ఇంతింతైన విశ్వాసం
నిరంతర సాధనతో పోలీసు ఉద్యోగాలను సాధించడంలో ఆ గ్రామ యువత ముందు వరుసలో ఉంటోంది.
నేరేడుచర్ల: దిర్శించర్లలో అభ్యర్థుల కసరత్తు
నేరేడుచర్ల, న్యూస్టుడే: నిరంతర సాధనతో పోలీసు ఉద్యోగాలను సాధించడంలో ఆ గ్రామ యువత ముందు వరుసలో ఉంటోంది. ఎప్పుడు పోలీసు ఉద్యోగాల ప్రకటన వచ్చినా కనీసం డజను మంది ఉద్యోగాలు సాధిస్తున్నారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం దిర్శించర్ల గ్రామానికి చెందిన యువత పోలీసు ఉద్యోగాల సాధనలో ముందు వరుసలో ఉంటున్నారు. ఇప్పటికే ఆ గ్రామం నుంచి 100 మందికి పైగా పోలీసు కానిస్టేబుళ్లు, 10 మందికి పైనే ఎస్సైలు, ముగ్గురు సీఐలు, ఒకరు డీఎస్పీగా పని చేస్తున్నారు. వారి స్ఫూర్తితో ఈ ఏడాది పోలీసు కొలువుల కోసం నిర్వహించిన రాత పరీక్షలో ఈ గ్రామం నుంచి 70 మంది అర్హత సాధించారు. ఈవెంట్స్లోనూ ప్రతిభ కనబరిచి ఉద్యోగాలు సాధించేందుకు శ్రమిస్తున్నారు. గ్రామంలో సరైన క్రీడా ప్రాంగణం లేక పోవడంతో జాన్పహాడ్ మేజర్ పక్కన ఉన్న ఖాళీ స్థలంలోనే సాధన చేస్తున్నారు.
ఫిట్నెస్ కోసం అభ్యర్థుల నిత్య సాధన
ఎస్సై ఉద్యోగం సాధిస్తా
- పంగ నవ్య
మా బంధువుల్లో కొందరు ప్రస్తుతం కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తున్నారు. నేను బీఏ చదివాను. వారిని స్ఫూర్తిగా తీసుకుని ఎస్సై కావాలని లక్ష్యంగా పెట్టుకున్నా. రాత పరీక్షలో అర్హత సాధించా. దేహదారుఢ్య పరీక్షల్లోనూ విజయం సాధించేందుకు రోజు మూడు గంటలపాటు శ్రమిస్తున్నా.
మా కుటుంబీకులే స్ఫూర్తి
-బుడిగె శ్రావణి
మా కుటుంబంలో ఎక్కువ మంది పోలీసు ఉద్యోగాలలో ఉండటంతో వారి స్ఫూర్తితోనే ఈ పరీక్ష రాసి అర్హత సాధించా. బీఎస్సీ చదివా. గ్రామానికి చెందిన పల్ల సైదులు ఇసుక తోలించి ప్రాక్టీస్ చేసుకునేందుకు ఏర్పాటు చేశారు. గ్రౌండ్ బాగు చేయించారు. పీఈటీ రవి సూచనలు, సలహాలు ఇస్తున్నారు.
సాధనకు సరైన వసతి లేదు
-కల్వకుంట్ల శిరీష
ఎస్సై ఉద్యోగానికి పోటీ పడుతున్నా. రాత పరీక్షలో అర్హత సాధించా. బీఎస్సీ చదివాను. మా గ్రామంలో సరైన క్రీడా ప్రాంగణం లేక పోవడంతో జాన్పహాడ్ మేజర్ పక్కన గల ఖాళీ స్థలంలో సాధన చేస్తున్నాం. కొన్ని సార్లు మిర్యాలగూడ పరిధిలోని అవంతీపురం వద్ద సాధన చేసేందుకు వెళుతున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారీగా పెరిగారు..!
[ 18-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1951లో ఏర్పడగా.. 1952లో తొలిసారిగా ఎన్నికలు జరిగాయి. నాటి నల్గొండ ద్విసభ్య నియోజకవర్గంగా ఉండి.. -
360 డిగ్రీల్లో.. నిఘా
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికల్లో ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసింది. -
లోక్సభ బరిలో ధర్మ సమాజ్ పార్టీ
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికలతోపాటు సికింద్రాబాద్లోని కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలోనూ పోటీ చేస్తున్నట్లు ధర్మ సమాజ్ పార్టీ(డీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ తెలిపారు. -
ఇంతి పాత్ర అంతంతే..!
[ 18-04-2024]
ఓటర్లలో సగభాగమైన మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కరవవుతోంది. చైతన్యమంతమైన నల్గొండ జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉంది. నల్గొండ, మిర్యాలగూడ, భువనగిరి నియోజకవర్గాల నుంచి ఇప్పటి వరకు ఒక్క పర్యాయమైనా మహిళను గెలిపించి లోక్సభకు పంపలేదు. -
పట్టుపట్టి.. ర్యాంకు కొట్టి..!
[ 18-04-2024]
అనుకున్నది సాధించటానికి ఎన్ని కష్టాలైనా పడాల్సిందే.. అదే లక్ష్యం అత్యున్నతమైతే దానికి ఎన్ని కష్టాలు పడాలో అర్థం చేసుకోవాలి. -
ఆవాసాలకు అమృతం కురిసింది
[ 18-04-2024]
భువనగిరి పట్టణంలో నల్లా నీటి సరఫరా వ్యవస్థ మెరుగు పడనుంది. ఆవాస ప్రాంతాల్లోని ప్రజలకు నీటి సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం అమృత్ పథకం కింద మున్సిపాలిటీకి రూ.20.80 కోట్లు మంజూరు చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!