పంపిణీ స్థలం ఓ చోట.. స్వాధీనం మరోచోట!
ప్రభుత్వ నిబంధనల ప్రకారం అసైన్డ్ కమిటీ సూచన మేరకు భూమి లేని నిరుపేదలు సేద్యం చేసుకుంటూ జీవనం పొందేలా వారికి చేయూతనివ్వడానికి గరిష్ఠంగా ఒక్కో కుటుంబానికి ఐదు ఎకరాల వరకు ప్రభుత్వ భూమిని పంపిణీ చేయవచ్చు.
అనర్హుల చేతిలో రూ. 10 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి
సర్వే నంబర్ 202లోని ప్రభుత్వ భూమి
కొండమల్లేపల్లి, న్యూస్టుడే: ప్రభుత్వ నిబంధనల ప్రకారం అసైన్డ్ కమిటీ సూచన మేరకు భూమి లేని నిరుపేదలు సేద్యం చేసుకుంటూ జీవనం పొందేలా వారికి చేయూతనివ్వడానికి గరిష్ఠంగా ఒక్కో కుటుంబానికి ఐదు ఎకరాల వరకు ప్రభుత్వ భూమిని పంపిణీ చేయవచ్చు. కానీ కొండమల్లేపల్లి మండలంలోని కొలుముంతలపహాడ్ గ్రామంలో అనర్హులకు విలువైన ప్రభుత్వ భూమిని పంపిణీ చేశారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
కొలుముంతలపహాడ్లో సర్వే నంబర్ 202లో 295 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అందులో 15 ఏళ్ల క్రితం 48 ఎకరాలను 28 కుటుంబాలకు పేదలనే కారణంతో పంపిణీ చేశారు. అప్పటి లబ్ధిదారుల్లో మూడు కుటుంబాలు ఆర్థికంగా ఉన్నప్పటికీ రాజకీయ ఒత్తిడితో ఓ కుటుంబంలో భర్తకు 5 ఎకరాలు, భార్యకు 2 ఎకరాలు, మరో రెండు కుటుంబాలకు నాలుగు ఎకరాల చొప్పున పంపిణీ చేశారు. ఈ 15 ఎకరాల విలువ ప్రస్తుతం రూ.10 కోట్లకు పైమాటే ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. ఇదంతా అప్పట్లో విధులు నిర్వహించిన ఓ కింది స్థాయి రెవెన్యూ ఉద్యోగి చొరవతో జరిగినట్లు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. పంపిణీ చేసిన ఆ భూమి సేద్యానికి అనుకూలంగా లేకపోవడం, రాళ్లు ఉండటంతో చాలా కుటుంబాలు నేటికీ సేద్యం చేయలేదు. కానీ ఇటీవల అందులో కొంత మంది వ్యక్తులు అప్పట్లో ప్రభుత్వం తమకు పట్టా ఇచ్చిందని చెబుతూ భూమిని స్వాధీనం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. అప్పట్లో ప్రభుత్వం రోడ్డుకు దూరంగా ఓ చోట పట్టాలు పంపిణీ చేస్తే వీరు మాత్రం రోడ్డుకు ఆనుకుని ఉన్న ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. స్థిరాస్తి వ్యాపారులతో కలిసి వ్యాపారం చేయటానికి పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని అనర్హులకు పంపిణీ చేసిన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి కేటాయించాలని స్థానికులు కోరుతున్నారు.
ప్రభుత్వ భూమిలో జరుగుతున్న నిర్మాణాలు
చర్యలు తీసుకుంటాం
- మందడి మహేందర్రెడ్డి, తహసీల్దార్, కొండమల్లేపల్లి
కొలుముంతలపహాడ్లో ప్రభుత్వం పంపిణీ చేసిన భూమిని, వివరాలను పరిశీలిస్తాం. అనర్హులుంటే అధికారుల సూచన మేరకు వారిపై చర్యలు తీసుకుంటాం. నిబంధనలకు వ్యతిరేకంగా ప్రభుత్వ భూమిని పొందితే వారితో పాటు, వారికి సహకరించిన వారిపై సైతం కేసులు నమోదు చేసి భూమిని స్వాధీనం చేసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాటలే తూటాలై..!
