వణుకుతున్న అనాథలు
ఉమ్మడి నల్గొండ జిల్లాలో అనాథలకు రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, పార్కులు, పుట్పాత్లే దిక్కవుతున్నాయి. జిల్లాల్లో రోజుకూ సగటున 20 డిగ్రీల సెల్సియస్ ఉష్టోగ్రత నమోదవుతోంది.
ఉమ్మడి జిల్లాలోని పురపాలికల్లో రోడ్ల పక్కనే తలదాచుకుంటున్న నిరాశ్రయులు
నల్గొండ, పురపాలిక, న్యూస్టుడే
సూర్యాపేటలోని గణేశ్నగర్లో ఏర్పాటు చేసిన నిరాశ్రయుల కేంద్రం
ఉమ్మడి నల్గొండ జిల్లాలో అనాథలకు రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, పార్కులు, పుట్పాత్లే దిక్కవుతున్నాయి. జిల్లాల్లో రోజుకూ సగటున 20 డిగ్రీల సెల్సియస్ ఉష్టోగ్రత నమోదవుతోంది. రానున్న రోజుల్లో మరింత తగ్గనుంది. దీంతో చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. రాష్ట్రంలోని ప్రతి పురపాలికలో అనాథలకు రక్షణ కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. పురపాలికల్లో అనాథలను గుర్తించాలని ఆదేశాలు కూడా జారీ చేసింది. దీంతో ఉమ్మడి జిల్లాలోని 19 పురపాలికల్లో గతేడాది మెప్మా అధికారులు సర్వే చేపట్టి అనాథలను గుర్తించారు. కానీ ఇప్పటికీ నిరాశ్రయుల కేంద్రాలు ఏర్పాటుకు నోచుకోలేదు.
ఉమ్మడి జిల్లాలోని పురపాలికల్లో గతేడాది మెప్మా ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారు. భువనగిరిలో 41, మిర్యాలగూడ 37, సూర్యాపేట 13 , దేవరకొండలో 15 మంది అనాథలు ఉన్నట్లు గుర్తించారు. భువనగిరిలో అధికంగా 41 మందిని గుర్తించారు. నల్గొండ కలెక్టరేట్ సమీపంలో పెద్దబండలో నిరాశ్రయ కేంద్రం ఏర్పాటు చేసినప్పటికీ అది దూరంగా ఉండటంతో అక్కడికి రావడానికి ఆసక్తి చూపట్లేదు. దీంతో వారి కోసం ప్రభుత్వ కేంద్రాసుపత్రి ఆవరణలో కొత్త భవనం నిర్మించినా.. దానిని ప్రారంభించడంలో జాప్యం జరుగుతోంది. అదే విధంగా మిర్యాలగూడలో రైల్వే స్టేషన్ సమీపంలో నిరాశ్రయ కేంద్రం ఏర్పాటు చేసినా.. ప్రయోజనం లేకుండా పోయింది.
భువనగిరిలో నిరాశ్రయుల కేంద్రం నిర్మించినా మున్సిపల్ అధికారులకు అప్పగించలేదు. దీంతో పట్టణంలో రైల్వేస్టేషన్, బస్టాండ్, మసీదు ప్రాంతాల్లో రోడ్లపైనే ఉంటున్నారు. మిర్యాలగూడలోని ప్రకాశ్నగర్లో వసతి ఏర్పాటు చేశారు. నాలుగేళ్ల నుంచి నిధులు రావడం లేదు. సూర్యాపేటలో నిరాశ్రయుల కేంద్రంలో రోజుకు 15 మందికి పైగా ఆశ్రయం పొందుతున్నారు. మిగతా పురపాలికల్లో నిర్వహణకు ఎలాంటి ప్రతిపాదనలు పంపలేదు.
నీలగిరిలో చలిలో రోడ్డు పక్కన కాలం వెళ్ల తీస్తున్న నిరాశ్రయుడు
పని చేయని కమిటీలు
మెప్మా ఆధ్వర్యంలో పురపాలికల్లో ఏర్పాటు చేసిన నిరాశ్రయ కేంద్రాలకు రెండు కమిటీలు ఉంటాయి. షెల్టర్ మేనేజ్మెంటు, కార్యనిర్వాహక కమిటీలు ఈ కేంద్రాలను పర్యవేక్షించాలి. కార్యనిర్వాహక కమిటీలో పుర కమిషనర్, పోలీసు, మెప్మా, ట్రాఫిక్ అధికారులు సభ్యులుగా ఉంటారు. వీరు మూడునెలలకోసారి సమావేశమై చర్చించాలి. షెల్టర్ మేనేజ్మెంటు కమిటీలో స్థానిక కౌన్సిలర్, షెల్టర్ మేనేజర్, నిరాశ్రయుల నుంచి ముగ్గురు ఉండాలి. వారికి కావాల్సిన వసతులు, ఇబ్బందులపై చర్చించాలి. ప్రతి నిరాశ్రయుల కేంద్రంలో భోజన వసతితోపాటు మంచినీళ్లు, మరుగుదొడ్లు, పంకాలు, టీవీలు ఏర్పాటు చేయాలి. కానీ కమిటీలు ఉన్నప్పటికీ నామమాత్రంగానే మారాయి.
నల్గొండ ఆర్టీసీ బస్స్టాండ్లో ఓ వృద్ధుడు
వివరాలు ఇలా...
