పంటలపై అధిక వర్ష ప్రభావం
అధిక వర్షం పంటలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నీట మునిగిన పంటలను చూసి రైతులు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. వరిపైరు ఎక్కువ సేపు నీటిలో మునిగినా పండ్లు, కూరగాయలు, మెట్ట పంటల్లో నీరు నిలిచినా చీడపీడలు ఆశించడంతో పాటు పోషకాలు కోల్పోయే ప్రమాదం
సస్యరక్షణ చర్యలతో మేలు
గరిడేపల్లి: పత్తిచేనులో కొమ్మల వరకు నిలిచిన నీరు
గరిడేపల్లి, న్యూస్టుడే: అధిక వర్షం పంటలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నీట మునిగిన పంటలను చూసి రైతులు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. వరిపైరు ఎక్కువ సేపు నీటిలో మునిగినా పండ్లు, కూరగాయలు, మెట్ట పంటల్లో నీరు నిలిచినా చీడపీడలు ఆశించడంతో పాటు పోషకాలు కోల్పోయే ప్రమాదం ఉందని గడ్డిపల్లి కేవీకే ఉద్యాన విభాగం శాస్త్రవేత్త సీహెచ్ నరేశ్, మృత్తికా విభాగం శాస్త్రవేత్త అరిగెల కిరణ్ చెబుతున్నారు. వివిధ పంటల సస్యరక్షణ చర్యలను ‘న్యూస్టుడే’కు వివరించారు. ఈ రెండు, మూడు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ అంచనాల మేరకు ప్రత్యేక కథనం.
మొక్కల పెరుగుదల తగ్గడం, పూతరాలడం, ఎండు తెగులు, బూజు తెగులు వంటివి ఆశిస్తాయి. దీనివల్ల పంట ఎదుగుదల ఆలస్యమవుతుంది. నాసిరకం మొక్కలతో దిగుబడి తగ్గుతుంది. దీని నివారణకు స్థూల పోషకాలు 19:19:19 లేదా 13:0:45తో పాటు సూక్ష్మపోషకాలు ఇనుము, మెగ్నీషియం, బోరాన్, పొటాషియం, జింకు పిచికారి చేయాలి. భూమిపై కాకుండా నేరుగా ఆకుల ద్వారా మొక్కకు బలం అందించాలి. నేల కొంత ఆరిన తర్వాత తగిన మోతాదులో రసాయన ఎరువులందించాలి. అప్పటికే తెగుళ్లు సోకితే నివారణ మందులు పిచికారి చేయాలి. లేత జామ తోటల్లో నీటిని తీసేసి గొర్రుతో దున్నాలి. తేలికగా చెట్టు చుట్టూ పాదులు తవ్వాలి. మొదళ్ల దగ్గర కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాముల మందును లీటరు నీటిలో కలిపి పాదులో పోయాలి. పొటాషియం నైట్రేట్ 10 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
* ప్రస్తుతం వరి పంట చిరుపొట్ట, పొట్ట దశలో ఉంది. వరిపైరు నీటిలో మునిగినపుడు బురద నీరు పొట్టలోకి వెళ్తుంది. కొంతమేర ఆకులపై ఉంటుంది. దానివల్ల పొట్టకుళ్లుడు, గింజపోసుకోకపోవడం, మెడవిరుపు తెగులు, గింజమచ్చ, పాముపొడ వంటివి ఆశిస్తాయి. కంకి గింజ పోసుకోక పొట్టలోనే కుళ్లిపోతుంది. అందుకే గట్లకు గండ్లు పెట్టి అవసరమైతే జాలు కాల్వలు తీసుకుని నీటిని బయటకు పంపించాలి. వర్షం తగ్గాక ఎకరాకు 25 కిలోల యూరియా, 15 కిలోల పొటాష్ ఎరువులు వేసుకోవాలి. పాలిఫీడ్ (19:19:19) లేదా మల్టీకే (13:0:45)తో పాటు యూరియా 20 గ్రాములు కలిపి వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయటం వల్ల వరి పైరు పెరుగుదలలో వేగం పుంజుకుంటుంది. కొద్దిగా నీరు వెళ్లినా మొగి కన్పించినంత మొక్క ఉంటే సూక్ష్మపోషకాలు పిచికారి చేయాలి. గింజ పోసుకుంటే తర్వాత మందులు వాడినా ప్రయోజనం ఉండదు. నేల ద్వారా ఆశించే తెగుళ్ల నివారణకు 3 గ్రాముల కాపర్ఆక్సిక్లోరైడ్ లేదా 2 గ్రాముల కార్బండిజమ్ మందును మ్యాంకోజెబ్ అనే శిలీంద్ర నాశినితో కలిపి నేల మొత్తం తడిచేలా పిచికారి చేయాలి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
* బొప్పాయి తోటల్లో పాదుల వద్ద నీరు తీసేసి మోటాలాక్సిల్ 3 గ్రాములను లీటరు నీటిలో కలిపి మొదళ్ల దగ్గర పోయాలి. 2 గ్రాముల సూక్ష్మపోషకాల మిశ్రమాన్ని లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
* మామిడి తోటల్లో లేత మొక్కలు ఒరిగినా, పడిపోయినా లేపి మట్టిని ఎగదోయాలి. గాలికి విరిగిన కొమ్మలను పైభాగాన కత్తిరించి బోర్డాక్స్ పేస్ట్ రాయాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దాహం కేకలు తీర్చేందుకు...తరలి వస్తున్న కృష్ణమ్మ
[ 19-04-2024]
నాగార్జునసాగర్ జలాశయం డెడ్స్టోరేజీ దిగువకు చేరినా వేసవిలో హైదరాబాద్ జంట నగరాలు, జిల్లా వాసుల దాహం కేకలు తీర్చేందుకు కృష్ణాజలాల సరఫరాకు హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ (జలమండలి) అధికారులు చేపడుతున్న చర్యలు సఫలీకృతమయ్యాయి -
సైబర్ బాధితులకు వారియర్స్ తోడు
[ 19-04-2024]
చరవాణుల ద్వారా డిజిటల్ లావాదేవీలు పెరగడంతో నిత్యం ఎక్కడో చోట అమాయకులు సైబర్ నేరగాళ్ల వలలో పడి ఆర్థికంగా నష్టపోతున్నారు. -
రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా: మంత్రి ఉత్తమ్
[ 19-04-2024]
కోదాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. -
గాడితప్పిన గస్తీ
[ 19-04-2024]
జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. వరుసగా గొలుసు చోరీలకు పాల్పడుతున్నారు. నిఘా పటిష్ఠం చేసి దొంగలను పట్టుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారు. -
ఆలయ భద్రతపై ఇంత నిర్లక్ష్యమా!
[ 19-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని నిత్యం వేల సంఖ్యలో భక్తులు సందర్శిస్తుంటారు. ఆలయంలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతే లోనికి అనుమతించేందుకు బ్యాగేజ్ స్కానింగ్, మెటల్ డిటెక్టర్, తదితర భద్రతా పరికరాలను వైటీడీఏ కొనుగోలు చేసింది. -
భక్తవత్సలుడికి సంప్రదాయ ఆరాధనలు
[ 19-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో గురువారం స్వయంభువులైన పంచనారసింహులను ఆరాధిస్తూ చేపట్టిన నిత్య పూజలు ఆలయ ఆచారంగా కొనసాగాయి -
కేసీఆర్కు సీఎం రేవంత్రెడ్డే సరైనోడు: రాజగోపాల్రెడ్డి
[ 19-04-2024]
తెలంగాణ ఇచ్చిన పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని.. ఆలస్యం అయినా ప్రవేశపెట్టిన పథకాలను నెరవేర్చి.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని భువనగిరి లోక్సభ ఇన్ఛార్జి, స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. -
నాయకులొస్తున్నారు..!
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్సభ స్థానాలైన నల్గొండ, భువనగిరిలో నామినేషన్ దాఖలు సందర్భంగా భారీ ఎత్తున ర్యాలీలు, సభలు నిర్వహించాలని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలు భారాస, భాజపాలు నిర్ణయించాయి -
67 ఏళ్లలో 69 శాతమే!
[ 19-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1952లో ఏర్పడగా.. 2019 వరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. 2019 నాటికి నియోజకవర్గానికి తొలి ఎన్నికలు జరిగి 67 ఏళ్లు గడిచాయి -
నల్గొండలో నలుగురు, భువనగిరిలో ముగ్గురు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం మొదలైంది. తొలి రోజు గురువారం నల్గొండ లోక్సభ స్థానానికి నలుగురు అభ్యర్థులు ఆరు సెట్లు నామినేషన్లను రిటర్నింగ్ అధికారి, నల్గొండ జిల్లా కలెక్టరు హరిచందనకు అందజేశారు. -
నల్గొండ.. నాయకులకు అండ!
[ 19-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గానికి 18వ సారి ఎన్నికలు జరుగనున్నాయి. ఉమ్మడి జిల్లాలో తొలిసారి ఏర్పడిన ఏకైక లోక్సభ నియోజకవర్గం నల్గొండ మాత్రమే. -
పార్లమెంటు.. ఎంపీ అంటే తెలుసా
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు తమదైన శైలిలో సమావేశాలు నిర్వహిస్తూ ఓటర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు -
వ్యాను ఢీకొని రైతు మృతి
[ 19-04-2024]
ద్విచక్రవాహనాన్ని వ్యాను ఢీకొనడంతో రైతు మృతి చెందిన ఘటన మఠంపల్లి మండలం రఘునాథపాలెం పరిధిలోని వెంకటాయపాలెంలో గురువారం జరిగింది. -
ఇంటి మీద.. అవార్డుల పంట
[ 19-04-2024]
మిద్దె తోటలు.. ఆరోగ్యానికి ఉపయోగపడే కూరగాయలతో పాటు పురస్కారాలనూ తీసుకొస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!