సమీకృతం.. పనులు ఆలస్యం
పురపాలిక ప్రజల సౌకర్యం కోసం ‘సమీకృత మార్కెట్’ను ప్రభుత్వం మంజూరు చేసి ఏడాది గడుస్తోంది. నిత్యావసరాలైన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పూలు, మాంసం, చేపల దుకాణాలు ప్రత్యేకంగా మరో వైపు అందుబాటులో ఉంచాలని ఈ మార్కెట్కు రూపకల్పన చేశారు.
ఒకేచోట 108 కూరగాయలు, పూలు, పండ్లు, మాంసం దుకాణాలు
చౌటుప్పల్ సమీకృత మార్కెట్ నమూనా
చౌటుప్పల్, న్యూస్టుడే: పురపాలిక ప్రజల సౌకర్యం కోసం ‘సమీకృత మార్కెట్’ను ప్రభుత్వం మంజూరు చేసి ఏడాది గడుస్తోంది. నిత్యావసరాలైన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పూలు, మాంసం, చేపల దుకాణాలు ప్రత్యేకంగా మరో వైపు అందుబాటులో ఉంచాలని ఈ మార్కెట్కు రూపకల్పన చేశారు. ప్రభుత్వం నుంచి రూ.4.50 కోట్లు నిధులు మంజూరయ్యాయి. 60 కూరగాయల, 18 పూలు, పండ్లు, 30 మాంసం, చేపల దుకాణాలను నిర్మించేందుకు టెండరు ఖరారు చేసి హైదరాబాద్కు చెందిన షీకో ప్రాజెక్ట్స్ అనే సంస్థకు నిర్మాణ పనులను అప్పగించారు. పురపాలిక ద్వారా స్థలం సేకరించి ఆ సంస్థకు అప్పగించడంలో తీవ్ర జాప్యం జరిగింది. సుమారు యాభై ఏళ్లుగా అటవీ శాఖ కార్యాలయం నిర్వహిస్తున్న స్థలాన్ని స్వాధీనం చేసుకుని సమీకృత మార్కెట్ నిర్మాణం కోసం కేటాయించాలని పుర పాలకవర్గం నిర్ణయించింది. అటవీశాఖాధికారులు దీనికి విముఖత చేపడంతో వివాదం ఏర్పడింది. ఈ విషయంలో మంత్రి కేటీఆర్ జోక్యం చేసుకుని జిల్లా కలెక్టర్ ద్వారా రెండెకరాల స్థలాన్ని సమీకృత మార్కెట్ నిర్మాణానికి కేటాయించారు. మూడు నెలల క్రితం నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. వర్షాలు రావడంతో కొంత ఆటంకం ఏర్పడింది. ఈ మార్కెట్ సముదాయం పూర్తయితే జాతీయ రహదారి పక్కన, సర్వీసు రోడ్ల వెంట నిర్వహిస్తున్న దుకాణాలన్నీ ఒకే చోటుకి చేరతాయి.
చౌటుప్పల్లో సాగుతున్న నిర్మాణ పనులు
ఆరు నెలల్లో పూర్తవుతుంది
-వెన్నెల్కుమార్, సహాయ ఇంజినీర్
తొమ్మిది నెలల్లో మార్కెట్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని గుత్తేదారు సంస్థతో ఒప్పందం కుదిరింది. మూడు నెలల క్రితం నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 2023 మే నాటికి పూర్తవుతుంది. తొలి దశ బ్లాక్లో 60 కూరగాయలు, 18 పూలు, పండ్ల దుకాణాల నిర్మాణ పనులు చేయిస్తున్నాం. ఇది పూర్తయ్యాక మాంసాహార మార్కెట్ బ్లాక్లో 30 దుకాణాలు నిర్మాణం చేపడతాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతాక స్థాయికి ప్రచారం
[ 23-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఉమ్మడి నల్గొండ జిల్లాలో పతాక స్థాయికి చేరింది. భువనగిరి లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డికి మద్దతుగా ఆదివారం భువనగిరి పట్టణంలో -
కుటుంబ పాలనను తరిమికొట్టాలి
[ 23-04-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాకు మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి కుటుంబాలతో పాటూ జానారెడ్డి కుటుంబం చేసిందేమీ లేదని కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి విమర్శించారు. -
అనర్థం.. చెత్తలో బయో వ్యర్థం
[ 23-04-2024]
నల్గొండ జిల్లా పరిషత్తు, న్యూస్టుడే: ఆసుపత్రుల్లో జాగ్రత్తలు తీసుకునే వైద్యులు తమ ఆసుపత్రుల నుంచి వెలువడే వ్యర్థాలను మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. -
విత్తనం.. ఎవరిదీ పెత్తనం
[ 23-04-2024]
వరి విత్తనాలకు ప్రభుత్వం రాయితీ ఇవ్వడం లేదు. రైతన్నలపై విత్తన భారం పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం పరిశోధనా స్థానాలు, ఐఆర్ఆర్, ఐసీఏఆర్ తదితర కేంద్ర సంస్థల నుంచి విడుదలైన విత్తన రకాలనే సరఫరా చేస్తుంది. -
భగభగ మండే
[ 23-04-2024]
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
కరదీపిక.. సందేహాల నివృత్తికి వేదిక
[ 23-04-2024]
ఎన్నికల నిర్వహణలో పోలింగ్ విధులు నిర్వర్తించే అధికారుల పాత్ర కీలకం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండ, భువనగిరి లోక్సభ నియోజకవర్గాల్లో నామపత్రాల స్వీకరణ -
పేదల హృదయాల్లో నిలిచె
[ 23-04-2024]
ప్రజాభీష్టంతో మూడు పర్యాయాలు నాటి మిర్యాలగూడ ఎంపీగా ఎన్నికై, పేదల అభ్యున్నతికి పాటుపడిన దివంగత జీఎస్ రెడ్డి(గోపు శౌరెడ్డి).. -
ఈవీఎంలకు 35 ఏళ్లు
[ 23-04-2024]
ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంల పాత్ర అత్యంత ముఖ్యం. ఈ యంత్రం తొలుత వినియోగం, పుట్టు పూర్వోత్తరాలను పరిశీలించినట్లైతే.. -
అక్షరంతో సహవాసం.. వ్యక్తిత్వ వికాసం
[ 23-04-2024]
వ్యక్తి వికాసానికి, సమాజ చైతన్యానికి పుస్తకాలే ఆధారం. గతించిన కాలాన్ని భవిష్యత్ తరాలకు తెలియజేసే సాధనం పుస్తకం. పుస్తకాలను స్నేహితులుగా భావిస్తారు. -
జీవితంలో పాస్ అవుదాం..!
[ 23-04-2024]
పదో తరగతి, ఇంటర్, డిగ్రీ పరీక్షల్లో ఫెయిలయ్యామంటూ.. మార్కులు తక్కువ వచ్చాయంటూ.. పోటీ పరీక్షల్లో సీట్లు రాలేదంటూ.. ఏటా పలువురు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్న తరుణంలో.. -
నిర్మాణాల్లో.. అమలు కాని నిబంధనలు
[ 23-04-2024]
ఆలేరు పురపాలికగా ఏర్పడ్డాక ఏటా వందకు పైగా ఇళ్ల నిర్మాణాల అనుమతుల కోసం దరఖాస్తులు వస్తున్నాయి. కొత్త పురపాలిక చట్టం అమలులోకి వచ్చాక నిర్మాణాల అనుమతుల నిబంధనలు కఠినతరం చేశారు. -
బాలుడు మరణించిన 10 రోజులకు తండ్రి ఫిర్యాదు
[ 23-04-2024]
సంపులో పడి 22 నెలల బాలుడు మృతి చెందిన ఘటన మండలంలోని రెడ్డినాయక్తండాలో ఈ నెల 11న చోటు చేసుకుంది. -
ఎన్నికలయ్యే వరకు అప్రమత్తంగా ఉండండి: కలెక్టర్
[ 23-04-2024]
పోలింగ్ ప్రక్రియ ముగిసేంత వరకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి వెంకటరావు అన్నారు.