నల్గొండ:51
మిర్యాలగూడ:37
దేవరకొండ15
హాలియా:5
చండూరు:3 చిట్యాల: 4
నందికొండ: 5
నిరాశ్రయుల కేంద్రం ఏర్పాటు: -శ్రీపాద రామేశ్వర్, పీడీ మెప్మా, నల్గొండ
ప్రస్తుతం నల్గొండ, మిర్యాలగూడ కేంద్రాల్లో మౌలిక సౌకర్యాలు అందులోబాటులో ఉన్నాయి. జిల్లా కేంద్రాసుపత్రి ఆవరణలో కొత్త భవనం అందుబాటులోకి రానుంది. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. మిగతా మున్సిపాలిటీల్లో కనీసం 20 మంది నిరాశ్రయులు ఉంటే కేంద్రం ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపిస్తాం. నల్గొండ, మిర్యాలగూడ మినహా మిగతా పురపాలికలో ఆ స్థాయిలో లేరు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడే విడుదల రంగం
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల క్రతువునకు రంగం సిద్ధమైంది. అధికారులు నేడు నోటిఫికేషన్ జారీ చేసిన వెంటనే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి -
బంతికో వంద జోరుగా దందా
[ 18-04-2024]
జిల్లాలో ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) బెట్టింగ్ దందా జోరుగా సాగుతోంది. బంతి బంతికి ఓ రేటు.. బౌండరీ దాటితే ఓ రేటు, వికెట్ పడితే మరో రేటు.. -
అవకాశవాదులకు గుణపాఠం చెప్పాలి: జూలకంటి
[ 18-04-2024]
భువనగిరి లోక్సభ స్థానంలో పార్టీలు ఫిరాయించే అవకాశవాదులు, ధన బలంతో గెలవాలనుకునే వారికి ప్రజలు ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని మాజీ ఎమ్మెల్యే, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి కోరారు. -
గురుకులాల్లో గందరగోళం!
[ 18-04-2024]
-
కాంగ్రెస్ పార్టీనే ప్రజలకు శ్రీరామరక్ష
[ 18-04-2024]
తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీనే శ్రీరామరక్ష అని ఎమ్మెల్యే, పార్టీ భువనగిరి లోక్సభ నియోజకవర్గ ఎన్నికల ఇన్ఛార్జి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. -
కన్నీటి సహవాసం.. మరుగుదొడ్డిలో నివాసం
[ 18-04-2024]
వృద్ధాప్యంలో తోడుగా ఉండటానికి కుమారులు లేరు.. జీవిత భాగస్వామి 13 ఏళ్ల కాలం క్రితమే మృతి చెందాడు. ఇన్నాళ్లూ నీడనిచ్చిన పూరిగుడిసె నేలమట్టమైంది. -
పశుగ్రాసం కరవు.. పశు పోషణ బరువు
[ 18-04-2024]
ఈ ఏడాది వరిసాగు విస్తీర్ణం తగ్గడంతో పశుగ్రాసం కష్టాలు మొదలయ్యాయి. ఆధునిక వ్యవసాయం పేరిట కోత యంత్రాలతో వరి పంట కోయడం, -
బరిలో.. తొలిసారి
[ 18-04-2024]
త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్సభ నియోజకవర్గాలైన నల్గొండ, భువనగిరిలో బరిలో ఇప్పటికే మూడు ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించగా.. -
భారీగా పెరిగారు..!
[ 18-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1951లో ఏర్పడగా.. 1952లో తొలిసారిగా ఎన్నికలు జరిగాయి. నాటి నల్గొండ ద్విసభ్య నియోజకవర్గంగా ఉండి.. -
360 డిగ్రీల్లో.. నిఘా
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికల్లో ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసింది. -
లోక్సభ బరిలో ధర్మ సమాజ్ పార్టీ
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికలతోపాటు సికింద్రాబాద్లోని కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలోనూ పోటీ చేస్తున్నట్లు ధర్మ సమాజ్ పార్టీ(డీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ తెలిపారు. -
ఇంతి పాత్ర అంతంతే..!
[ 18-04-2024]
ఓటర్లలో సగభాగమైన మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కరవవుతోంది. చైతన్యమంతమైన నల్గొండ జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉంది. నల్గొండ, మిర్యాలగూడ, భువనగిరి నియోజకవర్గాల నుంచి ఇప్పటి వరకు ఒక్క పర్యాయమైనా మహిళను గెలిపించి లోక్సభకు పంపలేదు. -
పట్టుపట్టి.. ర్యాంకు కొట్టి..!
[ 18-04-2024]
అనుకున్నది సాధించటానికి ఎన్ని కష్టాలైనా పడాల్సిందే.. అదే లక్ష్యం అత్యున్నతమైతే దానికి ఎన్ని కష్టాలు పడాలో అర్థం చేసుకోవాలి. -
ఆవాసాలకు అమృతం కురిసింది
[ 18-04-2024]
భువనగిరి పట్టణంలో నల్లా నీటి సరఫరా వ్యవస్థ మెరుగు పడనుంది. ఆవాస ప్రాంతాల్లోని ప్రజలకు నీటి సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం అమృత్ పథకం కింద మున్సిపాలిటీకి రూ.20.80 కోట్లు మంజూరు చేసింది.