మహిళలకు బతుకమ్మ కానుకగా చీరలు
రూ.90ల చీరను ఇస్తూ సీఎం కేసీఆర్ మహిళలను అవమాన పరుస్తున్నారని ప్రతిపక్ష నేతలు విమర్శించడం సరికాదని, చేనేత కార్మికులకు ఉపాధి కల్పిస్తూ బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడపడుచులకు ఇచ్చే కానుకని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సునీత అన్నారు.
ఆలేరు: అగరుబత్తుల తయారీని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే గొంగిడి సునీత
యాదగిరిగుట్ట అర్బన్: రూ.90ల చీరను ఇస్తూ సీఎం కేసీఆర్ మహిళలను అవమాన పరుస్తున్నారని ప్రతిపక్ష నేతలు విమర్శించడం సరికాదని, చేనేత కార్మికులకు ఉపాధి కల్పిస్తూ బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడపడుచులకు ఇచ్చే కానుకని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే సునీత అన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలో బతుకమ్మ చీరలను గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలను దృష్టిలో ఉంచుకొని కేసీఆర్ సంక్షేమ పథకాల రూపకల్పన ఉంటుందన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ ఫలాలు అందుతాయని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఏంసీ ఛైర్మన్ గడ్డమీది రవీదర్ గౌడ్, జడ్పీటీసీ సభ్యురాలు తోటకూరి అనురాధ, పురపాలక అధ్యక్షురాలు ఏరుకల సుధా, కమిషనర్ శ్రవణ్కుమార్ రెడ్డి, తెరాస మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, కౌన్సిలర్లు, వివిధ గ్రామాల సర్పంచులు, మదర్ డెయిరీ డైరెక్టర్లు, నాయకులు పాల్గొన్నారు.
అగరుబత్తుల తయారీ పరిశ్రమ పరిశీలన.. ఆలేరు: ఆలేరులోని ప్రభుత్వ ఇండోర్ స్టేడియంలో ‘వాగ్మీ’ మహిళా సంఘం ఆధ్వర్యంలో ప్రారంభమైన అగరుబత్తుల తయారీ పరిశ్రమను ఎమ్మెల్యే గొంగిడి సునీత గురువారం సాయంత్రం పరిశీలించారు. జిల్లా పాలనాధికారి, యాదాద్రి దేవస్థానం సహకారంతో అగరు బత్తుల తయారీని చేపట్టారని రానున్న రోజుల్లో వాగ్మీ పేరిట కుంకుమ, పసుపు, కొబ్బరి చిప్పలతో ఆకృతి రకాలను తయారు చేస్తామని తహసీల్దార్ రామకృష్ణ వివరించారు. యాదాద్రి కొండపైన, త్వరలో జిల్లా కలెక్టరేట్ సమీపంలో ఏర్పాటు కానున్న స్టాళ్లలో విక్రయిస్తామన్నారు. తహసీల్దారు రామకృష్ణను, రిసోర్స్ పర్సన్లను ఎమ్మెల్యే అభినందించారు. మాజీ సర్పంచి దాసి సంతోష్, పుట్ట మల్లేశం, గంగుల శ్రీనివాస్, మామిడాల భాను, పత్తి వెంకటేశ్, పయాజ్ తదితరులు ఉన్నారు.
వాగ్వాదం... ఆలేరు: పట్టణంలో గురువారం సాయంత్రం ఎమ్మెల్యే గొంగిడి సునీత బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. కరోనా సమయంలో రాష్ట్ర ప్రభుత్వం పేదల బ్యాంకు ఖాతాల్లో రూ.1,500 చొప్పున జమ చేసిందని అనగా..తనకు డబ్బులు రాలేదని ఓ మహిళ ఎమ్మెల్యేతో వాదించారు. అక్కడున్న తెరాస నాయకులు మహిళలకు సర్దిచెప్పడంతో వాగ్వాదం సద్దు మణిగింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దాహం కేకలు తీర్చేందుకు...తరలి వస్తున్న కృష్ణమ్మ
[ 19-04-2024]
నాగార్జునసాగర్ జలాశయం డెడ్స్టోరేజీ దిగువకు చేరినా వేసవిలో హైదరాబాద్ జంట నగరాలు, జిల్లా వాసుల దాహం కేకలు తీర్చేందుకు కృష్ణాజలాల సరఫరాకు హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ (జలమండలి) అధికారులు చేపడుతున్న చర్యలు సఫలీకృతమయ్యాయి -
సైబర్ బాధితులకు వారియర్స్ తోడు
[ 19-04-2024]
చరవాణుల ద్వారా డిజిటల్ లావాదేవీలు పెరగడంతో నిత్యం ఎక్కడో చోట అమాయకులు సైబర్ నేరగాళ్ల వలలో పడి ఆర్థికంగా నష్టపోతున్నారు. -
రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా: మంత్రి ఉత్తమ్
[ 19-04-2024]
కోదాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. -
గాడితప్పిన గస్తీ
[ 19-04-2024]
జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. వరుసగా గొలుసు చోరీలకు పాల్పడుతున్నారు. నిఘా పటిష్ఠం చేసి దొంగలను పట్టుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారు. -
ఆలయ భద్రతపై ఇంత నిర్లక్ష్యమా!
[ 19-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని నిత్యం వేల సంఖ్యలో భక్తులు సందర్శిస్తుంటారు. ఆలయంలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతే లోనికి అనుమతించేందుకు బ్యాగేజ్ స్కానింగ్, మెటల్ డిటెక్టర్, తదితర భద్రతా పరికరాలను వైటీడీఏ కొనుగోలు చేసింది. -
భక్తవత్సలుడికి సంప్రదాయ ఆరాధనలు
[ 19-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో గురువారం స్వయంభువులైన పంచనారసింహులను ఆరాధిస్తూ చేపట్టిన నిత్య పూజలు ఆలయ ఆచారంగా కొనసాగాయి -
కేసీఆర్కు సీఎం రేవంత్రెడ్డే సరైనోడు: రాజగోపాల్రెడ్డి
[ 19-04-2024]
తెలంగాణ ఇచ్చిన పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని.. ఆలస్యం అయినా ప్రవేశపెట్టిన పథకాలను నెరవేర్చి.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని భువనగిరి లోక్సభ ఇన్ఛార్జి, స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. -
నాయకులొస్తున్నారు..!
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్సభ స్థానాలైన నల్గొండ, భువనగిరిలో నామినేషన్ దాఖలు సందర్భంగా భారీ ఎత్తున ర్యాలీలు, సభలు నిర్వహించాలని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలు భారాస, భాజపాలు నిర్ణయించాయి -
67 ఏళ్లలో 69 శాతమే!
[ 19-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1952లో ఏర్పడగా.. 2019 వరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. 2019 నాటికి నియోజకవర్గానికి తొలి ఎన్నికలు జరిగి 67 ఏళ్లు గడిచాయి -
నల్గొండలో నలుగురు, భువనగిరిలో ముగ్గురు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం మొదలైంది. తొలి రోజు గురువారం నల్గొండ లోక్సభ స్థానానికి నలుగురు అభ్యర్థులు ఆరు సెట్లు నామినేషన్లను రిటర్నింగ్ అధికారి, నల్గొండ జిల్లా కలెక్టరు హరిచందనకు అందజేశారు. -
నల్గొండ.. నాయకులకు అండ!
[ 19-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గానికి 18వ సారి ఎన్నికలు జరుగనున్నాయి. ఉమ్మడి జిల్లాలో తొలిసారి ఏర్పడిన ఏకైక లోక్సభ నియోజకవర్గం నల్గొండ మాత్రమే. -
పార్లమెంటు.. ఎంపీ అంటే తెలుసా
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు తమదైన శైలిలో సమావేశాలు నిర్వహిస్తూ ఓటర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు -
వ్యాను ఢీకొని రైతు మృతి
[ 19-04-2024]
ద్విచక్రవాహనాన్ని వ్యాను ఢీకొనడంతో రైతు మృతి చెందిన ఘటన మఠంపల్లి మండలం రఘునాథపాలెం పరిధిలోని వెంకటాయపాలెంలో గురువారం జరిగింది. -
ఇంటి మీద.. అవార్డుల పంట
[ 19-04-2024]
మిద్దె తోటలు.. ఆరోగ్యానికి ఉపయోగపడే కూరగాయలతో పాటు పురస్కారాలనూ తీసుకొస్తున్నాయి.