అక్రమాల నీడలో.. నూడ
ఇలా ఒకటి, రెండు కాదు. వందల సంఖ్యలో అక్రమంగా ఇళ్లు, భవనాలు, ఫంక్షన్హాళ్ల నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి నీలగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(నూడ) పరిధిలోని 42 గ్రామ పంచాయతీల్లో అక్రమ నిర్మాణాల జోరు కొనసాగుతోంది.
కాగితాల్లో వ్యవసాయ భూములు.. క్షేత్రస్థాయిలో ఫంక్షన్హాళ్లు
నూడ పరిధిలోని కనగల్ మండలం రేణుకాఎల్లమ్మదేవి ఆలయం నుంచి ధర్వేశిపురం గ్రామానికి వెళ్లే మార్గంలో వ్యవసాయ పొలంలో ఫంక్షన్హాల్ నిర్మిస్తున్నారు. రెవెన్యూశాఖ నుంచి నాలా, అగ్నిమాపకశాఖ, డీటీపీసీ, నూడ నుంచి అనుమతులు లేకుండానే యథేచ్ఛగా నిర్మాణం కొనసాగిస్తున్నారు. ప్రమాదం చోటు చేసుకుంటే తక్షణ నివారణ చర్యలు తీసుకోవడానికి సెట్ బ్యాక్ కూడా వదలకుండా పనులు చేపట్టారు.
నల్గొండ జిల్లాపరిషత్, న్యూస్టుడే: ఇలా ఒకటి, రెండు కాదు. వందల సంఖ్యలో అక్రమంగా ఇళ్లు, భవనాలు, ఫంక్షన్హాళ్ల నిర్మాణాలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి నీలగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(నూడ) పరిధిలోని 42 గ్రామ పంచాయతీల్లో అక్రమ నిర్మాణాల జోరు కొనసాగుతోంది. అధికారుల నిర్లక్ష్యంతో గ్రామాల్లో విచ్చల విడిగా..ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండానే భవన నిర్మాణాలు కొనసాగుతున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధులతో గ్రామ పంచాయతీ కార్యదర్శులు కుమ్మక్కై నల్గొండ, తిప్పర్తి, కనగల్, నార్కట్పల్లి మండలాల్లోని గ్రామాల్లో అక్రమ నిర్మాణాలకు సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అక్రమ నిర్మాణాల కారణంగా ప్రభుత్వ ఆదాయానికి రూ.కోట్లల్లో గండి పడుతోంది.
పొలాల్లోనే ఫంక్షన్హాళ్లు
నల్గొండ జిల్లాలో పేరు పొందిన ఆలయాల్లో ధర్వేశిపురం ఎల్లమ్మదేవి గుడి మొదటి వరుసలో ఉంటుంది. నిత్యం వేలాది సంఖ్యలో భక్తులు హాజరై పూజా కార్యక్రమాలు, ఫంక్షన్లు నిర్వహిస్తారు. వాటికితోడు విందు, వినోదాలకు అవకాశం ఉండటంతో భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. దీని ఆసరాగా తీసుకున్న కొందరు పంటపొలాల్లో రెండు, మూడు ఎకరాల విస్తీర్ణంతో ఫంక్షన్హాళ్లు నిర్మిస్తున్నారు. ఇప్పటికే 25కు పైగా నిర్మించారు. అందులో చాలా వాటికి నాలా, అగ్నిమాపకశాఖ, నూడ, డీటీపీసీ అనుమతులు లేవు. పైగా నిబంధనలను తుంగలో తొక్కి కొందరూ అసైన్డ్ భూముల్లో సైతం అక్రమ షెడ్లు నిర్మించినట్లు ఆరోపణలు ఉన్నాయి. గ్రామ పంచాయతీకి కేవలం 340 గజాల ఇళ్లకు అనుమతి ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఎకరాల విస్తీర్ణంలో అనుమతి ఇచ్చే వీలు లేదు. నూడ అమల్లోకి వచ్చి ఏడాది అవుతున్నప్పటికి అంతకు ముందు తేదీల్లో గ్రామ పంచాయతీ అనుమతి తీసుకున్నట్లు దస్త్రాలు తయారు చేస్తూ అక్రమాలకు, అవినీతికి పాల్పడుతున్నారు. విద్యుత్తుశాఖ అనుమతి లేకుండానే క్షేత్రస్థాయి అధికారులను మచ్చిక చేసుకుని ఉచిత విద్యుత్తు బోర్లను ఫంక్షన్హాళ్లకు వినియోగిస్తున్నారు. మరో పక్క కాగితాల్లో వ్యవసాయ భూములుగా చూపిస్తూ రైతు బంధు పొందుతున్నారు. క్షేత్రస్థాయిలో మాత్రం ఫంక్షన్హాళ్లు నిర్మించి అద్దెల రూపంలో రూ.లక్షలు ఆర్జిస్తూ ప్రభుత్వానికి చెల్లించాల్సిన అనుమతుల ఫీజు, ఆస్తిపన్నులు తప్పించుకుంటున్నట్లు తెలిసింది.
నార్కట్పల్ల్లి- అద్దంకి జాతీయ రహదారి పక్కన యల్లారెడ్డిగూడం నుంచి చెర్వుగట్టు దేవస్థానం వెళ్లే మార్గంలో గ్రామ పంచాయతీ నుంచి (జీ-ఫ్లస్ వన్) అనుమతి తీసుకుని.. అనుమతులకు విరుద్ధంగా సెల్లార్తో పాటు మరో నాలుగు అంతస్తుల భవనం నిర్మిస్తున్నారు. అధికారులకు తెలిసినా కేవలం ఒక నోటీసు జారీ చేసి వదిలేశారు.
నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకుంటాం
- రమణాచారి, వైస్ఛైర్మన్, నూడ
నూడ పరిధిలోని గ్రామ పంచాయతీల్లో అక్రమ నిర్మాణాలు మా దృష్టికి రాలేదు. ఎక్కడైనా నిర్మిస్తే నోటీసులు జారీ చేస్తాం. అవినీతి, అక్రమాల్లో పంచాయతీ కార్యదర్శుల పాత్ర ఉంటే జిల్లా పంచాయతీ అధికారి, కలెక్టర్ చర్యలు తీసుకుంటారు. త్వరలోనే నూడ పరిధిలోని అధికారులతో సమీక్ష నిర్వహించి తదుపరి నివారణ చర్యలు తీసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దాహం కేకలు తీర్చేందుకు...తరలి వస్తున్న కృష్ణమ్మ
[ 19-04-2024]
నాగార్జునసాగర్ జలాశయం డెడ్స్టోరేజీ దిగువకు చేరినా వేసవిలో హైదరాబాద్ జంట నగరాలు, జిల్లా వాసుల దాహం కేకలు తీర్చేందుకు కృష్ణాజలాల సరఫరాకు హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ (జలమండలి) అధికారులు చేపడుతున్న చర్యలు సఫలీకృతమయ్యాయి -
సైబర్ బాధితులకు వారియర్స్ తోడు
[ 19-04-2024]
చరవాణుల ద్వారా డిజిటల్ లావాదేవీలు పెరగడంతో నిత్యం ఎక్కడో చోట అమాయకులు సైబర్ నేరగాళ్ల వలలో పడి ఆర్థికంగా నష్టపోతున్నారు. -
రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా: మంత్రి ఉత్తమ్
[ 19-04-2024]
కోదాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. -
గాడితప్పిన గస్తీ
[ 19-04-2024]
జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. వరుసగా గొలుసు చోరీలకు పాల్పడుతున్నారు. నిఘా పటిష్ఠం చేసి దొంగలను పట్టుకోవడంలో పోలీసులు విఫలమవుతున్నారు. -
ఆలయ భద్రతపై ఇంత నిర్లక్ష్యమా!
[ 19-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రాన్ని నిత్యం వేల సంఖ్యలో భక్తులు సందర్శిస్తుంటారు. ఆలయంలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతే లోనికి అనుమతించేందుకు బ్యాగేజ్ స్కానింగ్, మెటల్ డిటెక్టర్, తదితర భద్రతా పరికరాలను వైటీడీఏ కొనుగోలు చేసింది. -
భక్తవత్సలుడికి సంప్రదాయ ఆరాధనలు
[ 19-04-2024]
యాదాద్రి పుణ్యక్షేత్రంలో గురువారం స్వయంభువులైన పంచనారసింహులను ఆరాధిస్తూ చేపట్టిన నిత్య పూజలు ఆలయ ఆచారంగా కొనసాగాయి -
కేసీఆర్కు సీఎం రేవంత్రెడ్డే సరైనోడు: రాజగోపాల్రెడ్డి
[ 19-04-2024]
తెలంగాణ ఇచ్చిన పదేళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని.. ఆలస్యం అయినా ప్రవేశపెట్టిన పథకాలను నెరవేర్చి.. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తామని భువనగిరి లోక్సభ ఇన్ఛార్జి, స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. -
నాయకులొస్తున్నారు..!
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలోని రెండు లోక్సభ స్థానాలైన నల్గొండ, భువనగిరిలో నామినేషన్ దాఖలు సందర్భంగా భారీ ఎత్తున ర్యాలీలు, సభలు నిర్వహించాలని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీలు భారాస, భాజపాలు నిర్ణయించాయి -
67 ఏళ్లలో 69 శాతమే!
[ 19-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1952లో ఏర్పడగా.. 2019 వరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. 2019 నాటికి నియోజకవర్గానికి తొలి ఎన్నికలు జరిగి 67 ఏళ్లు గడిచాయి -
నల్గొండలో నలుగురు, భువనగిరిలో ముగ్గురు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు నామినేషన్ల పర్వం మొదలైంది. తొలి రోజు గురువారం నల్గొండ లోక్సభ స్థానానికి నలుగురు అభ్యర్థులు ఆరు సెట్లు నామినేషన్లను రిటర్నింగ్ అధికారి, నల్గొండ జిల్లా కలెక్టరు హరిచందనకు అందజేశారు. -
నల్గొండ.. నాయకులకు అండ!
[ 19-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గానికి 18వ సారి ఎన్నికలు జరుగనున్నాయి. ఉమ్మడి జిల్లాలో తొలిసారి ఏర్పడిన ఏకైక లోక్సభ నియోజకవర్గం నల్గొండ మాత్రమే. -
పార్లమెంటు.. ఎంపీ అంటే తెలుసా
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు తమదైన శైలిలో సమావేశాలు నిర్వహిస్తూ ఓటర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు -
వ్యాను ఢీకొని రైతు మృతి
[ 19-04-2024]
ద్విచక్రవాహనాన్ని వ్యాను ఢీకొనడంతో రైతు మృతి చెందిన ఘటన మఠంపల్లి మండలం రఘునాథపాలెం పరిధిలోని వెంకటాయపాలెంలో గురువారం జరిగింది. -
ఇంటి మీద.. అవార్డుల పంట
[ 19-04-2024]
మిద్దె తోటలు.. ఆరోగ్యానికి ఉపయోగపడే కూరగాయలతో పాటు పురస్కారాలనూ తీసుకొస్తున్నాయి.
తాజా వార్తలు (Latest News)
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు