డబ్బులు ఎప్పుడిస్తారో..!
పారిశుద్ధ్యాన్ని మెరుగుపర్చేందుకు.. బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలుగా ప్రకటించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణంలో నిధుల కొరత లబ్ధిదారుల పాలిట శాపంగా మారింది.
మరుగుదొడ్లు నిర్మించుకున్నా జరగని బిల్లుల చెల్లింపులు
స్వచ్ఛ భారత్ కింద నిర్మించిన మరుగుదొడ్డి
భువనగిరి, న్యూస్టుడే: పారిశుద్ధ్యాన్ని మెరుగుపర్చేందుకు.. బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలుగా ప్రకటించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన మరుగుదొడ్ల నిర్మాణంలో నిధుల కొరత లబ్ధిదారుల పాలిట శాపంగా మారింది. ఆవాస ప్రాంతాల్లో ఇంటింటా వ్యక్తిగత మరుగుదొడ్లు ఉండాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీలో ఈ పథకాన్ని చేపట్టింది. 2014 అక్టోబరులో గాంధీజయంతి రోజున స్వచ్ఛభారత్ కింద ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. విస్తృతస్థాయిలో ప్రచారం చేసి మరుగుదొడ్లు నిర్మించుకోవాలని లబ్ధిదారుల వెంట పడ్డారు. జిల్లాలో ఉద్యమంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా ప్రకటించారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో గ్రామీణ పేదలు ఉత్సాహంగా మరుగుదొడ్లు నిర్మించుకున్నా.. బిల్లుల చెల్లింపులో గత మూడేళ్లుగా తీవ్ర జాప్యం జరుగుతోంది. ఉమ్మడిజిల్లా వ్యాప్తంగా 11,436 మంది బిల్లుల చెల్లింపుల కోసం ఎదురుచూస్తున్నారు. సుమారు రూ.12.42 కోట్ల బకాయిలను చెల్లించాల్సి ఉంది.
మూడేళ్లుగా నిలిచిన చెల్లింపులు
ప్రభుత్వ ప్రచారం, అధికారుల ఒత్తిడితో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించుకుని మూడేళ్లు గడిచినా..బిల్లులు రాక లబ్ధిదారులు లబోదిబోమంటున్నారు. అధికారుల చుట్టూ తిరుగుతున్నా చెల్లింపుల ప్రస్తావనే రావడం లేదు. 2014కు ముందు గ్రామీణ ఉపాధిహామీ పథకంలో వీటి నిర్మాణాలు చేపట్టారు. స్వచ్ఛ భారత్ మిషన్ కింద నిధులు విడుదల చేశారు. ఎంపిక చేసిన లబ్ధిదారులకు రూ.12 వేలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. బిల్లులను రెండు విడతల్లో ఇవ్వాల్సి ఉంది. 2019 సెప్టెంబరు నుంచి బిల్లుల చెల్లింపులు నిలిచిపోయాయి. నిర్మితమైన మరుగుదొడ్ల ఫొటోలు, బిల్లులను అధికారులకు ఇచ్చి బిల్లులు చెల్లించాలని కోరుతున్నా ప్రభుత్వంలో స్పందన లేదు. అప్పులు చేసి నిర్మించుకున్న పేదలు బిల్లులు రాక గగ్గోలు పెడుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో అడ్డగూడూరు, నారాయణపురం వలిగొండ మండలాల్లో బిల్లులు పొందని లబ్ధిదారులు ఎక్కువమంది ఉన్నారు.
ప్రభుత్వానికి నివేదించాం
- మందడి ఉపేందర్రెడ్డి, డీఆర్డీవో, యాదాద్రి భువనగిరి
2019 నుంచి లబ్ధిదారులకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తెచ్చాం. రెండు నెలల క్రితం గ్రామీణ పారిశుద్ధ్య కమిటీల అకౌంట్ల వివరాలను పూర్తిస్థాయిలో సేకరించి ప్రభుత్వానికి పంపాం. ప్రభుత్వం నిధులు విడుదల చేయగానే చెల్లింపుల ప్రక్రియ సాగుతుంది. ప్రభుత్వం వివరాలు కోరినందున త్వరలోనే నిధులు విడుదల చేసే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నీటిలోని చేపొచ్చి.. నేలమీద పడుతోంది..!
[ 28-03-2024]
తగ్గుతున్న భూగర్భ జలాలతో రైతులతో పాటు మత్స్యకారులు నష్టపోతున్నారు. ఉమ్మడి జిల్లాలోని చెరువుల నీటిమట్టాలు రోజురోజుకూ తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో చెరువుల్లోని చేపలు తగినంత పరిమాణం పెరగక ముందే పట్టేసి విక్రయించాల్సిన దుస్థితి నెలకొంది. -
వారివి చుట్టపు చూపులే..!
[ 28-03-2024]
గ్రామ పంచాయతీల్లో ప్రత్యేకాధికారుల పాలన అస్తవ్యస్తంగా మారింది. ఎంపీడీవోలు, పంచాయతీరాజ్, నీటిపారుదల, పశుసంవర్థక,రెవెన్యూ, విద్యాశాఖాధికారులను క్లస్టర్ల వారీగా ప్రత్యేకాధికారులుగా ప్రభుత్వం నియమించింది. -
కోడిపిల్లల అరుపు.. వినిపించదేం..!
[ 28-03-2024]
ఉమ్మడి జిల్లా నుంచి కొందరు రాయితీ కోడి పిల్లల పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. ఏడాది క్రితం రూ.1030, రూ.600 చొప్పున డీడీలు తీశారు. అప్పటి నుంచి పశుసంవర్ధక శాఖ అధికారుల చుట్టూ తిరుగుతున్నా.. -
నేటి నుంచి ధాన్యం కొనుగోళ్లు: అదనపు కలెక్టర్
[ 28-03-2024]
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. జిల్లాలో యాసంగి ధాన్యం కొనుగోలు కేంద్రాలు గురువారం నుంచి ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. -
పురంలో.. దాహం తీరేలా..!
[ 28-03-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని పురపాలికల్లో ప్రజల దాహార్తిని తీర్చేందుకు అమృత్-2.0 పథకం కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగసామ్యంతో రూ.491.46 కోట్లతో చేపట్టనున్న పనులకు సెప్టెంబరు 2023లో రాష్ట్ర పురపాలకశాఖ పరిపాలనా అనుమతి మంజూరు చేసింది. -
దగా ఆలోచనలపై.. నిఘా
[ 28-03-2024]
గత అసెంబ్లీ ఎన్నిల సందర్భంగా 28 ఏళ్ల యువకుడు భువనగిరి నియోజకవర్గంలో ప్రధాన పార్టీ అభ్యర్థికి సంబంధించిన అభ్యంతరకరమైన వీడియోను సృష్టించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశాడు. -
గ్రామాల్లో డ్రోన్ కలకలం
[ 28-03-2024]
యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని పాచిల్ల, తుర్కలషాపురం, రామారం, వంగాల, గుండాల గ్రామాల మీదుగా నిత్యం డ్రోన్లు ఎగురవేస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. -
ఆట కట్టించలేరా..?
[ 28-03-2024]
జిల్లాలో జూదం జోరుకు కళ్లెం పడటం లేదు. పచ్చని కాపురాల్లో ఈ ఆట చిచ్చుపెడుతోంది. పోలీసుల దాడులకూ వెరవడం లేదు. ఈ నెల 16న ‘ఈనాడు’లో ప్రచురితమైన ‘తోటలో కాసుల వేట’... -
చివరికి అందేలా..ఆశలు నెరవేరేలా..!
[ 28-03-2024]
కొత్త ప్రభుత్వం ముక్త్యాల బ్రాంచి కాలువ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నాగార్జునసాగర్ ఎడమ కాలువ పరిధిలోని అతిపెద్ద బ్రాంచి కాలువ అయిన ముక్త్యాలకు ఆధునికీకరణ పనులు మళ్లీ మొదలయ్యాయి. -
వాడే ముందు జాగ్రత్త
[ 28-03-2024]
రోడ్డు ప్రమాదంలో కోదాడ పట్టణానికి చెందిన ఓ వ్యక్తి కాలికి స్వల్ప గాయమవడంతో పట్టణంలోని ఓ ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ కాలపరిమితి దాటిన బ్యాండేజీ కాలుకి కట్టడంతో వాపు తగ్గలేదు. -
బంధం ఎందుకో.. బలహీన పడుతోంది
[ 28-03-2024]
వివాహేతర సంబంధం, వేధింపులు.. కారణం ఏదైనా కడదాక కలిసి ఉంటామని పెళ్లి మండపంలో ప్రమాణం చేసిన కొందరు మహిళలు కట్టుకున్న భర్తలను అర్ధంతరంగా కానరాని లోకాలకు పంపేస్తున్నారు. -
ప్రచార అనుమతులకు సువిధ
[ 28-03-2024]
ఓటింగ్ ప్రక్రియను సులభతరం చేయడంతో పాటు సాంకేతికతను ఉపయోగించడం ద్వారా సమయాన్ని ఆదా చేయడంతో పాటు ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. -
సాఫ్ట్గా రాణిస్తూ.. పతకాలు కొట్టేస్తూ..!
[ 28-03-2024]
గ్రామీణ ప్రాంతాల వారికి కబడ్డీ, ఖో ఖో, వాలీబాల్ లాంటి ఆటలు మాత్రమే ఎక్కువగా పరిచయం. సాఫ్ట్బాల్ క్రీడ చాలామందికి కొత్తదే. అయినప్పటికీ పల్లెల్లో దశాబ్దకాలంగా విద్యార్థులు ఈ క్రీడపై ఆసక్తి కనబర్చుతున్నారు. -
భువనగిరి బరిలో చామల
[ 28-03-2024]
ఎడతెగని ఉత్కంఠ నడుమ అధికార కాంగ్రెస్ పార్టీ తమ భువనగిరి లోక్సభ ఎంపీ అభ్యర్థిగా చామల కిరణ్కుమార్రెడ్డిని ప్రకటించింది. ఆయన ఇక్కడి నుంచి ఎంపీగా పోటీ చేయడం ఇదే తొలిసారి.
తాజా వార్తలు (Latest News)
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!
-
వరంగల్ జకోటియ షాపింగ్ కాంప్లెక్స్లో భారీ అగ్ని ప్రమాదం