అడ్డదారులొద్దు.. శిశు దత్తత సులువే
పిల్లలు లేని దంపతులకు ప్రభుత్వ పరంగా చట్టబద్దమైన దత్తతకు మార్గం సులువు కానుంది.
ఆరు పత్రాలతోనే ఆన్లైన్లో దరఖాస్తు
జిల్లాలో 200పైగా పెండింగ్
దేవరకొండ, న్యూస్టుడే
దత్తతపై నియమ, నిబంధనలతో గోడపత్రిక
పిల్లలు లేని దంపతులకు ప్రభుత్వ పరంగా చట్టబద్దమైన దత్తతకు మార్గం సులువు కానుంది. అడ్డదారిలో దత్తతకు ప్రయత్నిస్తే న్యాయపరమైన చిక్కులు, పోలీస్ కేసులు, ఇతర సమస్యలు ఉత్పన్నమయ్యేవి. ఇక ఆ ఇబ్బంది లేకుండా కేవలం ఆరు పత్రాలతో దరఖాస్తు చేసుకుంటే చాలు దత్తత ప్రక్రియ పూర్తి చేసేలా స్త్రీ, శిశు సంక్షేమశాఖ తాజాగా వెసులుబాటు కల్పించింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆడశిశుల విక్రయాలు, హత్యలు అధికంగా జరుగుతుంటాయి. ప్రభుత్వ యంత్రాంగం పోషించలేని దంపతులకు అవగాహన కల్పించి, చిన్నారులను దత్తత ఇచ్చేలా ప్రోత్సహిస్తే రెండు విధాలా మేలు జరుగుతుంది. నల్గొండలో శిశు గృహను 2005లో ఏర్పాటు చేయగా.. ఇప్పటి వరకు 310 మంది శిశువులను దత్తత ఇచ్చారు.
సరిగ్గా వినియోగించుకుంటే మేలు
మారుమూల ప్రాంతాలైన దేవరకొండ, నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లో దత్తత పేరుతో శిశు విక్రయాలు నిత్యకృత్యం. ఆడపిల్లలపై వివక్షతో భ్రూణ హత్యలు, చెత్తకుప్పలో పడేసిన ఘటనలు అనేకం. దీన్ని నివారించేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టినా.. ఫలితం నామమాత్రమే. గతంలో ప్రభుత్వం నుంచి చిన్నారులను దత్తత తీసుకునే ప్రక్రియ చాలా సంక్లిష్టంగా ఉండేది. 16 పత్రాలు పొందుపర్చాల్సి ఉండేది. దీంతో చాలా మంది దంపతులు అడ్డదారుల్లో శిశువుల కొనుగోలుకు మొగ్గు చూపేవారు. అలా కొనుగోలు చేసిన వారిలో చాలా మంది న్యాయ సమస్యలు, కేసులు ఎదుర్కొన్నారు.
* తాజాగా ప్రభుత్వం దత్తత విధానాన్ని సరళీకరించింది. ఆన్లైన్లో వివరాలు నమోదు చేసుకుంటే శిశువును దత్తత తీసుకునే చట్టపరమైన అవకాశం లభిస్తుంది. దత్తత దంపతులు, శిశు వివరాలన్నీ గోప్యంగా ఉంటాయి. దంపతుల ఫొటో, పాన్ కార్డు, జనన ధ్రువ పత్రాలు, నివాస, ఆదాయ, దీర్ఘకాలిక, ప్రాణాంతక వ్యాధులు లేవంటూ వైద్యాధికారి జారీ చేసిన ధ్రువపత్రం, వివాహ రిజిస్ట్రేషన్ తదితర ఆరు డాక్యుమెంట్లతో దరఖాస్తు చేసుకుంటే చాలు. దంపతులకు లాగిన్ ఐడీ, పాస్వర్డ్ ఇస్తారు. వారి సీనియార్టీ ప్రకారం వారి దరఖాస్తులు ప్రస్తుత దశ తెలుసుకునే అవకాశం కల్పించారు. మొదట దరఖాస్తు చేసుకున్న వారికి మొదటే దత్తత ఇస్తారు. శిశువు, లింగం వివరాలు, వయస్సు వివరాలు, ఏ రాష్ట్రానికి చెందిన శిశువు అవసరం తదితర వివరాలు దరఖాస్తు నమోదు చేసుకోవచ్చు. గతంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కమిషనర్కు ఉన్న దత్తత ఇచ్చే అధికారాన్ని ఇటీవల కలెక్టర్కు దాఖలు పరిచారు. నూతన విధానం అమలు చేసిన తర్వాత శిశవుల దత్తత కోసం 200 పైగా దరఖాస్తులు వచ్చినట్లు ఆ శాఖ అధికారులు చెప్పారు.
గోడపత్రికలు ఆవిష్కరిస్తున్న కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, తదితరులు
పైరవీలకు తావులేదు
- గణేశ్, జిల్లా బాలల సంరక్షణ విభాగం అధికారి
దత్తత ప్రక్రియ పారదర్శకంగా ఉంటుంది. శిశువు కావాల్సిన వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని ఉంటే వారికి సీరియల్ ప్రకారం పక్షపాతం లేకుండా మొదట దరఖాస్తు చేసుకున్న వారికి మొదటే ప్రతిపాదికన ఇస్తాం. పైరవీలకు ఆస్కారం లేదు. త్వరలో దరఖాస్తుల పరిశీలన ప్రారంభించి అందుబాటులో ఉన్న చిన్నారులను దత్తత ఇస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నామినేషన్ దాఖలు చేసిన భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి
[ 24-04-2024]
భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. -
మాటలే తూటాలై..!
[ 24-04-2024]
‘నల్గొండ జిల్లా సాగునీటి రంగానికి కేసీఆర్ తీరని అన్యాయం చేశారు. బస్సు యాత్ర కాదు, మోకాళ్ల యాత్ర చేసినా భారాసకు ఎవరూ ఓటేయరు. -
వైభవంగా హనుమాన్ జయంతి
[ 24-04-2024]
హనుమాన్ జయంతి సందర్భంగా మంగళవారం ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపించారు. స్వామి వారికి సింధూరంతో అభిషేకం, తమల పాకులతో పూజలు నిర్వహించారు. -
పాఠాలకు బై.. ఆటలకు సై..!
[ 24-04-2024]
వేసవి సెలవులు వచ్చేశాయ్.. పది నెలల పాటు నిత్యం బడుల్లో పాఠాలు చదవడం, రాయడం తదితర పనుల్లో నిమగ్నమై ఉన్న చిన్నారులకు ఈ నెల 24 (బుధవారం) నుంచి మొదలయ్యే సెలవులతో ఉపశమనం లభించింది. -
అట్టహాసంగా కంచర్ల నామినేషన్
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతలకు తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. -
పార్టీ గుర్తుల చరిత్ర ఇదే
[ 24-04-2024]
రాజకీయ పార్టీలనగానే గుర్తొచ్చేది వాటి గుర్తులే. ప్రధానంగా ఎన్నికల సమయంలో పార్టీ అభ్యర్థుల కంటే గుర్తులకే ప్రాధాన్యం ఉంటుంది. -
వారు.. శాసనసభకు, లోక్సభకు ఎన్నికయ్యారు!
[ 24-04-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కొందరు నేతలు శాసనసభకు, లోక్సభకు ఎన్నికయ్యారు. దేశంలోనే అత్యధిక ఓట్లు సాధించి రికార్డు సృష్టించారు. -
ప్రలోభాల ఎర.. తప్పదు చెర!
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికలు మే 13న జరగనున్నాయి. ఇప్పటికే నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో ప్రచారం ఊపందుకుంటోంది. -
ఆహారం సేకరించి.. అభాగ్యుల ఆకలి తీర్చి..
[ 24-04-2024]
దేశంలో ఒక వైపు రెండు పూటలా తినడానికి తిండి లేక వేలాది మంది అవస్థలు పడుతున్నారు. మరో వైపు నిత్యం లక్షల టన్నుల ఆహార పదార్థాలు వ్యర్థాలుగా మారుతున్నాయి. -
లోక్సభలో గళం విప్పే అవకాశం ఇవ్వండి: జహంగీర్
[ 24-04-2024]
ప్రజాసమస్యల పరిష్కారానికి జనం వెన్నంటే ఉండి నిరంతరం పోరాటాలు చేస్తున్న తనకు మద్దతుగా నిలిచి గెలిపిస్తే పార్లమెంటులో ఈ ప్రాంత సమస్యలపై గళం విప్పుతానని భువనగిరి లోక్సభ సీపీఎం అభ్యర్థి ఎండీ.జహంగీర్ అన్నారు. -
గత పొరపాట్లు పునరావృతం కావొద్దు: కలెక్టర్
[ 24-04-2024]
త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో సెక్టార్, పోలీసు అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ వెంకటరావు అన్నారు. -
బడికి నిధులు
[ 24-04-2024]
యాదాద్రి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం రూ.25 కోట్లు మంజూరు చేసింది. ఈ పనులను అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా చేపట్టనున్నారు. -
అతిథులు తరలొచ్చె.. బూర పూరించె..!
[ 24-04-2024]
ఓట్ల కోసం అనాదిగా మత రాజకీయాలు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీయేనని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. -
వేస్తున్నారు నామినేషన్లు..!
[ 24-04-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కొనసాగుతోంది. -
అభ్యర్థులిద్దరూ ‘బీఎన్ రెడ్డి’లే..!
[ 24-04-2024]
మిర్యాలగూడ లోక్సభ నియోజకవర్గంలో 1989, 1991 ఎన్నికల్లో ప్రధాన అభ్యర్థులిద్దరూ బీఎన్రెడ్డిలే. ఒకరు వాస్తుశిల్పి బద్దం నర్సింహారెడ్డి. మరొకరు భీంరెడ్డి నర్సింహారెడ్డి. -
1,29,766 ఓట్లు కొల్లగొట్టిన స్వతంత్రులు
[ 24-04-2024]
ఫ్లోరైడ్కు వ్యతిరేకంగా జలసాధన సమితి ఆధ్వర్యంలో 1996 లోక్సభ ఎన్నికల్లో 476 మంది స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో వీరు 1,29,766 ఓట్లు సాధించారు.
తాజా వార్తలు (Latest News)
-
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
-
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
-
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
-
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
-
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్లో కొత్త ఫోన్లు