ఆసరా అందాలంటే.. 85 కిలోమీటర్లు వెళ్లాల్సిందే..
ఈమె ఆసరా పింఛను కొత్త లబ్ధిదారు సావిత్రమ్మ. ఎక్కువ సమయం కూర్చోలేరు.. నిలబడ లేరు. ఒకరి సాయం ఉంటేనే అడుగులు వేస్తుంటారు. నకిరేకల్ నుంచి దేవరకొండకు ఎలా వెళ్లి పింఛను డబ్బులు తీసుకోవాలని ఆవేదన చెందుతున్నారు.
ఈమె ఆసరా పింఛను కొత్త లబ్ధిదారు సావిత్రమ్మ. ఎక్కువ సమయం కూర్చోలేరు.. నిలబడ లేరు. ఒకరి సాయం ఉంటేనే అడుగులు వేస్తుంటారు. నకిరేకల్ నుంచి దేవరకొండకు ఎలా వెళ్లి పింఛను డబ్బులు తీసుకోవాలని ఆవేదన చెందుతున్నారు.
నకిరేకల్, న్యూస్టుడే: ఏళ్లుగా ఎదురు చూస్తున్న పింఛను మంజూరైందన్న ఆనందం ఆవిరవుతోంది. జాబితాలో పేరున్నా..ఇతర లబ్ధిదారులు పింఛను డబ్బులు తెచ్చుకుంటున్నా.. వీరికి మాత్రం డబ్బులు చేతికి అందడం లేదు. పింఛను కోసం ఏళ్లుగా నిరీక్షించిన ఈ వృద్ధులు ఆ డబ్బుల కోసం రెండు నెలల నుంచి పడిగాపులు పడుతున్నారు. కొత్తగా మంజూరైన ఆసరా పింఛను డబ్బులు తీసుకునేందుకు వీరు 85 కిలోమీటర్ల దూరం వెళ్లాలని అధికారులు తాజాగా చెబుతుండటంతో వృద్ధులు హడలిపోతున్నారు. అసలు తాము పింఛను డబ్బులు కళ్లచూస్తామా? లేదా అనే ఆందోళన వారిని వెంటాడుతోంది. నకిరేకల్ పురపాలికకు గడిచిన ఆగస్టులో 580 కొత్త ఆసరా పింఛన్లు మంజూరయ్యాయి. వీరిలో 140 మంది వృద్ధుల పేర్లు దేవరకొండ పురపాలిక పరిధిలోకి వెళ్లడంతో నేటికీ పింఛను అందలేదు. వాటిని నకిరేకల్ పురపాలిక పరిధికి మార్చుచేయిస్తామని గతంలో అధికారులు లబ్ధిదారులకు చెప్పి సముదాయించారు. మార్పు అమలులో జాప్యం జరుగుతుండటంతో ఈ 140 మంది దేవరకొండకు వెళ్లి పింఛను డబ్బులు తీసుకోవాలని శనివారం పుర అధికారులు సమాచారం ఇవ్వడంతో వృద్ధుల్లో ఆందోళన మొదలైంది. నకిరేకల్ నుంచి దేవరకొండ 85 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాను పోను 170 కిలోమీటర్లు వృద్ధులు ప్రయాణించాల్సి ఉంటుంది. అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధులు అద్దెవాహనంలో దేవరకొండకు వెళ్లి వచ్చేందుకు రూ.వెయ్యికిపైగా ఖర్చవుతుంది. పింఛను మంజూరై రెండు నెలలవుతోంది. వరుసగా మూడునెలల పాటు పింఛను డబ్బులు తీసుకోకుంటే రద్దయ్యే ప్రమాదం ఉన్నందున ఈ సారికి దేవరకొండకు వెళ్లాల్సిందేనని అధికారులు స్పష్టం చేస్తుండటం గమనార్హం. ఇంత దూరం నుంచి దేవరకొండకు వెళ్లే తమకు అక్కడ నిరీక్షణ లేకుండా వెంటనే డబ్బులు ఇచ్చేలా పుర అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని పలువురు లబ్ధిదారులు కోరుతున్నారు.
సాంకేతిక సమస్యతోనే.. : ఎన్.బాలాజీ, కమిషనర్, పురపాలిక, నకిరేకల్
సాంకేతిక సమస్య కారణంగానే ఈ పురపాలికకు చెందిన 140 మంది ఆసరా అబ్ధిదారుల పేర్లు దేవరకొండ పురపాలిక పరిధిలోకి వెళ్లాయి.దీనిని సరిచేయలని డీఆర్డీఏ, మెప్మా అధికారులను కోరాం. దేవరకొండ, గాంధీనగర్ పోస్టాఫీసుల్లో వీరికి పింఛను డబ్బులు అందజేస్తారు. పనిదినాల్లో వెళ్లి తీసుకోవాలని కోరుతున్నాం. త్వరలో సమస్య పరిష్కారమవుతుంది. అక్కడ ఏమైనా సమస్య ఉంటే అక్కడి పుర అధికారులను సంప్రదించాలని సూచించాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భువనగిరిలో హనుమాన్ శోభయాత్ర ర్యాలీ
[ 23-04-2024]
హనుమాన్ జయంతి పురస్కరించుకొని భువనగిరి పట్టణంలో బజరంగ్దళ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. -
పతాక స్థాయికి ప్రచారం
[ 23-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఉమ్మడి నల్గొండ జిల్లాలో పతాక స్థాయికి చేరింది. భువనగిరి లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డికి మద్దతుగా ఆదివారం భువనగిరి పట్టణంలో -
కుటుంబ పాలనను తరిమికొట్టాలి
[ 23-04-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాకు మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి కుటుంబాలతో పాటూ జానారెడ్డి కుటుంబం చేసిందేమీ లేదని కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి విమర్శించారు. -
అనర్థం.. చెత్తలో బయో వ్యర్థం
[ 23-04-2024]
నల్గొండ జిల్లా పరిషత్తు, న్యూస్టుడే: ఆసుపత్రుల్లో జాగ్రత్తలు తీసుకునే వైద్యులు తమ ఆసుపత్రుల నుంచి వెలువడే వ్యర్థాలను మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. -
విత్తనం.. ఎవరిదీ పెత్తనం
[ 23-04-2024]
వరి విత్తనాలకు ప్రభుత్వం రాయితీ ఇవ్వడం లేదు. రైతన్నలపై విత్తన భారం పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం పరిశోధనా స్థానాలు, ఐఆర్ఆర్, ఐసీఏఆర్ తదితర కేంద్ర సంస్థల నుంచి విడుదలైన విత్తన రకాలనే సరఫరా చేస్తుంది. -
భగభగ మండే
[ 23-04-2024]
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
కరదీపిక.. సందేహాల నివృత్తికి వేదిక
[ 23-04-2024]
ఎన్నికల నిర్వహణలో పోలింగ్ విధులు నిర్వర్తించే అధికారుల పాత్ర కీలకం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండ, భువనగిరి లోక్సభ నియోజకవర్గాల్లో నామపత్రాల స్వీకరణ -
పేదల హృదయాల్లో నిలిచె
[ 23-04-2024]
ప్రజాభీష్టంతో మూడు పర్యాయాలు నాటి మిర్యాలగూడ ఎంపీగా ఎన్నికై, పేదల అభ్యున్నతికి పాటుపడిన దివంగత జీఎస్ రెడ్డి(గోపు శౌరెడ్డి).. -
ఈవీఎంలకు 35 ఏళ్లు
[ 23-04-2024]
ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంల పాత్ర అత్యంత ముఖ్యం. ఈ యంత్రం తొలుత వినియోగం, పుట్టు పూర్వోత్తరాలను పరిశీలించినట్లైతే.. -
అక్షరంతో సహవాసం.. వ్యక్తిత్వ వికాసం
[ 23-04-2024]
వ్యక్తి వికాసానికి, సమాజ చైతన్యానికి పుస్తకాలే ఆధారం. గతించిన కాలాన్ని భవిష్యత్ తరాలకు తెలియజేసే సాధనం పుస్తకం. పుస్తకాలను స్నేహితులుగా భావిస్తారు. -
జీవితంలో పాస్ అవుదాం..!
[ 23-04-2024]
పదో తరగతి, ఇంటర్, డిగ్రీ పరీక్షల్లో ఫెయిలయ్యామంటూ.. మార్కులు తక్కువ వచ్చాయంటూ.. పోటీ పరీక్షల్లో సీట్లు రాలేదంటూ.. ఏటా పలువురు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్న తరుణంలో.. -
నిర్మాణాల్లో.. అమలు కాని నిబంధనలు
[ 23-04-2024]
ఆలేరు పురపాలికగా ఏర్పడ్డాక ఏటా వందకు పైగా ఇళ్ల నిర్మాణాల అనుమతుల కోసం దరఖాస్తులు వస్తున్నాయి. కొత్త పురపాలిక చట్టం అమలులోకి వచ్చాక నిర్మాణాల అనుమతుల నిబంధనలు కఠినతరం చేశారు. -
బాలుడు మరణించిన 10 రోజులకు తండ్రి ఫిర్యాదు
[ 23-04-2024]
సంపులో పడి 22 నెలల బాలుడు మృతి చెందిన ఘటన మండలంలోని రెడ్డినాయక్తండాలో ఈ నెల 11న చోటు చేసుకుంది. -
ఎన్నికలయ్యే వరకు అప్రమత్తంగా ఉండండి: కలెక్టర్
[ 23-04-2024]
పోలింగ్ ప్రక్రియ ముగిసేంత వరకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి వెంకటరావు అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
వాట్సప్లో కొత్త ఫీచర్.. ఇంటర్నెట్ లేకున్నా ఫొటోలు పంపించొచ్చు!
-
టీ20 వరల్డ్ కప్తో రీ ఎంట్రీ?.. తలుపులు మూసుకుపోయాయన్న సునీల్ నరైన్
-
రెడ్మీ కొత్త వైఫై ట్యాబ్.. రూ.20 వేలకే రోబో వాక్యూమ్ క్లీనర్
-
హనుమాన్ జన్మోత్సవ్.. ప్రశాంత్వర్మ ప్లాన్ మామూలుగా లేదుగా!
-
శిరోముండనం కేసు.. హైకోర్టులో విచారణ వాయిదా
-
జీపీఎస్ జామ్.. రష్యా ‘రహస్య ఆయుధం’ పనేనా..?