సీఎం సారూ.. ఈ సమస్యలు పరిష్కరించరూ..
కృష్ణశిలతో నిర్మితమైన దివ్యధామం.. లక్ష్మీనారసింహులు కొలువుదీరిన భవ్య క్షేత్రం.. సీఎం కేసీఆర్ సంకల్పంతో నవ వైకుంఠంగా తీర్చిదిద్దారు. ఎన్ని వసతులు కల్పించినా ఇంకా చిన్నచిన్న సమస్యలతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.
- యాదగిరిగుట్ట, న్యూస్టుడే
కృష్ణశిలతో నిర్మితమైన దివ్యధామం.. లక్ష్మీనారసింహులు కొలువుదీరిన భవ్య క్షేత్రం.. సీఎం కేసీఆర్ సంకల్పంతో నవ వైకుంఠంగా తీర్చిదిద్దారు. ఎన్ని వసతులు కల్పించినా ఇంకా చిన్నచిన్న సమస్యలతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. వీటిపై దృష్టిసారిస్తే మరిన్ని వసతులు మెరుగు కానున్నాయి. శుక్రవారం యాదాద్రి క్షేత్రానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు రానున్న నేపథ్యంలో భక్తులకు కల్పించాల్సిన వసతులపై కథనం.
రూ.కోట్ల ఖర్చుతో పునర్నిర్మించిన యాదాద్రి పుణ్యక్షేత్రంలో దైవదర్శనానికి ఆలయానికి వెళ్లే సముదాయంలో నడవ లేని వారి కోసం ఏర్పరచిన ఎస్కలేటర్ వినియోగంలో లేదు. ప్రత్యేక దర్శనం చేసుకోవాలని టికెట్ ఖరీదు చేసిన భక్తులకు ఎలా వెళ్లాలో తెలియని పరిస్థితి. గంటల కొద్దీ వేచి ఉండే రద్దీ రోజుల్లో అత్యవసర పరిస్థితుల్లో భక్తులు నానా యాతన పడుతున్నారు. ఆలయ సమీపాన మల, మూత్రశాలలు లేకపోవడంతో వారి బాధలు వర్ణనాతీతం. తాగునీటి సమస్యా నెలకొంది. అక్కడక్కడా తాగునీటి వనరులున్నా కొందరు ఇష్టపడక ఇబ్బందులు పడుతున్నారు. విశాల మాడ వీధులున్నా సేద తీరేందుకు నీడ సౌలభ్యం కానరాదు. షెడ్లు లేక వానకు తడవాల్సిందే.. ఎండకు ఎండాల్సిందే. బస్ బే ప్రాంగణం నుంచి ఆలయానికి చేరాలంటే ఆయాసం తప్పదు. సేద తీరి స్వామివారిని దర్శించుకునేలా సదుపాయం కల్పిస్తే భక్త జనానికి ఎంతో మేలు కాగలదని పలువురు ప్రముఖులు అంటున్నారు.
బస్సుల కోసం నిరీక్షణ
యాత్రికులకు కొండపైకి, కిందకు ఉచిత రవాణా కల్పించాలని, ఇందుకు ఆర్టీసీ సేవలు అందిస్తుందని స్వయాన సీఎం ఆలయ ఉద్ఘాటన దశలో వెల్లడించారు. కారణాలు ఏమిటో గాని ఆ సదుపాయం సన్నగిల్లింది. ప్రతి రెండు నిమిషాలకో బస్సు అని ఆదిలో చెప్పారు. ప్రస్తుతం అరగంట సేపు వేచి ఉండాల్సిందే. తమపై ఆర్థిక భారం పడుతోందని ఆలయ ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. ఈ కారణంగానే బస్సుల సంఖ్య తగ్గింది. 30 బస్సులకు బదులు 8 మాత్రమే నడుస్తున్నాయి. రాత్రి వేళల్లో వచ్చే యాత్రికుల కోసం రాయగిరి నుంచి యాదాద్రికి గల రహదారుల్లో ఏర్పర్చిన విద్యుత్తు దీపాల వెలుగులు కనుమరుగయ్యాయి. దీంతో ఆశయం అటకెక్కింది. విద్యుత్తు దీపాల బిల్లుల చెల్లింపుల సమస్యతో రహదారుల మధ్య కాంతులు చీకట్లుగా మారాయి. ఈ క్షేత్రాభివృద్ధి కోసం ప్రత్యేక శ్రద్ధ వహించిన ముఖ్యమంత్రి భక్తులకు ఎదురయ్యే ఇక్కట్లను తొలగిస్తే హర్షదాయకమే. కొండపైన ఆలయ పరిసరాల్లో కనీస వసతులపై దృష్టి పెట్టాల్సిన అవసరముంది. సామాన్య భక్తుల కోసం తగు ఏర్పాట్లు చేపట్టాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నీటిలోని చేపొచ్చి.. నేలమీద పడుతోంది..!
[ 28-03-2024]
తగ్గుతున్న భూగర్భ జలాలతో రైతులతో పాటు మత్స్యకారులు నష్టపోతున్నారు. ఉమ్మడి జిల్లాలోని చెరువుల నీటిమట్టాలు రోజురోజుకూ తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో చెరువుల్లోని చేపలు తగినంత పరిమాణం పెరగక ముందే పట్టేసి విక్రయించాల్సిన దుస్థితి నెలకొంది. -
వారివి చుట్టపు చూపులే..!
