లక్ష్యంపై గురి ఉంటే విజయం తథ్యం
చదువుల విషయంలో తల్లిదండ్రులు కూతుళ్లపై వివక్ష చూపేవారు. పెళ్లి జరిపించి అత్తింటికి పంపించే అమ్మాయికి పెద్ద చదువులు ఎందుకనే భావన ఉండేది. కాలంతోపాటే ఇప్పుడు అది మారిపోయింది.
చండూరు సబ్రిజిస్ట్రార్ అనూష
చండూరు, నకిరేకల్, న్యూస్టుడే: చదువుల విషయంలో తల్లిదండ్రులు కూతుళ్లపై వివక్ష చూపేవారు. పెళ్లి జరిపించి అత్తింటికి పంపించే అమ్మాయికి పెద్ద చదువులు ఎందుకనే భావన ఉండేది. కాలంతోపాటే ఇప్పుడు అది మారిపోయింది. అమ్మాయిలను ప్రోత్సహిస్తే అబ్బాయిలను మించి రాణించగలరని ఎందరో రుజువు చేశారు. కుమారులను కష్టపడి చదివిస్తే వారు ప్రయోజకులు అవుతారో లేరో కాని ఆడపిల్లలను చదివిస్తే మాత్రం వారు తప్పకుండా ఏదో ఒకటి సాధించి చూపిస్తారు. మనం చేయాల్సిందల్లా వారిని ప్రోత్సహించటమే. మేమున్నాం అని భరోసా కల్పించటమే.
ఏడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువతి
ప్రస్తుతం చండూరు సబ్రిజిస్ట్రార్గా పనిచేస్తున్న అనూష ఏకంగా ఏడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. ఈమెది సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం, కొండాపురం. ఈమె తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడు. ఆయనకు చదువు విలువ తెలుసు. అనూషకు అక్క, తమ్ముడు ఉన్నారు. అనూష చిన్నతనం నుంచి బాగా చదువుల్లో రాణించారు. తండ్రి ఆమెలోని ప్రతిభను గుర్తించారు. ఆమె ఇష్టానికి అనుగుణంగా ప్రోత్సహించారు. బీటెక్ చదివిన అనూష హైదరాబాదులో 2015లో విప్రోలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా చేరింది. కానీ ఆమె ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యం పెట్టుకుంది. ఆశయానికి తగ్గట్టుగా పట్టుదలతో చదివారు. 2016లో వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడటంతో వాటికి దరఖాస్తు చేశారు. తదేక దీక్షతో చదవడంతో స్టాఫ్ సెలెక్షన్ కమిషన్లో స్టెనోగ్రాఫర్, సివిల్, ఆబ్కారీ కానిస్టేబుల్, ఫారెస్టు రేంజర్, బీట్ ఆఫీసర్ ఉద్యోగాలు వచ్చాయి. కానీ అందులో ఆమె చేరలేదు. 2017లో సబ్ఇన్స్పెక్టర్ ఉద్యోగానికి ఎంపికై శిక్షణ పూర్తి చేసుకొని 2019లో త్రిపురారం మండలంలో ఎస్సైగా విధులు నిర్వర్తించారు. ఆతర్వాత గ్రూపు-2 ఫలితాల్లో సబ్రిజిస్ట్రార్ ఉద్యోగం రావటంతో ఎస్సై జాబ్ వదిలివేసి ప్రస్తుతం సబ్ రిజిస్ట్రార్గా విధులు నిర్వహిస్తున్నారు. ఓ ఎస్సైని వివాహం చేసుకున్నారు. ఆమెకు ఒక బాబు ఉన్నారు. ఎస్సైగా విధులు నిర్వర్తిస్తే గ్రూప్-1 లేదా సివిల్స్ లాంటి తన లక్ష్యం చేరుకోవటంలో ఆటంకం ఉంటుందని సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగం చేస్తున్నానని, భవిష్యత్తు తన లక్ష్యం చేరుకుంటానని అనూష ధీమాగా ఉన్నారు. ఫలితం కోసం ఆలోచించకుండా పట్టు వదలకుండా ప్రయత్నిస్తే విజయం దానంతట అదే వరిస్తుందని అనూష చెబుతున్నారు. ఉద్యోగ ప్రయత్నం చేసే యువతీ యువకులు ముందు తమ గమ్యాన్ని పక్కగా ఎంపిక చేసుకోవాలని, ఆ తర్వాత ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగాలని సూచిస్తున్నారు. చదువుకు పెళ్లి, పేదరికం, కష్టాలు వంటివి ఏవీ అడ్డుకాదని అనుకుంటే ఏదైనా సాధ్యమే అని పేర్కొంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రభుత్వంపై విమర్శ.. రైతులకు భరోసా
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సుయాత్ర చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దానిని ఉమ్మడి జిల్లా నుంచే ప్రారంభించడంతో.. భారాస నేతలు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. -
బాలికలు.. భళా
[ 25-04-2024]
విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. -
మోదీతో తెలంగాణకు తీరని అన్యాయం
[ 25-04-2024]
కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ తెలంగాణకు తీరని అన్యాయం చేశారని నల్గొండ లోక్సభ ఇన్ఛార్జి, మంత్రి నల్లమాద ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. -
బాలికలదే హవా
[ 25-04-2024]
రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. -
ఉపాధి కూలీల సౌకర్యాలపై సమీక్ష
[ 25-04-2024]
పని ప్రదేశాలలో ఉపాధి కూలీలకు మౌలిక సౌకర్యాలు సమకూర్చాలని జిల్లా పరిషతు ముఖ్య కార్యనిర్వహణాధికారి శోభారాణి, ఆదనపు డీఆర్డీవో జి.సురేష్, సూచించారు. -
ప్రథమంలో 26.. ద్వితీయంలో 25
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. 2022-23లో జిల్లా ఉత్తీర్ణత శాతం 57 ఉండగా, ప్రస్తుతం 54.50 శాతానికి పడిపోయింది. -
ఊపందుకున్న నామినేషన్ల పర్వం
[ 25-04-2024]
నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాలకు బుధవారం వరకు 45 మంది చొప్పున నామినేషన్లు వేశారు. -
గిరిజన గురుకులాల్లో 88.60శాతం ఉత్తీర్ణత
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో కలిపి ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 88.60శాతం ఫలితాలు -
మతోన్మాద భాజపాను ఓడించండి: సీపీఐ
[ 25-04-2024]
దేశంలో మతోన్మాదం పేరుతో రాజకీయాలు చేస్తున్న భాజపాను ఓడించి కాంగ్రెస్ అభ్యర్ధులను భారీ మెజార్టీతో గెలిపించాలని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. -
విభజన హామీల అమలుకు కృషి
[ 25-04-2024]
భువనగిరి లోక్సభ ఎంపీగా తనను గెలిపిస్తే విభజన హామీలను అమలు చేసేందుకు, నిధులు రాబట్టేందుకు కృషి చేస్తానని భువనగిరి లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. -
తొలి ఎన్నికలోనే అత్యధిక మెజారిటీ
[ 25-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1951లో ఏర్పడగా.. తొలి ఎన్నికలు 1952లో జరిగాయి. -
రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం, వ్యక్తి అరెస్ట్
[ 25-04-2024]
రైల్వేశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని 17 మంది బాధితుల నుంచి నగదు వసూలు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు పోలీస్ ఇన్స్పెక్టర్ అశోక్రెడ్డి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు