తండ్రిని హతమార్చిన తనయుడు
మద్యానికి బానిసై రోజూ తల్లిని వేధిస్తున్నాడని ఆగ్రహానికి గురైన కుమారుడు తండ్రిని రోకలిబండతో కొట్టి హతమార్చిన ఘటన నల్గొండ జిల్లా పీఏపల్లి మండలంలో శుక్రవారం రాత్రి జరిగింది.
కోమండ్ల బ్రహ్మం
పెద్దఅడిశర్లపల్లి, న్యూస్టుడే: మద్యానికి బానిసై రోజూ తల్లిని వేధిస్తున్నాడని ఆగ్రహానికి గురైన కుమారుడు తండ్రిని రోకలిబండతో కొట్టి హతమార్చిన ఘటన నల్గొండ జిల్లా పీఏపల్లి మండలంలో శుక్రవారం రాత్రి జరిగింది. ఎస్సై పి.వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం.. కోమండ్ల బ్రహ్మం(45) వ్యవసాయంతో పాటు కూలీ పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు భార్య అలివేలు, కుమారుడు , కుమార్తె ఉన్నారు. కుమారుడు ఒకేషనల్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. బ్రహ్మం శుక్రవారం మద్యం తాగి పొలం నుంచి వచ్చి భార్యతో గొడవ పడ్డాడు. తల్లిని రోజు అన్నం తినకుండా గొడవపడుతున్నాడని ఆగ్రహించిన కుమారుడు తండ్రిని రోకలిబండతో తలపై బలంగా కొట్టాడు. తీవ్రగాయాలైన ఆయనను ఇరుగుపొరుగువారి సాయంతో కుటుంబసభ్యులు దేవరకొండ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో తెల్లవారుజామున మృతిచెందాడు. కొండమల్లేపల్లి ఇన్ఛార్జ్ సీఐ విఠల్రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
KK pathak: నోరు పారేసుకున్న సీనియర్ ఐఏఎస్.. సర్వీసు నుంచి తొలగించాలని డిమాండ్
-
Movies News
Kasinathuni Viswanath: కళాతపస్వి కె.విశ్వనాథ్ కన్నుమూత
-
India News
Child Marriages: అరెస్టులకు సిద్ధం.. 4000 మందిపై కొనసాగుతున్న విచారణ
-
Sports News
IND vs PAK: పాక్ ఆటగాళ్లను భారత అభిమానులు ఎంతో గౌరవిస్తారు: ఉమర్ అక్మల్
-
India News
PM-KUSUM: ‘పీఎం కుసుమ్’ పథకం 2026 వరకు పొడిగింపు
-
Politics News
Arvind Kejriwal: రాజకీయాల్లో ‘ఆమ్ఆద్మీ’ సక్సెస్.. ఎందుకంటే..!