ఆలోచనే.. ఆవిష్కరణై
తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సైన్స్ కాంగ్రెస్-2022లో విద్యార్థులు ప్రతిభ చాటారు.
రాష్ట్రస్థాయికి ఐదు ప్రాజెక్టులు ఎంపిక
- భువనగిరి పట్టణం, న్యూస్టుడే:
తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ సైన్స్ కాంగ్రెస్-2022లో విద్యార్థులు ప్రతిభ చాటారు. ‘ ఆరోగ్యం శ్రేయస్సుకు పర్యావరణ వ్యవస్థను అర్థం చేసుకోవడం’ అంశంతో నిర్వహించిన పోటీలకు జిల్లా పరిధిలోని 37 ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఆరు నుంచి పదో తరగతి విద్యార్థులు 144 మంది 72 ప్రాజెక్ట్లను సమర్పించారు. అయిదు ప్రదర్శనల ప్రాజెక్ట్ రిపోర్టులు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాయి.
గది పర్యావరణ వ్యవస్థ కోసం ఆరోగ్యకరమైన తరగతి ప్రాజెక్ట్ను చూపుతున్న మహ్మద్ అలీ, అఖిలేష్
ప్రాజెక్ట్ పేరు: గది పర్యావరణ వ్యవస్థ కోసం ఆరోగ్యకరమైన తరగతి
విద్యార్థుల పేర్లు, తరగతి: మహ్మద్ అలీ, అఖిలేష్, తొమ్మిదో తరగతి
పాఠశాల: జడ్పీహెచ్ఎస్, బీబీనగర్
వివరణ: తరగతి గదిలో వినియోగించే బోర్డు నుంచి సుద్ద దుమ్ము బయటికి రాకుండా ఉంటుంది. ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఆరోగ్యపూర్వకంగా ఉంటుంది.
నీటి శుద్ధి యంత్రాల కచ్చితత్వం ప్రాజెక్ట్ను ప్రదర్శిస్తున్న సాయి, విష్ణు
ప్రాజెక్ట్ పేరు: నీటి శుద్ధి యంత్రాల కచ్చితత్వం
విద్యార్థుల పేర్లు, తరగతి: సాయి, విష్ణు, ఎనిమిదో తరగతి
పాఠశాల: మోడల్ స్కూల్, బొమ్మలరామారం
వివరణ: నీటి శుద్ధీకరణ పద్ధతులను అధ్యయనం చేసి ప్రాజెక్ట్ను తయారు చేశారు. రివర్స్ ఆస్మోసిస్ నీటి శుద్ధీకరణ యంత్రాల వల్ల లాభ, నష్టాలు వివరిస్తూనే మిషన్ భగీరథ నీటితో కలిగే ప్రయోజనాలను ప్రాజెక్ట్లో వివరించారు.
ప్రాజెక్ట్ పేరు: వరద ప్రాంతాల కోసం తేలియాడే ఇల్లు
విద్యార్థుల పేర్లు, తరగతి: శివకార్తీక్రెడ్డి, భగత్, తొమ్మిదో తరగతి
పాఠశాల: శ్రీరామకృష్ణ విద్యాలయం, ఆలేరు
వివరణ: సముద్ర తీరాల్లో వరదలు సంభవించినప్పుడు ఇల్లు మునిగిపోకుండా సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించవచ్చు. ఇంటి పునాదుల్లో ఒక రకమైన బెలూన్ వంటి నిర్మాణంతో ఇల్లు తేలే విధంగా రూపొందించారు. తేలికైన పదార్థాలతో గోడలు నిర్మాణం చేయవచ్చని వివరించారు.
ప్రాజెక్ట్ పేరు: సహజ బ్యాండ్ ఎయిడ్
విద్యార్థుల పేర్లు, తరగతి: వాణి, భవిత, ఏడో తరగతి
పాఠశాల: జడ్పీహెచ్ఎస్, నారాయణపూర్
వివరణ: ఔషధ గుణాలు ఉన్న చెట్ల ఆకులు నూరి ప్రత్యేక పద్ధతుల్లో ఎండబెట్టి కాటన్ బట్టలో చుట్టడం ద్వారా బ్యాండెయిడ్ను రూపొందించారు. యాంటిసెప్టిక్గా పనిచేస్తుంది. దీని తయారీకి ఎటువంటి ఖర్చు లేదు.
ప్రాజెక్ట్ పేరు: స్వచ్ఛ భారత్ మిషన్ కోసం ఆటోమెటిక్ యూరినల్ టాయిలెట్ ఫ్లషర్
విద్యార్థుల పేర్లు, తరగతి: పబ్బు నిక్షిప్త, భావన, తొమ్మిదో తరగతి
పాఠశాల: గాయత్రి ఉన్నత పాఠశాల, వలిగొండ
వివరణ: పరిమిత నీటి వనరులతో ఈ ప్రాజెక్ట్ను రూపొందించారు. నాలుగు లీటర్ల నీటి వినియోగంతో టాయిలెట్, యూరినల్స్ను శుభ్రం చేయవచ్చు. ఇన్ఫ్రారెడ్ సెన్సార్లతో తక్కువ నీటి వినియోగంతో మరుగుదొడ్డిని శుభ్రం చేయవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రభుత్వంపై విమర్శ.. రైతులకు భరోసా
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సుయాత్ర చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దానిని ఉమ్మడి జిల్లా నుంచే ప్రారంభించడంతో.. భారాస నేతలు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. -
బాలికలు.. భళా
[ 25-04-2024]
విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. -
మోదీతో తెలంగాణకు తీరని అన్యాయం
[ 25-04-2024]
కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ తెలంగాణకు తీరని అన్యాయం చేశారని నల్గొండ లోక్సభ ఇన్ఛార్జి, మంత్రి నల్లమాద ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. -
బాలికలదే హవా
[ 25-04-2024]
రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. -
ఉపాధి కూలీల సౌకర్యాలపై సమీక్ష
[ 25-04-2024]
పని ప్రదేశాలలో ఉపాధి కూలీలకు మౌలిక సౌకర్యాలు సమకూర్చాలని జిల్లా పరిషతు ముఖ్య కార్యనిర్వహణాధికారి శోభారాణి, ఆదనపు డీఆర్డీవో జి.సురేష్, సూచించారు. -
ప్రథమంలో 26.. ద్వితీయంలో 25
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. 2022-23లో జిల్లా ఉత్తీర్ణత శాతం 57 ఉండగా, ప్రస్తుతం 54.50 శాతానికి పడిపోయింది. -
ఊపందుకున్న నామినేషన్ల పర్వం
[ 25-04-2024]
నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాలకు బుధవారం వరకు 45 మంది చొప్పున నామినేషన్లు వేశారు. -
గిరిజన గురుకులాల్లో 88.60శాతం ఉత్తీర్ణత
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో కలిపి ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 88.60శాతం ఫలితాలు -
మతోన్మాద భాజపాను ఓడించండి: సీపీఐ
[ 25-04-2024]
దేశంలో మతోన్మాదం పేరుతో రాజకీయాలు చేస్తున్న భాజపాను ఓడించి కాంగ్రెస్ అభ్యర్ధులను భారీ మెజార్టీతో గెలిపించాలని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. -
విభజన హామీల అమలుకు కృషి
[ 25-04-2024]
భువనగిరి లోక్సభ ఎంపీగా తనను గెలిపిస్తే విభజన హామీలను అమలు చేసేందుకు, నిధులు రాబట్టేందుకు కృషి చేస్తానని భువనగిరి లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. -
తొలి ఎన్నికలోనే అత్యధిక మెజారిటీ
[ 25-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1951లో ఏర్పడగా.. తొలి ఎన్నికలు 1952లో జరిగాయి. -
రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం, వ్యక్తి అరెస్ట్
[ 25-04-2024]
రైల్వేశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని 17 మంది బాధితుల నుంచి నగదు వసూలు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు పోలీస్ ఇన్స్పెక్టర్ అశోక్రెడ్డి తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్