అమ్మవారు.. అభయమిస్తూ..
సృష్టిలో తల్లిని మించిన దైవం లేదు అంటారు. అలాంటి అమ్మ రూపంలో విజయాలను అందించే విజయదుర్గగా అమ్మవారు పూజలను అందుకుంటోంది. అమ్మలగన్న అమ్మ కనకదుర్గమ్మ ప్రతి ఇంటిలో ‘అమ్మ’ రూపంలో కొలువై ఉంది.
చిట్యాల, న్యూస్టుడే
సృష్టిలో తల్లిని మించిన దైవం లేదు అంటారు. అలాంటి అమ్మ రూపంలో విజయాలను అందించే విజయదుర్గగా అమ్మవారు పూజలను అందుకుంటోంది. అమ్మలగన్న అమ్మ కనకదుర్గమ్మ ప్రతి ఇంటిలో ‘అమ్మ’ రూపంలో కొలువై ఉంది. దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతి రోజు ఒక అవతారంగా కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తోంది. బుధవారం విజయదశమి నవరాత్రుల ముగింపు సందర్భంగా దుర్గాదేవి అవతారాలపై కథనం.
ఆకలి తీర్చేతల్లి అన్నపూర్ణ
భూమిని తల్లితో పోలుస్తారు. భూమాతకు ఓపిక ఎక్కువ అంటారు. తన పిల్లలైన ప్రజలకు శరీరాన్ని కప్పుకునే వస్త్రం నుంచి బతకడానికి అవసరమైన ఆహారం వరకు కావాల్సినవి ఏమిటో తెలుసుకనక తానే ఉత్పాదక శక్తిగా మారి సమస్త ఆహారధాన్యాన్ని, పప్పుదినుసులను, ఇతర సమస్త రకాల పంటలను ఉత్పత్తిచేసి మనకు అందిస్తుంది. ఇంట్లో చిన్నాపెద్దా ఆకలిని గుర్తెరిగి ప్రేమగా కొసరి, కొసరి వడ్డిస్తుంది. జీవన చరమాంకంలో మృత్యువుకు లొంగిపోయిన మనల్ని తుదకు తనలోనే కలుపుకుంటుంది.
జ్ఞాననేత్రి సరస్వతి
సమాజంలో, సన్మార్గంలో జీవించడానికి చక్కని జ్ఞానం అవసరం. జీవితంలో సన్మార్గంలో పయనించడానికి మంచి ఆలోచనలూ కావాలి. అలాంటి ఆలోచనలు, జ్ఞానాన్ని అందించే తల్లి సరస్వతి. ఇంట్లో అమ్మ కూడా చిన్ననాటి నుంచి విద్యాబుద్ధులతోపాటు సమాజంలో మన నడవడిక గురించి చాలా జాగ్రత్తలు నేర్పుతుంది. మనం జ్ఞాన సంపన్నులమై ఎంతో ఎత్తు ఎదగడానికి, సమాజామోదం పొందే విధానాలను, పద్ధతులను అమ్మ చిన్నప్పటినుంచే మనకు నూరిపోస్తుంది. సరస్వతి అమ్మవారి వాహనం హంస. పాలల్లో కలిసిన నీటిని వేరుచేసి పాలుమాత్రమే తాగగలిగే సామర్థ్యం ఒక్క హంసకు మాత్రమే ఉంది. మంచి, చెడును వేరు చేసి, విడమరిచి చెపుతూ అమ్మ మనల్ని సన్మార్గంలో ప్రయాణించే జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది.
సిరిలిచ్చే మహాలక్ష్మి
సిరిసంపదలను, సుఖశాంతులను కలిగిస్తుంది మహాలక్ష్మి దేవి. సిరిసంపదలు మనతో ఉండాలంటే ఇంట్లో అమ్మకే వాటిని కాపాడే బాధ్యత తెలుస్తుంది. రైతు పంటలు పండించి, మంచి దిగుబడులు సాధించి, వాటిని విక్రయించడం ద్వారా లాభాలు పొందినా, రైతుల నుంచి తాను కొనుగోలు చేసిన సరకులను మార్కెట్లో విక్రయించి వ్యాపారి లాభాలు గడించినా అది లక్ష్మిదేవి చలవే. ఇంట్లో అమ్మ కూడా లక్ష్మిదేవిరూపమే. ఆమెను అంత గౌరవంతో చూసుకోవాలి.
దన్నుగా నిలిచే మహిషాసుర మర్ధిని
చిన్నపుడు మనకు ఏ చిన్న దెబ్బ తగిలినా తనకే తగిలినంత బాధపడుతుంది అమ్మ. అలాంటి విషయాల్లో నాన్నకన్నా అమ్మే మనకోసం ముందుకు వస్తుంది. మనకు ఎలాంటి కష్టాలు వచ్చిన అడ్డంగా నిలిచి వాటిని పారదోలి మనకు రక్షణ కల్పించే అమ్మ మహిషాసుర మర్ధిని. మహిషుడు అనే రాక్షసుడిని సంహరించి అతనినుంచి ప్రజల కష్టాలను దూరం చేసినట్లే, మనం పుట్టిన నాటినుంచి జీవితంలో ఉన్నతస్థితికి ఎదిగే వరకు ఎదురయ్యే కష్టనష్టాలలో మనకు దన్నుగా నిలిచి మనల్ని ఉన్నతస్థానంలో కూర్చోబెట్టేవరకు విశ్రమించదు అమ్మ.
స్ఫూర్తినిచ్చే రాజరాజేశ్వరి
అన్ని రకాల దుష్టశక్తులపై పోరాడి విజయతీరాన్ని చేరుస్తుంది రాజరాజేశ్వరి అమ్మ. అందుకు అవసరమైన ధైర్యాన్నిస్తుంది. పరిపాలకులకు దుష్టశిక్షణ, శిష్టరక్షణ చేసే సామర్థ్యాన్ని కలిగిస్తుంది. విద్యార్థులు విద్యాభ్యాసంలో విజయకేతనం ఎగురవేసేందుకు అవసరమైన స్ఫూర్తిని అమ్మ కలిగిస్తుంది. ఆ మేరకు విజయాల చేకూరేలా మనలో ప్రేరణను నింపుతుంది.
ఆత్మవిశ్వాసాన్ని నింపే గాయత్రి
బ్రహ్మ సృష్టించిన వాక్కు(మంత్రం)నుంచి వచ్చిన రూపమే గాయత్రిదేవి. చెడుకు భయపడకుండా, అటువైపే వెళ్లకుండా మనలో ఆత్మ సంతృప్తిని, మంచి ఆలోచనను కలిగిస్తుంది. ఇంట్లో మనలో దాగి ఉన్న ప్రతిభను మొదటగా గుర్తించేది అమ్మమాత్రమే. మన శక్తి మనకు తెలియక ఏపని చేయాలన్నా వెనుకాముందు తచ్చాడుతుంటే, నీలో దాగిఉన్న శక్తిని నీకు తెలియపరిచే శుభసూచకమైన అమ్మ రూపమే గాయత్రి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నామినేషన్ దాఖలు చేసిన భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి
[ 24-04-2024]
భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. -
మాటలే తూటాలై..!
[ 24-04-2024]
‘నల్గొండ జిల్లా సాగునీటి రంగానికి కేసీఆర్ తీరని అన్యాయం చేశారు. బస్సు యాత్ర కాదు, మోకాళ్ల యాత్ర చేసినా భారాసకు ఎవరూ ఓటేయరు. -
వైభవంగా హనుమాన్ జయంతి
[ 24-04-2024]
హనుమాన్ జయంతి సందర్భంగా మంగళవారం ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపించారు. స్వామి వారికి సింధూరంతో అభిషేకం, తమల పాకులతో పూజలు నిర్వహించారు. -
పాఠాలకు బై.. ఆటలకు సై..!
[ 24-04-2024]
వేసవి సెలవులు వచ్చేశాయ్.. పది నెలల పాటు నిత్యం బడుల్లో పాఠాలు చదవడం, రాయడం తదితర పనుల్లో నిమగ్నమై ఉన్న చిన్నారులకు ఈ నెల 24 (బుధవారం) నుంచి మొదలయ్యే సెలవులతో ఉపశమనం లభించింది. -
అట్టహాసంగా కంచర్ల నామినేషన్
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతలకు తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. -
పార్టీ గుర్తుల చరిత్ర ఇదే
[ 24-04-2024]
రాజకీయ పార్టీలనగానే గుర్తొచ్చేది వాటి గుర్తులే. ప్రధానంగా ఎన్నికల సమయంలో పార్టీ అభ్యర్థుల కంటే గుర్తులకే ప్రాధాన్యం ఉంటుంది. -
వారు.. శాసనసభకు, లోక్సభకు ఎన్నికయ్యారు!
[ 24-04-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కొందరు నేతలు శాసనసభకు, లోక్సభకు ఎన్నికయ్యారు. దేశంలోనే అత్యధిక ఓట్లు సాధించి రికార్డు సృష్టించారు. -
ప్రలోభాల ఎర.. తప్పదు చెర!
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికలు మే 13న జరగనున్నాయి. ఇప్పటికే నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో ప్రచారం ఊపందుకుంటోంది. -
ఆహారం సేకరించి.. అభాగ్యుల ఆకలి తీర్చి..
[ 24-04-2024]
దేశంలో ఒక వైపు రెండు పూటలా తినడానికి తిండి లేక వేలాది మంది అవస్థలు పడుతున్నారు. మరో వైపు నిత్యం లక్షల టన్నుల ఆహార పదార్థాలు వ్యర్థాలుగా మారుతున్నాయి. -
లోక్సభలో గళం విప్పే అవకాశం ఇవ్వండి: జహంగీర్
[ 24-04-2024]
ప్రజాసమస్యల పరిష్కారానికి జనం వెన్నంటే ఉండి నిరంతరం పోరాటాలు చేస్తున్న తనకు మద్దతుగా నిలిచి గెలిపిస్తే పార్లమెంటులో ఈ ప్రాంత సమస్యలపై గళం విప్పుతానని భువనగిరి లోక్సభ సీపీఎం అభ్యర్థి ఎండీ.జహంగీర్ అన్నారు. -
గత పొరపాట్లు పునరావృతం కావొద్దు: కలెక్టర్
[ 24-04-2024]
త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో సెక్టార్, పోలీసు అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ వెంకటరావు అన్నారు. -
బడికి నిధులు
[ 24-04-2024]
యాదాద్రి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం రూ.25 కోట్లు మంజూరు చేసింది. ఈ పనులను అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా చేపట్టనున్నారు. -
అతిథులు తరలొచ్చె.. బూర పూరించె..!
[ 24-04-2024]
ఓట్ల కోసం అనాదిగా మత రాజకీయాలు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీయేనని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. -
వేస్తున్నారు నామినేషన్లు..!
[ 24-04-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కొనసాగుతోంది. -
అభ్యర్థులిద్దరూ ‘బీఎన్ రెడ్డి’లే..!
[ 24-04-2024]
మిర్యాలగూడ లోక్సభ నియోజకవర్గంలో 1989, 1991 ఎన్నికల్లో ప్రధాన అభ్యర్థులిద్దరూ బీఎన్రెడ్డిలే. ఒకరు వాస్తుశిల్పి బద్దం నర్సింహారెడ్డి. మరొకరు భీంరెడ్డి నర్సింహారెడ్డి. -
1,29,766 ఓట్లు కొల్లగొట్టిన స్వతంత్రులు
[ 24-04-2024]
ఫ్లోరైడ్కు వ్యతిరేకంగా జలసాధన సమితి ఆధ్వర్యంలో 1996 లోక్సభ ఎన్నికల్లో 476 మంది స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో వీరు 1,29,766 ఓట్లు సాధించారు.
తాజా వార్తలు (Latest News)
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
-
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
-
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
-
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్లో కొత్త ఫోన్లు
-
ఇప్పటికీ సరైన కూర్పు కోసం ప్రయత్నిస్తున్నాం: స్టీఫెన్ ఫ్లెమింగ్
-
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు