logo

భువనగిరిలో చోరీ

భువనగిరి పట్టణం కిసాన్ నగర్‌లో అర్ధరాత్రి తర్వాత చోరీ జరిగింది. ఓ ఇంటి తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు.

Published : 05 Dec 2022 11:01 IST

భువనగిరి : భువనగిరి పట్టణం కిసాన్ నగర్‌లో అర్ధరాత్రి తర్వాత చోరీ జరిగింది. ఓ ఇంటి తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. కిసాన్‌నగర్‌లో నివాసం ఉండే చందు అనే వ్యక్తి రెండు రోజుల క్రితం స్వగ్రామమైన యాదగిరిగుట్టకు వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేకపోవడంతో గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు పగలగొట్టి 7 తులాల బంగారు ఆభరణాలు అపహరించారు. ఈ రోజు ఉదయం చందు ఇంటి తలుపులు తెరచి ఉండటాన్ని గమనించిన స్థానికులు ఆయనకు సమాచారం అందించారు. ఇంటికి చేరుకున్న చందు తన ఇంట్లో చోరీ జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని