అంతా నిద్రపోతున్న వేళ..!
రెండు నెలల క్రితం చిట్యాల మండలం వెలిమినేడు శివారులో అర్ధరాత్రి తర్వాత ట్యాంకర్ నుంచి ఫార్మా వ్యర్థాలను రహదారి పక్కన ఉన్న చెరువులో పారబోయడంతో చెరువులోని చేపలు మృతిచెందాయి.
జాతీయ రహదారుల పక్కన ఔషధ, జీవ వ్యర్థాలను పారబోస్తున్న వైనం
పోచంపల్లి మండలం అంతమ్మగూడెంలో రంగు మారిన నీరు ఇలా..
రెండు నెలల క్రితం చిట్యాల మండలం వెలిమినేడు శివారులో అర్ధరాత్రి తర్వాత ట్యాంకర్ నుంచి ఫార్మా వ్యర్థాలను రహదారి పక్కన ఉన్న చెరువులో పారబోయడంతో చెరువులోని చేపలు మృతిచెందాయి. ఆ చెరువు నీళ్లన్నీ కలుషితం అయ్యాయి. ఫిర్యాదు చేసినా.. కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారులు గానీ, పోలీసులు గానీ దీనిపై లోతైన విచారణ చేయలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఈనాడు, నల్గొండ - న్యూస్టుడే, చిట్యాల గ్రామీణం: ఉమ్మడి నల్గొండ జిల్లాలోని హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై పలు ప్రాంతాల్లో ఫార్మా వ్యర్థాలను ట్యాంకర్లలో తెచ్చి కొందరు రహదారి పక్కనే పారబోస్తున్నారు. రెండు నెలల నుంచి చౌటుప్పల్, చిట్యాల మండలాల్లో సుమారు మూడు ఘటనలు చోటు చేసుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. పరిశ్రమలో రోజంతా వచ్చిన వ్యర్థాలను ట్యాంకర్లలో నిల్వ చేసి అర్ధరాత్రి సుమారు 12 గంటల నుంచి మూడు గంటల మధ్యలో చౌటుప్పల్, చిట్యాల, నార్కట్పల్లి, కట్టంగూరు మండలాల పరిధిలోని జాతీయ రహదారి పక్కన పారబోస్తున్నారు. చౌటుప్పల్ శివారులో ఫార్మా వ్యర్థాల వల్ల అక్కడి చెరువు కలుషితమై జీవాలు సైతం నీళ్లు తాగలేని స్థితికి చేరుకున్నాయి. గతేడాది ఫార్మా వ్యర్థాలను వెలిమినేడు చెరువులోకి వదలడంతో కాలుష్యంతో సుమారు రూ.10 లక్షల మేర చెరువులోని చేపలు మృతిచెంది మత్స్యకారులకు తీవ్ర ఆర్థిక నష్టం జరిగింది. వీటితో పాటూ కోళ్ల పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలను సైతం రహదారి పక్కనే పారబోస్తున్నారు. దీంతో అక్కడి పరిసర ప్రాంతాలతో పాటూ రహదారిపై ప్రయాణిస్తున్న వారికి ఇది ఇబ్బందిగా మారింది.
చిట్యాల మండలంలో జాతీయ రహదారి పక్కనే
పారబోసిన వ్యర్థజలాలు (పాత చిత్రం)
* ఇంత జరుగుతున్నా సంబంధిత కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) అధికారులు మాత్రం ఘటన జరిగినప్పుడు హడావుడి చేయడం, తర్వాత సదరు కంపెనీల వారితో ‘మామూలు’గా ఉంటున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. చిట్యాలతో పాటూ చౌటుప్పల్లో రహదారి పక్కన సుమారు పది వరకు చెరువులు, నీటి కుంటలున్నాయి. వీటిని లక్ష్యంగా చేసుకొని ఈ ఫార్మా వ్యర్థాలను కంపెనీలు పారబోస్తున్నాయి. రహదారి పక్కన ఇతర ప్రాంతాల్లో వదిలితే తెలిసిపోతుందనే భయంతో కుంటల్లో వదులుతున్నారు. దీంతో ఈ ప్రాంతాల్లో నీటి గాఢత ప్రమాదకరంగా మారింది. నీటి గాఢత పరిమాణం సాధారణంగా 500 వరకు ఉంటే మనుషులు వాడుకోవచ్చు. 2000 వరకు ఉంటే వ్యవసాయానికి వాడుకోవచ్చు. కానీ, చౌటుప్పల్, చిట్యాల, నార్కట్పల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో నీటి గాఢత ప్రస్తుతం ప్రమాదకరంగా 13000 వరకు చేరుకుంది. ఈ వాతావరణంలో మనుషుల మనుగడ ప్రమాదకరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
భూగర్భజలాలు కలుషితం
