రాష్ట్రంలో ఎటుచూసినా పచ్చదనమే: మంత్రి ఇంద్రకరణ్రెడ్డి
అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో దూసుకెళ్తున్న తెలంగాణ రాష్ట్రం జాతీయస్థాయిలో అనేక అవార్డులు సాధిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాకేంద్రం భువనగిరిలో
జిల్లా అటవీశాఖ అధికారిణి పద్మజారాణిని కుర్చీలో కూర్చోబెడుతున్న మంత్రులు జగదీశ్రెడ్డి, ఇంద్రకరణ్రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, విప్ సునీత, ఎమ్మెల్యే శేఖర్రెడ్డి, తదితరులు
భువనగిరి, న్యూస్టుడే: అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో దూసుకెళ్తున్న తెలంగాణ రాష్ట్రం జాతీయస్థాయిలో అనేక అవార్డులు సాధిస్తూ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాకేంద్రం భువనగిరిలో రెండెకరాల విస్తీర్ణంలో రూ.3.50 కోట్లతో నూతనంగా నిర్మించిన అటవీ అధికారుల కార్యాలయ సముదాయ భవనాన్ని విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డితో కలిసి గురువారం ఆయన ప్రారంభించారు. జిల్లా అటవీశాఖ అధికారిణి పద్మజారాణిని కుర్చీలో కూర్చోబెట్టారు. ఆవరణలో మొక్కలు నాటి నీళ్లు పోశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో 33 శాతం పచ్చదనం ఉండాలన్న సీఎం సంకల్పాన్ని పూర్తి చేసే దిశగా అటవీశాఖ యజ్ఞంలా తెలంగాణకు హరితహారం చేపడుతోందని, ఇప్పటికీ 24 నుంచి నాలుగు శాతం అడవులు పెరిగాయని, మిగిలిన శాతాన్ని పూర్తిచేసే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. రాష్ట్రంలో 17వేల నర్సరీలు ఏర్పాటుచేశామని, 230 కోట్ల మొక్కలు పెంచాలన్న లక్ష్యానికి 249 కోట్ల మొక్కలు నాటామని, వాటిలో 80శాతం బతికి ఉన్నట్లు చెప్పారు. ఫలితంగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా పచ్చదనం కనిపిస్తోందన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతంగా అమలుచేస్తున్న అధికారులు, ప్రజాప్రతినిధులను అభినందించారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎలిమినేటి సందీప్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, పుర అధ్యక్షుడు ఎనబోయిన ఆంజనేయులు, రాష్ట్ర అటవీశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి శాంతికుమారి, రాష్ట్ర అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ రాకేశ్మోహన్ డోబ్రియాల్, కలెక్టర్ పమేలా సత్పతి, అదనపు కలెక్టర్ దీపక్తివారి, యాదాద్రి సర్కిల్ ఫారెస్ట్ కన్జర్వేటర్ శివాని డోగ్రా, రేంజ్ ఆఫీసర్ కిరణ్కుమార్ పాల్గొన్నారు.
ప్రొటోకాల్ పాటించలేదని నిరసన.. ప్రారంభోత్సవంలో అధికారులు ప్రొటోకాల్ పాటించలేదని భువనగిరికి చెందిన ప్రజాప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయమై భువనగిరి మున్సిపల్ ఛైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు అటవీశాఖ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఆహ్వాన పత్రికలో ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి పేరు పెట్టకపోవడంపై తెరాస శ్రేణులు మండిపడ్డారు. ఇదే విషయమై ఎమ్మెల్యే కూడా మంత్రుల వద్ద అసంతృప్తి వ్యక్తంచేసినట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రభుత్వంపై విమర్శ.. రైతులకు భరోసా
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సుయాత్ర చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దానిని ఉమ్మడి జిల్లా నుంచే ప్రారంభించడంతో.. భారాస నేతలు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. -
బాలికలు.. భళా
[ 25-04-2024]
విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. -
మోదీతో తెలంగాణకు తీరని అన్యాయం
[ 25-04-2024]
కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ తెలంగాణకు తీరని అన్యాయం చేశారని నల్గొండ లోక్సభ ఇన్ఛార్జి, మంత్రి నల్లమాద ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. -
బాలికలదే హవా
[ 25-04-2024]
రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. -
ఉపాధి కూలీల సౌకర్యాలపై సమీక్ష
[ 25-04-2024]
పని ప్రదేశాలలో ఉపాధి కూలీలకు మౌలిక సౌకర్యాలు సమకూర్చాలని జిల్లా పరిషతు ముఖ్య కార్యనిర్వహణాధికారి శోభారాణి, ఆదనపు డీఆర్డీవో జి.సురేష్, సూచించారు. -
ప్రథమంలో 26.. ద్వితీయంలో 25
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. 2022-23లో జిల్లా ఉత్తీర్ణత శాతం 57 ఉండగా, ప్రస్తుతం 54.50 శాతానికి పడిపోయింది. -
ఊపందుకున్న నామినేషన్ల పర్వం
[ 25-04-2024]
నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాలకు బుధవారం వరకు 45 మంది చొప్పున నామినేషన్లు వేశారు. -
గిరిజన గురుకులాల్లో 88.60శాతం ఉత్తీర్ణత
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో కలిపి ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 88.60శాతం ఫలితాలు -
మతోన్మాద భాజపాను ఓడించండి: సీపీఐ
[ 25-04-2024]
దేశంలో మతోన్మాదం పేరుతో రాజకీయాలు చేస్తున్న భాజపాను ఓడించి కాంగ్రెస్ అభ్యర్ధులను భారీ మెజార్టీతో గెలిపించాలని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. -
విభజన హామీల అమలుకు కృషి
[ 25-04-2024]
భువనగిరి లోక్సభ ఎంపీగా తనను గెలిపిస్తే విభజన హామీలను అమలు చేసేందుకు, నిధులు రాబట్టేందుకు కృషి చేస్తానని భువనగిరి లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. -
తొలి ఎన్నికలోనే అత్యధిక మెజారిటీ
[ 25-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1951లో ఏర్పడగా.. తొలి ఎన్నికలు 1952లో జరిగాయి. -
రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం, వ్యక్తి అరెస్ట్
[ 25-04-2024]
రైల్వేశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని 17 మంది బాధితుల నుంచి నగదు వసూలు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు పోలీస్ ఇన్స్పెక్టర్ అశోక్రెడ్డి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయ రాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM