logo

నిధుల మంజూరుకు మంత్రికి వినతి

కోదాడ కోర్టుకు నిధులు మంజూరు చేయాలని బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు దేవబత్తిని నాగార్జున అన్నారు. సోమవారం సూర్యాపేటలో స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌తో కలిసి పలు సమస్యలపై మంత్రి జగదీశ్‌రెడ్డికి వినతి పత్రం అందజేసి మాట్లాడారు.

Published : 29 Nov 2022 06:18 IST

కోదాడలో నూతన భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని మంత్రి జగదీశ్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తున్న న్యాయవాదులు, చిత్రంలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌

కోదాడ, న్యూస్‌టుడే: కోదాడ కోర్టుకు నిధులు మంజూరు చేయాలని బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు దేవబత్తిని నాగార్జున అన్నారు. సోమవారం సూర్యాపేటలో స్థానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌తో కలిసి పలు సమస్యలపై మంత్రి జగదీశ్‌రెడ్డికి వినతి పత్రం అందజేసి మాట్లాడారు. నిత్యం కోర్టు పనుల నిమిత్తం వచ్చే ప్రజలకు సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. మంత్రి మాట్లాడుతూ నూతన భవన నిర్మాణానికి నిధుల మంజూరుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు అబ్దుల్‌ రహీం, ప్రధాన కార్యదర్శి సిలివేరు వెంకటేశ్వర్లు, న్యాయవాదులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని