ఆ చూపు.. హృదయం వైపు
కూలీకి వెళితేనే పూట గడిచే కుటుంబం వీరిది.. ఉన్న ఊరిలో పనిలేక పొట్ట చేత పట్టుకుని పట్నం బాట పట్టారు. చేతికందిన 20ఏళ్ల కొడుకు కుటుంబాన్ని ఆదుకుంటాడనుకుని ఆశలు పెంచుకున్నారు.
ఆసుపత్రిలో డయాలసిస్ చేయించుకుంటున్న మనోహర్
రాజపేట, న్యూస్టుడే : కూలీకి వెళితేనే పూట గడిచే కుటుంబం వీరిది.. ఉన్న ఊరిలో పనిలేక పొట్ట చేత పట్టుకుని పట్నం బాట పట్టారు. చేతికందిన 20ఏళ్ల కొడుకు కుటుంబాన్ని ఆదుకుంటాడనుకుని ఆశలు పెంచుకున్నారు. అంతలోనే కుమారుడి రెండు కిడ్నీలు చెడిపోయి మంచాన పడ్డారు. తన కిడ్నీ ఇచ్చి కుమారుడిని దక్కించుకుందామనుకున్న ఆ తండ్రికి ఆర్థిక సమస్య ఇబ్బందికరంగా మారింది. శస్త్ర చికిత్సకు అవసరమయ్యే ఖర్చులకు దాతల నుంచి సహకారం అర్థిస్తున్నారు. యాదాద్రి జిల్లా రాజపేట మండల నెమిల గ్రామానికి చెందిన కుంచం వెంకటయ్య, ఎల్లమ్మలకు ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. కుమార్తెలకు వివాహం జరిపించారు. ఖర్చులు పెరిగిపోవడం, ఆర్థిక ఇబ్బందులకు తోడు ఉన్న ఊరిలో పని లభించకపోవడంతో కుమారుడు మనోహర్ను తీసుకుని ఆరేళ్ల క్రితం హైదరాబాద్కు వలస వెళ్లారు. అక్కడే డిగ్రీ చదువుతున్న కుమారుడు ఆకస్మాత్తుగా అస్వస్థతకు గురయ్యాడు. వైద్య పరీక్షల అనంతరం మనోహర్కు రెండు కిడ్నీలు పూర్తిగా చెడిపోయాయని వైద్యులు నిర్ధారించారు. వైద్యుల సూచనల మేరకు ప్రస్తుతం వారంలో రెండు పర్యాయాలు డయాలసిస్ చేయిస్తున్నారు.
ఎలాగైనా కుమారుడిని దక్కించుకోవాలనే తపనతో తన కిడ్నీని ఇవ్వడానికి ముందుకు వచ్చారు వెంకటయ్య. ఇందుకు వైద్యులు కూడా పలు పరీక్షలు నిర్వహించి అంగీకరించినట్లు వెంకటయ్య వివరించారు. ప్రైవేటు అసుపత్రిలో మనోహర్కు జరిపే శస్త్ర చికిత్సకు సుమారు రూ.8 లక్షల నుంచి రూ. 10 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపినట్లు పేర్కొన్నారు. రోజు కూలీగా బతికే తమకు నిలువ నీడ కూడా లేదని, అంత ఖర్చు భరించలేమని ఆవేదన చెందుతున్నారు. తన కుమారుడి శస్త్ర చికిత్సకు, మెరుగైన వైద్యానికి దాతలు, స్వచ్ఛంద సంస్థలు ఆర్థిక సహకారం అందించి ఆదుకోవాలని మనోహర్ తల్లిదండ్రులు వెంకటయ్య, ఎల్లమ్మలు కోరుతున్నారు.
మనోహర్కు అన్నం తినిపిస్తున్న తల్లిదండ్రులు ఎల్లమ్మ వెంకటయ్య
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యథేచ్ఛగా మట్టి దందా
[ 20-04-2024]
నార్కట్పల్లి మండలంలో మట్టి దందా యథేచ్ఛగా సాగుతోంది. గోపలాయపల్లి, యల్లారెడ్డిగూడెంలోని చెరువులు, బ్రాహ్మణవెల్లంల ప్రాజెక్ట్ కాల్వల మట్టిని అక్రమంగా ఇటుక బట్టీలకు, వెంచర్లకు తరలిస్తున్నారు. -
ఇక కఠిన చర్యలు
[ 20-04-2024]
సీఎంఆర్ బియ్యం బకాయిదారులపై కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర అత్యున్నత స్థాయిలో శుక్రవారం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. -
పదమూడేళ్లుగా.. అభ్యున్నతే లక్ష్యంగా..!
[ 20-04-2024]
ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా పదమూడేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థుల అభ్యున్నతికి, చదువుల్లో ఉన్నత స్థాయికి ఎదిగేందుకు పాలిటెక్నిక్లో ప్రవేశానికి నిర్వహించే పాలిసెట్లో ఉచిత శిక్షణ అందిస్తుంది ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణ సమితి. -
పార్టీ గుర్తు కావాలంటే బీ ఫారం ఉండాల్సిందే..
[ 20-04-2024]
లోక్సభ, శాసనసభ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నిక ఏదైనా సరే...రాజకీయ పార్టీ అభ్యర్థిగా గుర్తించి అతనికి ఆయా పార్టీలకు ఎన్నికల సంఘం నిర్ణయించిన గుర్తులను ఎన్నికల అధికారి కేటాయించాలంటే ‘బీ’ ఫారం ఉండాల్సిందే. -
ఎంపీలుగా ఎవరెవరంటే..
[ 20-04-2024]
లోక్సభకు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి మహామహులు ప్రాతినిథ్యం వహించారు. వారు ప్రాతినిథ్యం వహించిన పార్టీతో పాటు వారు నిర్వహించిన ప్రజా ఉద్యమాలు, సచ్ఛీలత, వ్యక్తిగత పలుకుబడి తోడు కావడంతో ఎన్నికల బరిలో విజయబావుటా ఎగురవేశారు. -
ఏదీ నిఘా..!
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికలు.. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఉభయ తెలుగు రాష్ట్రాల సరిహద్దుగా ఉన్న కృష్ణానది తీరంలో మరింత నిఘా పెడితేనే అక్రమాలకు అడ్డుకట్ట పడనుంది. -
ఈవీఎం, వీవీప్యాట్లకు తేడా ఇదే!
[ 20-04-2024]
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ (ఈవీఎం)లోని ఒక భాగమే ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీప్యాట్). అభ్యర్థి పేరు, గుర్తు, సీరియల్ నంబర్ దీనిపై కనిపిస్తాయి. -
వరుస దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్ట్
[ 20-04-2024]
జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల్లో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను అదుపులోకి తీసుకున్నట్లు నల్గొండ జిల్లా మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు తెలిపారు. -
చిన్నప్పుడు కథలు చెబితేనే నిద్రవచ్చేది
[ 20-04-2024]
మా ఊరు మోత్కూరు మండలం పాలడుగు గ్రామం. ప్రాథమిక విద్య ఇక్కడే చదువుకున్నాను. -
లోక్సభ ఎన్నికల తర్వాత భారాస అడ్రస్ గల్లంతు: ఉత్తమ్
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా భారాస ఒక్క స్థానంలోనూ విజయం సాధించలేదని, డిపాజిట్లు కూడా దక్కవని రాష్ట్ర పౌర సరఫరా, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. -
పల్లె చెరువుల్లో మట్టి లూటీ..!
[ 20-04-2024]
పంట పొలాలకు సాగునీరందించే చెరువుల మట్టి వ్యాపారుల జేబులు నింపుతోంది. ముఖ్యంగా ఇటుక బట్టీల నిర్వాహకులు వివిధ గ్రామాల్లో కొన్నేళ్లుగా ఓ విధానమంటూ లేకుండా చెరువు మట్టిని పొక్లెయిన్లతో తవ్వి ట్రాక్టర్లలో తరలించి ఇటుకల తయారీకి వాడుతున్నారు. -
భాజపాను ఓడించేందుకు ఏకం కావాలి
[ 20-04-2024]
తెలంగాణలోని 17 లోక్సభ స్థానాల్లో అత్యధికంగా గెలవాలని ఉవ్విళ్లూరుతున్న భాజపా ఆశలను వమ్ము చేయడమే తమ ముందున్న లక్ష్యమని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఉండి’ అభ్యర్థిగా 22న నామినేషన్: రఘురామ
-
జగన్ ఎదుటే జనసేనానికి జేజేలు.. విద్యార్థుల నినాదాలతో అవాక్కయిన సీఎం
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!