పురం సిగలో..హరితహారం
నల్గొండ పట్టణం రాక్హిల్కాలనీ నుంచి మునుగోడు బైపాస్ వెళ్లే మార్గం ఇది. ఈ రోడ్డుకు ఇరువైపులా సుమారు రెండు వేలకుపైగా ఏపుగా పెరిగిన మొక్కలు నాటడంతో హరితశోభను సంతరించుకుంది.
నందన వనాలుగా మారుతున్న ఉమ్మడి జిల్లా పట్టణాలు
నల్గొండ పురపాలిక, సూర్యాపేట పురపాలిక, న్యూస్టుడే
నల్గొండ పట్టణం రాక్హిల్కాలనీ నుంచి మునుగోడు బైపాస్ వెళ్లే మార్గం ఇది. ఈ రోడ్డుకు ఇరువైపులా సుమారు రెండు వేలకుపైగా ఏపుగా పెరిగిన మొక్కలు నాటడంతో హరితశోభను సంతరించుకుంది. ఈ మార్గం మీదుగా నిత్యం వేలాది మంది వాకింగ్ చేస్త్తూ మంచి స్వచ్ఛమైన గాలిని, వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు. అదే మాదిరిగా పట్టణంలో 14 కి.మీ మేర రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటడంతో పాటు ఇటీవల విస్తరించిన రోడ్ల డివైడర్ల మధ్యన పచ్చని ఆహ్లాదకరమైన పూల మొక్కలు నాటించారు.
తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమం ద్వారా ఏటా పట్టణాల్లో మొక్కలు నాటించి పచ్చదనం పెంపునకు కృషి చేస్తోంది. రోడ్లకు ఇరువైపులా, ప్రభుత్వ స్థలాల్లో మొక్కలు నాటిస్తూ ఇళ్లల్లో పూలు, పండ్లు మొక్కలు పెంచేలా చర్యలు చేపడుతున్నారు. రెండేళ్లుగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 19 పురపాలికల్లో చేపట్టిన పట్టణ ప్రకృతి వనాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. ప్రభుత్వ స్థలాలు, రహదారి డివైడర్ల మధ్య, ఇరువైపులా ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటించారు. పట్టణాల్లో పలు ప్రాంతాల్లో స్థలాలను గుర్తించి కంచెలను ఏర్పాటు చేశారు. జామ, దానిమ్మ, వేప, స్పాతోడియా, గుల్మోహర్, అల్లనేరేడు, ఉసిరి, పనస, బొగన్విల్లా, టేరోమా, హతోడియా, కొబ్బరి, వంటి మొక్కలు నాటించారు. వాటికి క్రమం తప్పకుండా నీళ్లు అందించేందుకు ప్రత్యేకంగా నీటి సౌకర్యం కల్పించారు. ఏపుగా పెరిగేందుకు అవసరమైన ఎరువులను వినియోగిస్తున్నారు. వీటి నిర్వహణ నిమిత్తం ఏటా ఆయా మున్సిపాలిటీలు 30 శాతం వరకు గ్రీన్ బడ్జెట్ రూపంలో నిధులు కేటాయిస్తున్నాయి.
* పట్టణాల్లో 35 శాతం పచ్చదనం విస్తరిస్తే మెరుగైన వాతావరణంలో జీవిస్తున్నట్లు లెక్కా. పెరుగుతున్న పట్టణ జనాభాకు తగ్గట్టు వారి జీవన ప్రమాణాలు మెరుగవడానికి పార్కులు, పట్టణ ప్రకృతి వనాలు వంటివి దోహదపడుతున్నాయి. వాయు కాలుష్యం నుంచి ఉపశమనం కల్పించేందుకు పట్టణాల్లో బృహత్ వనాలు, పట్టణ ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. ఆరోగ్యకర పోటీకి రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి గ్రీన్ స్పేస్ ఇండెక్స్ పోటీకి పిలుపునివ్వడంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 19 పురపాలికలు అందుబాటులో ఉన్న ఖాళీ స్థలాలన్నింటిలో ప్రకృతి వనాలు పెంచేందుకు శ్రీకారం చుట్టాయి.
* నల్గొండ పట్టణంలోని హౌసింగ్ బోర్డుకాలనీ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో మూడేళ్ల కింద నాటిన మొక్కలు ప్రస్తుతం ఏపుగా ఎదిగి.. ఫలాలు ఇస్తున్నాయి. సుమారు ఎకరం విస్తీర్ణంలో వందల సంఖ్యలో మామిడి, పనస, జామ, అల్లనేరేడు మొక్కలతోపాటు వేప, నిమ్మ వంటి చెట్లను పెంచడంతో అ ప్రాంతం అంత పచ్చదనం సంతరించుకుంది. సూర్యాపేట పట్టణంలోని మామిళ్లగడ్డ కాలనీ, మిర్యాలగూడ, భువనగిరి, చండూరు, చిట్యాల, దేవరకొండ పట్టణాల్లో ప్రధాన రహదారులు, ఖాళీ ప్రదేశాలు హరిత వనాలుగా మారిపోయాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రభుత్వంపై విమర్శ.. రైతులకు భరోసా
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సుయాత్ర చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దానిని ఉమ్మడి జిల్లా నుంచే ప్రారంభించడంతో.. భారాస నేతలు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. -
బాలికలు.. భళా
[ 25-04-2024]
విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. -
మోదీతో తెలంగాణకు తీరని అన్యాయం
[ 25-04-2024]
కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ తెలంగాణకు తీరని అన్యాయం చేశారని నల్గొండ లోక్సభ ఇన్ఛార్జి, మంత్రి నల్లమాద ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. -
బాలికలదే హవా
[ 25-04-2024]
రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. -
ఉపాధి కూలీల సౌకర్యాలపై సమీక్ష
[ 25-04-2024]
పని ప్రదేశాలలో ఉపాధి కూలీలకు మౌలిక సౌకర్యాలు సమకూర్చాలని జిల్లా పరిషతు ముఖ్య కార్యనిర్వహణాధికారి శోభారాణి, ఆదనపు డీఆర్డీవో జి.సురేష్, సూచించారు. -
ప్రథమంలో 26.. ద్వితీయంలో 25
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. 2022-23లో జిల్లా ఉత్తీర్ణత శాతం 57 ఉండగా, ప్రస్తుతం 54.50 శాతానికి పడిపోయింది. -
ఊపందుకున్న నామినేషన్ల పర్వం
[ 25-04-2024]
నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాలకు బుధవారం వరకు 45 మంది చొప్పున నామినేషన్లు వేశారు. -
గిరిజన గురుకులాల్లో 88.60శాతం ఉత్తీర్ణత
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో కలిపి ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 88.60శాతం ఫలితాలు -
మతోన్మాద భాజపాను ఓడించండి: సీపీఐ
[ 25-04-2024]
దేశంలో మతోన్మాదం పేరుతో రాజకీయాలు చేస్తున్న భాజపాను ఓడించి కాంగ్రెస్ అభ్యర్ధులను భారీ మెజార్టీతో గెలిపించాలని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. -
విభజన హామీల అమలుకు కృషి
[ 25-04-2024]
భువనగిరి లోక్సభ ఎంపీగా తనను గెలిపిస్తే విభజన హామీలను అమలు చేసేందుకు, నిధులు రాబట్టేందుకు కృషి చేస్తానని భువనగిరి లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. -
తొలి ఎన్నికలోనే అత్యధిక మెజారిటీ
[ 25-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1951లో ఏర్పడగా.. తొలి ఎన్నికలు 1952లో జరిగాయి. -
రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం, వ్యక్తి అరెస్ట్
[ 25-04-2024]
రైల్వేశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని 17 మంది బాధితుల నుంచి నగదు వసూలు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు పోలీస్ ఇన్స్పెక్టర్ అశోక్రెడ్డి తెలిపారు.