[ 24-04-2024]
‘నల్గొండ జిల్లా సాగునీటి రంగానికి కేసీఆర్ తీరని అన్యాయం చేశారు. బస్సు యాత్ర కాదు, మోకాళ్ల యాత్ర చేసినా భారాసకు ఎవరూ ఓటేయరు. -
వైభవంగా హనుమాన్ జయంతి
[ 24-04-2024]
హనుమాన్ జయంతి సందర్భంగా మంగళవారం ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపించారు. స్వామి వారికి సింధూరంతో అభిషేకం, తమల పాకులతో పూజలు నిర్వహించారు. -
పాఠాలకు బై.. ఆటలకు సై..!
[ 24-04-2024]
వేసవి సెలవులు వచ్చేశాయ్.. పది నెలల పాటు నిత్యం బడుల్లో పాఠాలు చదవడం, రాయడం తదితర పనుల్లో నిమగ్నమై ఉన్న చిన్నారులకు ఈ నెల 24 (బుధవారం) నుంచి మొదలయ్యే సెలవులతో ఉపశమనం లభించింది. -
అట్టహాసంగా కంచర్ల నామినేషన్
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతలకు తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. -
పార్టీ గుర్తుల చరిత్ర ఇదే
[ 24-04-2024]
రాజకీయ పార్టీలనగానే గుర్తొచ్చేది వాటి గుర్తులే. ప్రధానంగా ఎన్నికల సమయంలో పార్టీ అభ్యర్థుల కంటే గుర్తులకే ప్రాధాన్యం ఉంటుంది. -
వారు.. శాసనసభకు, లోక్సభకు ఎన్నికయ్యారు!
[ 24-04-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కొందరు నేతలు శాసనసభకు, లోక్సభకు ఎన్నికయ్యారు. దేశంలోనే అత్యధిక ఓట్లు సాధించి రికార్డు సృష్టించారు. -
ప్రలోభాల ఎర.. తప్పదు చెర!
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికలు మే 13న జరగనున్నాయి. ఇప్పటికే నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో ప్రచారం ఊపందుకుంటోంది. -
ఆహారం సేకరించి.. అభాగ్యుల ఆకలి తీర్చి..
[ 24-04-2024]
దేశంలో ఒక వైపు రెండు పూటలా తినడానికి తిండి లేక వేలాది మంది అవస్థలు పడుతున్నారు. మరో వైపు నిత్యం లక్షల టన్నుల ఆహార పదార్థాలు వ్యర్థాలుగా మారుతున్నాయి. -
లోక్సభలో గళం విప్పే అవకాశం ఇవ్వండి: జహంగీర్
[ 24-04-2024]
ప్రజాసమస్యల పరిష్కారానికి జనం వెన్నంటే ఉండి నిరంతరం పోరాటాలు చేస్తున్న తనకు మద్దతుగా నిలిచి గెలిపిస్తే పార్లమెంటులో ఈ ప్రాంత సమస్యలపై గళం విప్పుతానని భువనగిరి లోక్సభ సీపీఎం అభ్యర్థి ఎండీ.జహంగీర్ అన్నారు. -
గత పొరపాట్లు పునరావృతం కావొద్దు: కలెక్టర్
[ 24-04-2024]
త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో సెక్టార్, పోలీసు అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ వెంకటరావు అన్నారు. -
బడికి నిధులు
[ 24-04-2024]
యాదాద్రి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం రూ.25 కోట్లు మంజూరు చేసింది. ఈ పనులను అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా చేపట్టనున్నారు. -
అతిథులు తరలొచ్చె.. బూర పూరించె..!
[ 24-04-2024]
ఓట్ల కోసం అనాదిగా మత రాజకీయాలు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీయేనని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. -
వేస్తున్నారు నామినేషన్లు..!
[ 24-04-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కొనసాగుతోంది. -
అభ్యర్థులిద్దరూ ‘బీఎన్ రెడ్డి’లే..!
[ 24-04-2024]
మిర్యాలగూడ లోక్సభ నియోజకవర్గంలో 1989, 1991 ఎన్నికల్లో ప్రధాన అభ్యర్థులిద్దరూ బీఎన్రెడ్డిలే. ఒకరు వాస్తుశిల్పి బద్దం నర్సింహారెడ్డి. మరొకరు భీంరెడ్డి నర్సింహారెడ్డి. -
1,29,766 ఓట్లు కొల్లగొట్టిన స్వతంత్రులు
[ 24-04-2024]
ఫ్లోరైడ్కు వ్యతిరేకంగా జలసాధన సమితి ఆధ్వర్యంలో 1996 లోక్సభ ఎన్నికల్లో 476 మంది స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో వీరు 1,29,766 ఓట్లు సాధించారు.
తాజా వార్తలు (Latest News)
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
-
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
-
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్
-
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
-
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు