషన్లు
[ 25-04-2024]
భువనగిరి లోక్సభ నియోజకవర్గంలో నామినేషన్ల ఘట్టం ముగిసింది. రికార్డ్ స్థాయిలో 61 మంది నామినేషన్లు వేశారు. -
రిక్షాలో వచ్చి నామినేషన్ పత్రాల్లో తప్పులు సవరించుకున్న ఎంపీ అభ్యర్థి
[ 25-04-2024]
దేశానికి మోదీ అవసరం ఇప్పుడు లేదని శివసేన బలపర్చిన టీపీఎస్ అభ్యర్థి పూస శ్రీనివాస్ అన్నారు. -
ప్రభుత్వంపై విమర్శ.. రైతులకు భరోసా
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సుయాత్ర చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దానిని ఉమ్మడి జిల్లా నుంచే ప్రారంభించడంతో.. భారాస నేతలు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. -
బాలికలు.. భళా
[ 25-04-2024]
విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. -
మోదీతో తెలంగాణకు తీరని అన్యాయం
[ 25-04-2024]
కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ తెలంగాణకు తీరని అన్యాయం చేశారని నల్గొండ లోక్సభ ఇన్ఛార్జి, మంత్రి నల్లమాద ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. -
బాలికలదే హవా
[ 25-04-2024]
రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. -
ఉపాధి కూలీల సౌకర్యాలపై సమీక్ష
[ 25-04-2024]
పని ప్రదేశాలలో ఉపాధి కూలీలకు మౌలిక సౌకర్యాలు సమకూర్చాలని జిల్లా పరిషతు ముఖ్య కార్యనిర్వహణాధికారి శోభారాణి, ఆదనపు డీఆర్డీవో జి.సురేష్, సూచించారు. -
ప్రథమంలో 26.. ద్వితీయంలో 25
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. 2022-23లో జిల్లా ఉత్తీర్ణత శాతం 57 ఉండగా, ప్రస్తుతం 54.50 శాతానికి పడిపోయింది. -
ఊపందుకున్న నామినేషన్ల పర్వం
[ 25-04-2024]
నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాలకు బుధవారం వరకు 45 మంది చొప్పున నామినేషన్లు వేశారు. -
గిరిజన గురుకులాల్లో 88.60శాతం ఉత్తీర్ణత
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో కలిపి ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 88.60శాతం ఫలితాలు -
మతోన్మాద భాజపాను ఓడించండి: సీపీఐ
[ 25-04-2024]
దేశంలో మతోన్మాదం పేరుతో రాజకీయాలు చేస్తున్న భాజపాను ఓడించి కాంగ్రెస్ అభ్యర్ధులను భారీ మెజార్టీతో గెలిపించాలని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. -
విభజన హామీల అమలుకు కృషి
[ 25-04-2024]
భువనగిరి లోక్సభ ఎంపీగా తనను గెలిపిస్తే విభజన హామీలను అమలు చేసేందుకు, నిధులు రాబట్టేందుకు కృషి చేస్తానని భువనగిరి లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. -
తొలి ఎన్నికలోనే అత్యధిక మెజారిటీ
[ 25-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1951లో ఏర్పడగా.. తొలి ఎన్నికలు 1952లో జరిగాయి. -
రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం, వ్యక్తి అరెస్ట్
[ 25-04-2024]
రైల్వేశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని 17 మంది బాధితుల నుంచి నగదు వసూలు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు పోలీస్ ఇన్స్పెక్టర్ అశోక్రెడ్డి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
లండన్లో ఖలిస్థానీ అనుకూలవాదుల దుశ్చర్య కేసు.. కీలక నిందితుడి అరెస్టు
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట