ధరణితో పేదలకు తీరని అన్యాయం: శంకర్నాయక్
ధరణితో పేదలకు తీరని అన్యాయం జరుగుతుందని.. దానిని వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ డిమాండ్ చేశారు.
కలెక్టరేట్ ఎదుట ధర్నాలో మాట్లాడుతున్న డీసీసీ అధ్యక్షుడు శంకర్నాయక్
నల్గొండ కలెక్టరేట్, న్యూస్టుడే: ధరణితో పేదలకు తీరని అన్యాయం జరుగుతుందని.. దానిని వెంటనే రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ డిమాండ్ చేశారు. ధరణి రద్దు, పోడు భూముల సమస్యలను పరిష్కరించాలని, ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతుల సమస్యలు పరిష్కరించడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. భూ రికార్డుల సవరణ పేరుతో ప్రభుత్వం ధరణిని తీసుకొచ్చి పేదలు సాగుచేసుకుంటున్న భూమిపై హక్కు లేకుండా చేసిందని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే రాయితీలు వారికి అందడంలేదన్నారు. కాంగ్రెస్ హయంలో పేదలకు భూమిని ఇవ్వగా తెలంగాణ ప్రభుత్వం వాటిని స్వాధీనం చేసుకుంటున్నారన్నారు. టీపీసీసీ సభ్యుడు దుబ్బాక నర్సింహ్మారెడ్డి మాట్లాడుతూ ధరణి పేదలకు శాపంగా మారిందన్నారు. ధరణితో ధనికులకే లాభం తప్ప పేద ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. కౌలు రైతులకు రైతు బంధు, రైతు బీమా వర్తింపచేయాలని కోరారు. ధర్నాలో టీపీసీసీ అధికార ప్రతినిధి పున్న కైలాస్నేత, పాల్వాయి స్రవంతి, కొండేటి మల్లయ్య, చల్లమల్ల కృష్ణారెడ్డి, చెరుకు సుధాకర్, గుమ్ముల మోహన్రెడ్డి, వంగూరి లక్ష్మయ్య, తండు సైదులు గౌడ్, అమరేందర్రెడ్డి, ముదిరెడ్డి నర్సిరెడ్డి, మాధవి, తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు
[ 17-04-2024]
భువనగిరి పార్లమెంట్ ఎన్నిక నోటిఫికేషన్ జారీ చేయడంతో పాటు నామినేషన్లు స్వేకరించడం జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంత్ కె.జండగే తెలిపారు. -
రేషన్ ఈ- కేవైసీకి మరో అవకాశం.. త్వరగా పూర్తి చేసుకోవాలని అధికారుల సూచన
[ 17-04-2024]
ఆహారభద్రత కార్డుల ఈ- కేవైసీ నమోదుకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. ఫిబ్రవరి 29తో గడువు ముగిసినప్పటికీ రేషన్ దుకాణాల్లో ప్రభుత్వ సూచన మేరకు ప్రస్తుతం ఈ-కేవైసీ ప్రక్రియ కొనసాగుతోంది. -
అక్రమాలపై కన్ను..!
[ 17-04-2024]
కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని బహిరంగ మార్కెట్లో అధిక ధరలకు అమ్ముకోవడంతో పాటూ భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ)కి సకాలంలో ఇవ్వాల్సిన సీఎంఆర్ బియ్యాన్ని ఇవ్వకుండా తాత్సారం చేస్తున్న మిల్లులపై అధికారులు కొరడా ఝులిపించారు. -
నిత్యం రక్తసిక్తం..!
[ 17-04-2024]
జాతీయ, ప్రధాన రహదారులు నిత్యం రక్తమోడుతున్నాయి. వాహనాల అతివేగం, చోదకుల నిర్లక్ష్యం అమాయకుల ప్రాణాలను బలిగొంటున్నాయి. ఒక్కరు చేసిన పాపానికి ఎందరో తనువు చాలిస్తున్నారు. -
ఇచ్చిన హామీలు అమలు చేస్తాం
[ 17-04-2024]
భువనగిరి లోక్సభ స్థానంలో కాంగ్రెస్ గెలుపు ఖాయమని, భారాస, భాజపా అభ్యర్థులకు తమకు పోటీయే కాదని కాంగ్రెస్ భువనగిరి లోక్సభ ఇన్ఛార్జి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. -
అమ్మకానికి ఆడబిడ్డ.. అడ్డుకున్న పోలీసులు
[ 17-04-2024]
రెండో కాన్పులోనూ ఆడ శిశువు జన్మించడంతో ఆర్థికంగా భారం అవుతుందని.. పిల్లలు లేని వారికి విక్రయించి సొమ్ము చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.. -
బస్తాలు రాక.. లక్ష్యం నెరవేరక..!
[ 17-04-2024]
కస్టమ్ మిల్లింగ్ బియ్యం తిరిగి ఇచ్చేందుకు ఉమ్మడి జిల్లాలోని పలు రైస్మిల్లులకు బస్తాల సమస్య నెలకొంది. ఖరీఫ్ ధాన్యంతో పౌరసరఫరాల శాఖ సరఫరా చేసిన బస్తాలకు కాప్రా పురుగు పట్టడంతో (సన్నని తెల్లపురుగు).. -
ఓటు బాణం సంధించు.. రామరాజ్యం స్థాపించు!
[ 17-04-2024]
ఈ లోకంలో సద్గుణ సంపన్నుడు ఎవరని నారద మహర్షిని వాల్మీకి ప్రశ్నించినప్పుడు 16 గుణాలు కలిగిన పరిపూర్ణుడు శ్రీరామచంద్రమూర్తే అన్నాడట. శ్రీరాముడు మానవుడిగా పుట్టి పెరిగి ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాడు. -
శిక్షకులేరీ..?
[ 17-04-2024]
వేసవి ఎండలు మండుతున్నాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు సరదా కోసం ఈతకు వెళ్తున్నారు. చిన్నారులు వేసవి సెలవుల్లోనే ఈత నేర్చుకుంటారు. -
శ్రీస్వామి కల్యాణం.. క్షేత్ర పాలకుడికి ప్రత్యేక పూజలు
[ 17-04-2024]
యాదాద్రి మహాదివ్య పుణ్యక్షేత్రంలో మంగళవారం నిత్య కల్యాణోత్సవం, క్షేత్రపాలకుడైన ఆంజనేయస్వామిని కొలుస్తూ ప్రత్యేక పూజ క్రతువు శాస్త్రోక్తంగా నిర్వహించారు. -
18న నోటిఫికేషన్, నామినేషన్ల స్వీకరణ: కలెక్టర్
[ 17-04-2024]
లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 18న నోటిఫికేషన్ జారీచేయడంతో పాటు అదే రోజు నుంచి నామినేషన్ల స్వీకరణ ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్
-
ఇంటినే చక్కదిద్దలేరు.. ఇక రాష్ట్రాన్ని ఎలా?: అనురాగ్ ఠాకూర్
-
బందరుకు ఏం చేశారో చెప్పే ధైర్యం నీతుల నానికి ఉందా?: చంద్రబాబు
-
గుజరాత్ను వణికించిన దిల్లీ
-
దేశ సరిహద్దులు పూర్తిగా సురక్షితమే: రాజ్నాథ్ సింగ్
-
అవును.. ‘ఎక్స్’ను నిలిపివేశాం: పాక్