[ 28-03-2024]
గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన అస్తవ్యస్తంగా మారింది. ఎంపీడీవోలు, పంచాయతీరాజ్, నీటిపారుదల, పశుసంవర్థక,రెవెన్యూ, విద్యాశాఖాధికారులను క్లస్టర్ల వారీగా ప్రత్యేకాధికారులుగా ప్రభుత్వం నియమించింది. -
కోడిపిల్లల అరుపు.. వినిపించదేం..!
[ 28-03-2024]
ఉమ్మడి జిల్లా నుంచి కొందరు రాయితీ కోడి పిల్లల పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. ఏడాది క్రితం రూ.1030, రూ.600 చొప్పున డీడీలు తీశారు. అప్పటి నుంచి పశుసంవర్ధక శాఖ అధికారుల చుట్టూ తిరుగుతున్నా.. -
నేటి నుంచి ధాన్యం కొనుగోళ్లు: అదనపు కలెక్టర్
[ 28-03-2024]
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలు గురువారం నుంచి ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. -
పురంలో.. దాహం తీరేలా..!
[ 28-03-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పురపాలికల్లో ప్రజల దాహార్తిని తీర్చేందుకు అమృత్-2.0 పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగసామ్యంతో రూ.491.46 కోట్లతో చేపట్టనున్న పనులకు సెప్టెంబరు 2023లో రాష్ట్ర పురపాలకశాఖ పరిపాలనా అనుమతి మంజూరు చేసింది. -
దగా ఆలోచనలపై.. నిఘా
[ 28-03-2024]
గత అసెంబ్లీ ఎన్నిల సందర్భంగా 28 ఏళ్ల యువకుడు భువనగిరి నియోజకవర్గంలో ప్రధాన పార్టీ అభ్యర్థికి సంబంధించిన అభ్యంతరకరమైన వీడియోను సృష్టించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. -
గ్రామాల్లో డ్రోన్ కలకలం
[ 28-03-2024]
యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని పాచిల్ల, తుర్కలషాపురం, రామారం, వంగాల, గుండాల గ్రామాల మీదుగా నిత్యం డ్రోన్లు ఎగురవేస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. -
ఆట కట్టించలేరా..?
[ 28-03-2024]
జిల్లాలో జూదం జోరుకు కళ్లెం పడటం లేదు. పచ్చని కాపురాల్లో ఈ ఆట చిచ్చుపెడుతోంది. పోలీసుల దాడులకూ వెరవడం లేదు. ఈ నెల 16న ‘ఈనాడు’లో ప్రచురితమైన ‘తోటలో కాసుల వేట’... -
చివరికి అందేలా..ఆశలు నెరవేరేలా..!
[ 28-03-2024]
కొత్త ప్రభుత్వం ముక్త్యాల బ్రాంచి కాలువ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నాగార్జునసాగర్ ఎడమ కాలువ పరిధిలోని అతిపెద్ద బ్రాంచి కాలువ అయిన ముక్త్యాలకు ఆధునికీకరణ పనులు మళ్లీ మొదలయ్యాయి. -
వాడే ముందు జాగ్రత్త
[ 28-03-2024]
రోడ్డు ప్రమాదంలో కోదాడ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి కాలికి స్వల్ప గాయమవడంతో పట్టణంలోని ఓ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ కాలపరిమితి దాటిన బ్యాండేజీ కాలుకి కట్టడంతో వాపు తగ్గలేదు. -
బంధం ఎందుకో.. బలహీన పడుతోంది
[ 28-03-2024]
వివాహేతర సంబంధం, వేధింపులు.. కారణం ఏదైనా కడదాక కలిసి ఉంటామని పెళ్లి మండపంలో ప్రమాణం చేసిన కొందరు మహిళలు కట్టుకున్న భర్తలను అర్ధంతరంగా కానరాని లోకాలకు పంపేస్తున్నారు. -
ప్రచార అనుమతులకు సువిధ
[ 28-03-2024]
ఓటింగ్ ప్రక్రియను సులభతరం చేయడంతో పాటు సాంకేతికతను ఉపయోగించడం ద్వారా సమయాన్ని ఆదా చేయడంతో పాటు ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. -
సాఫ్ట్గా రాణిస్తూ.. పతకాలు కొట్టేస్తూ..!
[ 28-03-2024]
గ్రామీణ ప్రాంతాల వారికి కబడ్డీ, ఖో ఖో, వాలీబాల్ లాంటి ఆటలు మాత్రమే ఎక్కువగా పరిచయం. సాఫ్ట్బాల్ క్రీడ చాలామందికి కొత్తదే. అయినప్పటికీ పల్లెల్లో దశాబ్దకాలంగా విద్యార్థులు ఈ క్రీడపై ఆసక్తి కనబర్చుతున్నారు. -
భువనగిరి బరిలో చామల
[ 28-03-2024]
ఎడతెగని ఉత్కంఠ నడుమ అధికార కాంగ్రెస్ పార్టీ తమ భువనగిరి లోక్సభ ఎంపీ అభ్యర్థిగా చామల కిరణ్కుమార్రెడ్డిని ప్రకటించింది. ఆయన ఇక్కడి నుంచి ఎంపీగా పోటీ చేయడం ఇదే తొలిసారి.
తాజా వార్తలు (Latest News)
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్
-
ఆ హంతకులకు, జగన్కు ఓటు వేయొద్దు: వివేకా కుమార్తె సునీత
-
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
-
భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్ 655, నిఫ్టీ 203
-
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
-
నాటో దేశాలపై దాడి చేయం.. ఎఫ్-16లను మాత్రం కూల్చివేస్తాం: పుతిన్