తొలి వీధి దీపం వెలిగిందిక్కడే
నిజాం నవాబులు తొలిసారి జనరేటర్తో వీధి దీపం వెలిగించింది గుర్రంపోడు మండలం సుల్తాన్పురంలోనే.
నిజాం నవాబులు తొలిసారి జనరేటర్తో వీధి దీపం వెలిగించింది గుర్రంపోడు మండలం సుల్తాన్పురంలోనే. ఆనాటి నిజాం సుల్తానుకు కేంద్ర కార్యాలయం వారు లేఖ రాస్తూ.. వీధి దీపాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. అయితే ఇక్కడే ఓ చిన్న పొరపాటు దొర్లింది. హైదరాబాద్లోని సుల్తాన్బజార్కు బదులుగా సుల్తాన్పురం అని లేఖలో తప్పుగా అచ్చయింది. నిజాం అధికారులు సుల్తాన్పురం ఎక్కడ ఉందో ఆరా తీసి చింతపల్లి సమితి పరిధిలో (ప్రస్తుతం గుర్రంపోడు మండలం) సుల్తాన్పురం ఉన్నట్లుగా గుర్తించి వెంటనే ఇసుపస్తంభాలు తెప్పించి గ్రామంలో అన్నివీధుల్లో పాతించారు. డీజిల్ జనరేటర్ను సుల్తాన్పురం పంపించి బిగించారు. డ్రమ్ముల కొద్దీ డీజిల్ కూడా తెప్పించారు. విద్యుత్తు దీపాలు కూడా ఏర్పాటు చేసి జనరేటర్ సాయంతో వెలిగించారు. ఆ రోజుల్లో జనం వచ్చి ఈ దీపాలను చూసి ఆశ్చర్యపోయారట. అయితే జరిగిన తప్పిదం తెలుసుకొన్న అధికారులు ఇక్కడి జనరేటర్, ఇసుప స్తంభాలు, వీధిదీపాలను తీసుకెెళ్లేందుకు సుల్తాన్పురం రాగా ఇక్కడ జనం అడ్డుకున్నారు. దీంతో అధికారులు వెనక్కు వెళ్లిపోయి సుల్తాన్బజార్లో కరెంటు దీపాల ఏర్పాటు చేశారు. సుమారు మూడు నెలల పాటు జనరేటర్ సాయంతో దీపాల వెలుగులు కొనసాగాయని, కొంతకాలం తర్వాత అధికారులు వచ్చి జనరేటర్ను తీసుకువెళ్లారని గ్రామస్థులు చెబుతున్నారు. ఆనాడు పాతిన కరెంటు ఇనుపస్తంభాలు నాటి సంఘటనకు గుర్తుగా గ్రామవీధుల్లోనే ఉన్నాయి.
గ్రామంలో ఆనాటి ఇసుప కరెంటు స్తంభం ఇది
న్యూస్టుడే, గుర్రంపోడు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రభుత్వంపై విమర్శ.. రైతులకు భరోసా
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సుయాత్ర చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దానిని ఉమ్మడి జిల్లా నుంచే ప్రారంభించడంతో.. భారాస నేతలు పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. -
బాలికలు.. భళా
[ 25-04-2024]
విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. -
మోదీతో తెలంగాణకు తీరని అన్యాయం
[ 25-04-2024]
కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ తెలంగాణకు తీరని అన్యాయం చేశారని నల్గొండ లోక్సభ ఇన్ఛార్జి, మంత్రి నల్లమాద ఉత్తమ్కుమార్రెడ్డి ఆరోపించారు. -
బాలికలదే హవా
[ 25-04-2024]
రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. -
ఉపాధి కూలీల సౌకర్యాలపై సమీక్ష
[ 25-04-2024]
పని ప్రదేశాలలో ఉపాధి కూలీలకు మౌలిక సౌకర్యాలు సమకూర్చాలని జిల్లా పరిషతు ముఖ్య కార్యనిర్వహణాధికారి శోభారాణి, ఆదనపు డీఆర్డీవో జి.సురేష్, సూచించారు. -
ప్రథమంలో 26.. ద్వితీయంలో 25
[ 25-04-2024]
ఇంటర్ పరీక్ష ఫలితాల్లో బాలికలు సత్తా చాటారు. 2022-23లో జిల్లా ఉత్తీర్ణత శాతం 57 ఉండగా, ప్రస్తుతం 54.50 శాతానికి పడిపోయింది. -
ఊపందుకున్న నామినేషన్ల పర్వం
[ 25-04-2024]
నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాలకు బుధవారం వరకు 45 మంది చొప్పున నామినేషన్లు వేశారు. -
గిరిజన గురుకులాల్లో 88.60శాతం ఉత్తీర్ణత
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషనల్ సొసైటీ ఆధ్వర్యంలో నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో కలిపి ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో 88.60శాతం ఫలితాలు -
మతోన్మాద భాజపాను ఓడించండి: సీపీఐ
[ 25-04-2024]
దేశంలో మతోన్మాదం పేరుతో రాజకీయాలు చేస్తున్న భాజపాను ఓడించి కాంగ్రెస్ అభ్యర్ధులను భారీ మెజార్టీతో గెలిపించాలని సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకట్రెడ్డి పిలుపునిచ్చారు. -
విభజన హామీల అమలుకు కృషి
[ 25-04-2024]
భువనగిరి లోక్సభ ఎంపీగా తనను గెలిపిస్తే విభజన హామీలను అమలు చేసేందుకు, నిధులు రాబట్టేందుకు కృషి చేస్తానని భువనగిరి లోక్సభ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డి అన్నారు. -
తొలి ఎన్నికలోనే అత్యధిక మెజారిటీ
[ 25-04-2024]
నల్గొండ లోక్సభ నియోజకవర్గం 1951లో ఏర్పడగా.. తొలి ఎన్నికలు 1952లో జరిగాయి. -
రైల్వే ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం, వ్యక్తి అరెస్ట్
[ 25-04-2024]
రైల్వేశాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని 17 మంది బాధితుల నుంచి నగదు వసూలు చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు పోలీస్ ఇన్స్పెక్టర్ అశోక్రెడ్డి తెలిపారు.