సమీపిస్తున్న గడువు సర్కారు ఆదేశాలు బుట్టదాఖలు
పల్లెల్లో సాధారణ బల్పుల స్థానంలో ఎల్ఈడీ దీపాలను అమర్చాలని ప్రభుత్వ ఆదేశాలు బుట్టదాఖలయ్యాయి. రెండేళ్ల క్రితమే నిర్ణయించినా ఆచరణకు నోచుకోలేదు.
నల్గొండ గ్రామీణం, న్యూస్టుడే: పల్లెల్లో సాధారణ బల్పుల స్థానంలో ఎల్ఈడీ దీపాలను అమర్చాలని ప్రభుత్వ ఆదేశాలు బుట్టదాఖలయ్యాయి. రెండేళ్ల క్రితమే నిర్ణయించినా ఆచరణకు నోచుకోలేదు. తాజాగా మరోమారు ఆగస్టులో నిర్ణయం తీసుకున్నా.. ఎక్కడి పనులు అక్కడే అన్న చందంగా మారింది. నిర్ణీత గడువు వచ్చేనెలతో ముగియనునా.. ఇప్పటి వరకు పావులావంతు గ్రామాల్లోనూ పనులు పూర్తికాలేదు. ఇంధన సంరక్షణ పథకం కింద గ్రామాల్లో ఎల్ఈడీ దీపాలు అమర్చడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రీకారం చుట్టాయి. ఈ పనులను ఈఈఎస్ఎల్ (ఇంధన సామర్థ్య సేవల సంస్థ)కు అప్పగించారు. మొదటి విడతలో నల్గొండ జిల్లాలో 844 గ్రామాల్లో వచ్చే ఏడాది జనవరి లోపు ఎల్ఈడీ దీపాల అమర్చే పనులు పూర్తిచేయాల్సి ఉంది. జిల్లాలో విడతల వారీగా విద్యుత్ స్తంభాల సర్వే చేస్తూ ఎల్ఈడీ దీపాలు బిగిస్తున్నారు. తొలుత 9 మండలాల్లో సర్వే చేస్తున్నారు. వీటిలో చింతపల్లి, మర్రిగూడ, చిట్యాల, కట్టాంగూర్, శాలిగౌరారంతో పాటు మరో నాలుగు మండలాలలోని అనుబంధగ్రామాలున్నాయి. వీటిలో 10 రోజలుగా సర్వే చేసి ఎల్ఈడీ దీపాలు అమరుస్తున్నారు. పనుల్లో వేగం లేకపోవడంతో నిర్ణీత గడువులోగా పూర్తిచేయడం కష్టమే.
ఏడేళ్లపాటు నిర్వహణ
ఎల్ఈడీ విద్యుద్ధీపాల నిర్వహణ బాధ్యతను తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీఎస్ రెడ్కో)కు అప్పగించారు. ఏడేళ్లపాటు నిర్వహణ బాధ్యత ఆ సంస్థదే. అందుకు ప్రభుత్వం గ్రామపంచాయతీ నిధుల నుంచి సంస్థకు నిర్వహణ కోసం నిధులు బదిలీ చేయనుంది. ఇంధన సంరక్షణ పథకం అమలు కారణంగా పంచాయతీలపై భారం సగం వరకు తగ్గనుంది. గతంలో ఒక బల్పుపై ఏడాదికి రూ.110 బిల్లు రాగా.. ఎల్ఈడీ బల్పు అయితే రూ. 38 విద్యుత్తు బిల్లు అవుతుంది.
ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా..
సూర్యనారాయణ, జిల్లా మేనేజర్, టీఎస్రెడ్కో
ఎల్ఈడీ వీధి దీపాల ఏర్పాటుపై ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ముందుకెళ్తున్నాం. గ్రామాల వారీగా నల్గొండ జిల్లాలో సర్వేచేసి ఎల్ఈడీ దీపాలు బిగిస్తున్నాం. పనుల్లో వేగాన్ని పెంచి సకాలంలో పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భువనగిరిలో ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ
[ 18-04-2024]
తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. -
నేడే విడుదల రంగం
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల క్రతువునకు రంగం సిద్ధమైంది. అధికారులు నేడు నోటిఫికేషన్ జారీ చేసిన వెంటనే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి -
బంతికో వంద జోరుగా దందా
[ 18-04-2024]
జిల్లాలో ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) బెట్టింగ్ దందా జోరుగా సాగుతోంది. బంతి బంతికి ఓ రేటు.. బౌండరీ దాటితే ఓ రేటు, వికెట్ పడితే మరో రేటు.. -
అవకాశవాదులకు గుణపాఠం చెప్పాలి: జూలకంటి
[ 18-04-2024]
భువనగిరి లోక్సభ స్థానంలో పార్టీలు ఫిరాయించే అవకాశవాదులు, ధన బలంతో గెలవాలనుకునే వారికి ప్రజలు ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని మాజీ ఎమ్మెల్యే, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి కోరారు. -
గురుకులాల్లో గందరగోళం!
[ 18-04-2024]
-
కాంగ్రెస్ పార్టీనే ప్రజలకు శ్రీరామరక్ష
[ 18-04-2024]
తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీనే శ్రీరామరక్ష అని ఎమ్మెల్యే, పార్టీ భువనగిరి లోక్సభ నియోజకవర్గ ఎన్నికల ఇన్ఛార్జి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. -
కన్నీటి సహవాసం.. మరుగుదొడ్డిలో నివాసం
[ 18-04-2024]
వృద్ధాప్యంలో తోడుగా ఉండటానికి కుమారులు లేరు.. జీవిత భాగస్వామి 13 ఏళ్ల కాలం క్రితమే మృతి చెందాడు. ఇన్నాళ్లూ నీడనిచ్చిన పూరిగుడిసె నేలమట్టమైంది. -
పశుగ్రాసం కరవు.. పశు పోషణ బరువు
[ 18-04-2024]
ఈ ఏడాది వరిసాగు విస్తీర్ణం తగ్గడంతో పశుగ్రాసం కష్టాలు మొదలయ్యాయి. ఆధునిక వ్యవసాయం పేరిట కోత యంత్రాలతో వరి పంట కోయడం, -
బరిలో.. తొలిసారి
[ 18-04-2024]
త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్సభ నియోజకవర్గాలైన నల్గొండ, భువనగిరిలో బరిలో ఇప్పటికే మూడు ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించగా.. -
భారీగా పెరిగారు..!
[ 18-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1951లో ఏర్పడగా.. 1952లో తొలిసారిగా ఎన్నికలు జరిగాయి. నాటి నల్గొండ ద్విసభ్య నియోజకవర్గంగా ఉండి.. -
360 డిగ్రీల్లో.. నిఘా
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికల్లో ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిఘా వ్యవస్థను పటిష్ఠం చేసింది. -
లోక్సభ బరిలో ధర్మ సమాజ్ పార్టీ
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికలతోపాటు సికింద్రాబాద్లోని కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలోనూ పోటీ చేస్తున్నట్లు ధర్మ సమాజ్ పార్టీ(డీఎస్పీ) రాష్ట్ర అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ తెలిపారు. -
ఇంతి పాత్ర అంతంతే..!
[ 18-04-2024]
ఓటర్లలో సగభాగమైన మహిళలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కరవవుతోంది. చైతన్యమంతమైన నల్గొండ జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉంది. నల్గొండ, మిర్యాలగూడ, భువనగిరి నియోజకవర్గాల నుంచి ఇప్పటి వరకు ఒక్క పర్యాయమైనా మహిళను గెలిపించి లోక్సభకు పంపలేదు. -
పట్టుపట్టి.. ర్యాంకు కొట్టి..!
[ 18-04-2024]
అనుకున్నది సాధించటానికి ఎన్ని కష్టాలైనా పడాల్సిందే.. అదే లక్ష్యం అత్యున్నతమైతే దానికి ఎన్ని కష్టాలు పడాలో అర్థం చేసుకోవాలి. -
ఆవాసాలకు అమృతం కురిసింది
[ 18-04-2024]
భువనగిరి పట్టణంలో నల్లా నీటి సరఫరా వ్యవస్థ మెరుగు పడనుంది. ఆవాస ప్రాంతాల్లోని ప్రజలకు నీటి సదుపాయం కల్పించేందుకు ప్రభుత్వం అమృత్ పథకం కింద మున్సిపాలిటీకి రూ.20.80 కోట్లు మంజూరు చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
-
భారత వ్యతిరేకి.. మాల్దీవులు మాజీ అధ్యక్షుడు విడుదల
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
వైకాపా అభ్యర్థి అంబటి మురళీపై చర్యలకు ఈసీ ఆదేశం
-
విధుల్లో అలసత్వం.. ఆరుగురు పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు
-
కిమ్ ‘జీవాయుధ’ కార్యక్రమం.. వ్యాధుల వ్యాప్తికి ‘విషపు పెన్నులు’, స్ప్రేలు!