కొన్ని ఫార్మా కంపెనీలు ఈ ఔషధ వ్యర్థాలను భారీ గొయ్యి తీసి భూమిలోకే వదలడంతో అక్కడి భూగర్భజలాలు కలుషితం అవుతున్నాయి. చిట్యాల మండలంలోని పిట్టంపల్లి, వెలిమినేడు, చౌటుప్పల్ మండలంలోని ఆరేగూడెం, పంతంగి, లింగారెడ్డిగూడెం, నాతాళ్లగూడెం, యల్లగిరి, ధర్మోజీగూడెం, జుబ్లక్పల్లి భూదాన్పోచంపల్లి మండలంలోని దోతిగూడెం, అంతమ్మగూడెం పరిసరాల్లో భూగర్భజలాలు కలుషితం అయి పంటలు పండని దుస్థితి నెలకొంది. బీబీనగర్, భువనగిరి, బొమ్మలరామారం మండలాల్లోని పలు ప్రాంతాల్లోనూ ఇదే దుస్థితి. ఈ ప్రాంతాల్లోనే సుమారు 50 వరకు చిన్నా, పెద్దా ఫార్మా కంపెనీలున్నాయి. ఈ కలుషిత జలాల వల్ల ప్రజలు సైతం అంతుచిక్కని వ్యాధులతో బాధపడుతున్నారు. చౌటుప్పల్లోని స్థానికులు రాత్రి ఈ పరిశ్రమల నుంచి వచ్చే కంపు (వాసన) భరించలేక రాజధాని పరిసర ప్రాంతాల్లోని హయత్నగర్ పరిసరాల్లో అద్దెకు ఉంటున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంత జరుగుతున్నా పీసీబీ అధికారులు ఎలాంటి చర్యలకు ఉపక్రమించడం లేదని ఈ పరిసర ప్రాంతాల ప్రజలు ఆరోపిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రభుత్వంపై విమర్శ.. రైతులకు భరోసా
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సుయాత్ర చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దానిని ఉమ్మడి జిల్లా నుంచే ప్రారంభించడంతో.. భారాస నేతలు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. -
బాలికలు.. భళా
[ 25-04-2024]
విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. -
మోదీతో తెలంగాణకు తీరని అన్యాయం
[ 25-04-2024]
కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ తెలంగాణకు తీరని అన్యాయం చేశారని నల్గొండ లోక్సభ ఇన్ఛార్జి, మంత్రి నల్లమాద ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. -
బాలికలదే హవా
[ 25-04-2024]
రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. -
ఉపాధి కూలీల సౌకర్యాలపై సమీక్ష
[ 25-04-2024]
పని ప్రదేశాలలో ఉపాధి కూలీలకు మౌలిక సౌకర్యాలు సమకూర్చాలని జిల్లా పరిషతు ముఖ్య కార్యనిర్వహణాధికారి శోభారాణి, ఆదనపు డీఆర్డీవో జి.సురేష్, సూచించారు. -
ప్రథమంలో 26.. ద్వితీయంలో 25
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. 2022-23లో జిల్లా ఉత్తీర్ణత శాతం 57 ఉండగా, ప్రస్తుతం 54.50 శాతానికి పడిపోయింది. -
ఊపందుకున్న నామినేషన్ల పర్వం
[ 25-04-2024]
నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాలకు బుధవారం వరకు 45 మంది చొప్పున నామినేషన్లు వేశారు. -
గిరిజన గురుకులాల్లో 88.60శాతం ఉత్తీర్ణత
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో కలిపి ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 88.60శాతం ఫలితాలు -
మతోన్మాద భాజపాను ఓడించండి: సీపీఐ
[ 25-04-2024]
దేశంలో మతోన్మాదం పేరుతో రాజకీయాలు చేస్తున్న భాజపాను ఓడించి కాంగ్రెస్ అభ్యర్ధులను భారీ మెజార్టీతో గెలిపించాలని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. -
విభజన హామీల అమలుకు కృషి
[ 25-04-2024]
భువనగిరి లోక్సభ ఎంపీగా తనను గెలిపిస్తే విభజన హామీలను అమలు చేసేందుకు, నిధులు రాబట్టేందుకు కృషి చేస్తానని భువనగిరి లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. -
తొలి ఎన్నికలోనే అత్యధిక మెజారిటీ
[ 25-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1951లో ఏర్పడగా.. తొలి ఎన్నికలు 1952లో జరిగాయి. -
రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం, వ్యక్తి అరెస్ట్
[ 25-04-2024]
రైల్వేశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని 17 మంది బాధితుల నుంచి నగదు వసూలు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు పోలీస్ ఇన్స్పెక్టర్ అశోక్రెడ్డి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)