నోటుకు ఓటు.. ప్రజాస్వామ్యానికి చేటు
ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు వజ్రాయధం వంటిదని నల్గొండ టూటౌన్ ఎస్సై ఏమిరెడ్డి రాజశేఖర్రెడ్డి అన్నారు.
‘ఈనాడు-ఈటీవీ’ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు
సదస్సులో మాట్లాడుతున్న నల్గొండ టూటౌన్ ఎస్సై రాజశేఖర్రెడ్డి
నల్గొండ టౌన్, న్యూస్టుడే: ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు వజ్రాయధం వంటిదని నల్గొండ టూటౌన్ ఎస్సై ఏమిరెడ్డి రాజశేఖర్రెడ్డి అన్నారు. మంగళవారం నల్గొండలోని నీలగిరి డిగ్రీ, పీజీ కళాశాలలో ‘ఈనాడు-ఈటీవీ’ ఆధ్వర్యంలో ఓటు హక్కుపై నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఓటు వినియోగం ద్వారా మంచి పాలకులను ఎన్నుకునే అవకాశం లభిస్తుందని తెలిపారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని కోరారు. ఎన్నికల్లో ఓటింగ్శాతం పెరిగేలా యువత ప్రజా చైతన్య కార్యక్రమాలను నిర్వహించాలన్నారు. నోటుకు ఓటును అమ్ముకోకుండా నిజాయితీ గల వారికే ఓటు వేయాలని సూచించారు. ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘ఈనాడు-ఈటీవీ’ ఆధ్వర్యంలో సదస్సులు నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం ఓటు నమోదు, వినియోగంపై విద్యార్థులు, అధ్యాపకులు ప్రతిజ్ఞ చేశారు.
యువత ఓటు నమోదు చేసుకోవాలి
మారం నాగేందర్రెడ్డి, ప్రిన్సిపల్, నీలగిరి డిగ్రీ, పీజీ కళాశాల
18 ఏళ్లు నిండిన యువతీయువకులు తప్పనిసరిగా ఓటు నమోదు చేసుకోవాలి. ఎన్నికల్లో ఓటు ఉపయోగించుకోవడం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థ పటిష్టమవుతుంది. ఓటు పొందిన ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో ఓటు వినియోగించుకోవాలి. తమ కళాశాలలో అర్హత గల వారు ఓటు నమోదు చేసుకునేలా అవగాహన కల్పిస్తాం. యువత ఓటు ప్రాధాన్యతను ప్రజలకు వివరించాలి.
బాధ్యతగా భావించాలి
సైదులు, సెక్టార్ ఎస్సై, నల్గొండ
యువత ఓటు హక్కు నమోదును బాధ్యతగా భావించాలి. సమాజంలో ప్రతి ఒక్కరూ ఓటు వినియోగించుకోవడం ద్వారా ఓటింగ్శాతం పెరిగి స్వచ్ఛమైన నాయకులను ఎన్నుకునే అవకాశం ఉంటుంది. నోటుకు ఓటు వేసే విధానానికి స్వస్తి పలకాలి. నిజాయితీ గల వారు చట్టసభలకు వెళ్తే తమ ప్రాంతాలు త్వరితగతిన అభివృద్ది సాధిస్తాయి. యువత ఓటు నమోదుపై అవగాహన ర్యాలీలు నిర్వహించాలి. దేశ భవిత యువత చేతిలో ఉందని గుర్తించాలి.
అవగాహన పొందాను
సింధు, డిగ్రీ
నేను ఇటీవల ఓటు నమోదు చేసుకున్నాను. ఈ సదస్సు ద్వారా ఓటు ఉపయోగించుకునే విధానంపై అవగాహన పొందాను. మంచి నాయకులకే ఓటు వేయడం ద్వారా అభివృద్ధి సాధ్యమవుతుందని తెలుసుకున్నాను. వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా ఓటు వినియోగించుకుని...ఇతరులు కూడా వేసుకునేలా అవగాహన కల్పిస్తాను.
నిస్వార్థ నాయకులకే పట్టం
స్వామి, విద్యార్థి
వచ్చే ఎన్నికల్లో మంచి నాయకుడికి ఓటేస్తా. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ప్రతి ఒక్కరు ఓటు వినియోగించుకోవాలి. ఓటు ద్వారా దేశం ప్రగతి సాధిస్తుంది. మనం వేసే ఓటు ఓ నిమిషంలో అయిపోయేదే...కానీ దాని ప్రభావం మనపై ఐదేళ్లు ఉంటుందని గుర్తించాలి. అర్హత గల ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మాటలే తూటాలై..!
[ 24-04-2024]
‘నల్గొండ జిల్లా సాగునీటి రంగానికి కేసీఆర్ తీరని అన్యాయం చేశారు. బస్సు యాత్ర కాదు, మోకాళ్ల యాత్ర చేసినా భారాసకు ఎవరూ ఓటేయరు. -
వైభవంగా హనుమాన్ జయంతి
[ 24-04-2024]
హనుమాన్ జయంతి సందర్భంగా మంగళవారం ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరిపించారు. స్వామి వారికి సింధూరంతో అభిషేకం, తమల పాకులతో పూజలు నిర్వహించారు. -
పాఠాలకు బై.. ఆటలకు సై..!
[ 24-04-2024]
వేసవి సెలవులు వచ్చేశాయ్.. పది నెలల పాటు నిత్యం బడుల్లో పాఠాలు చదవడం, రాయడం తదితర పనుల్లో నిమగ్నమై ఉన్న చిన్నారులకు ఈ నెల 24 (బుధవారం) నుంచి మొదలయ్యే సెలవులతో ఉపశమనం లభించింది. -
అట్టహాసంగా కంచర్ల నామినేషన్
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతలకు తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. -
పార్టీ గుర్తుల చరిత్ర ఇదే
[ 24-04-2024]
రాజకీయ పార్టీలనగానే గుర్తొచ్చేది వాటి గుర్తులే. ప్రధానంగా ఎన్నికల సమయంలో పార్టీ అభ్యర్థుల కంటే గుర్తులకే ప్రాధాన్యం ఉంటుంది. -
వారు.. శాసనసభకు, లోక్సభకు ఎన్నికయ్యారు!
[ 24-04-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కొందరు నేతలు శాసనసభకు, లోక్సభకు ఎన్నికయ్యారు. దేశంలోనే అత్యధిక ఓట్లు సాధించి రికార్డు సృష్టించారు. -
ప్రలోభాల ఎర.. తప్పదు చెర!
[ 24-04-2024]
లోక్సభ ఎన్నికలు మే 13న జరగనున్నాయి. ఇప్పటికే నామినేషన్ల పర్వం ప్రారంభం కావడంతో ప్రచారం ఊపందుకుంటోంది. -
ఆహారం సేకరించి.. అభాగ్యుల ఆకలి తీర్చి..
[ 24-04-2024]
దేశంలో ఒక వైపు రెండు పూటలా తినడానికి తిండి లేక వేలాది మంది అవస్థలు పడుతున్నారు. మరో వైపు నిత్యం లక్షల టన్నుల ఆహార పదార్థాలు వ్యర్థాలుగా మారుతున్నాయి. -
లోక్సభలో గళం విప్పే అవకాశం ఇవ్వండి: జహంగీర్
[ 24-04-2024]
ప్రజాసమస్యల పరిష్కారానికి జనం వెన్నంటే ఉండి నిరంతరం పోరాటాలు చేస్తున్న తనకు మద్దతుగా నిలిచి గెలిపిస్తే పార్లమెంటులో ఈ ప్రాంత సమస్యలపై గళం విప్పుతానని భువనగిరి లోక్సభ సీపీఎం అభ్యర్థి ఎండీ.జహంగీర్ అన్నారు. -
గత పొరపాట్లు పునరావృతం కావొద్దు: కలెక్టర్
[ 24-04-2024]
త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో సెక్టార్, పోలీసు అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ వెంకటరావు అన్నారు. -
బడికి నిధులు
[ 24-04-2024]
యాదాద్రి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం రూ.25 కోట్లు మంజూరు చేసింది. ఈ పనులను అమ్మ ఆదర్శ కమిటీల ద్వారా చేపట్టనున్నారు. -
అతిథులు తరలొచ్చె.. బూర పూరించె..!
[ 24-04-2024]
ఓట్ల కోసం అనాదిగా మత రాజకీయాలు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీయేనని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ విమర్శించారు. -
వేస్తున్నారు నామినేషన్లు..!
[ 24-04-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కొనసాగుతోంది. -
అభ్యర్థులిద్దరూ ‘బీఎన్ రెడ్డి’లే..!
[ 24-04-2024]
మిర్యాలగూడ లోక్సభ నియోజకవర్గంలో 1989, 1991 ఎన్నికల్లో ప్రధాన అభ్యర్థులిద్దరూ బీఎన్రెడ్డిలే. ఒకరు వాస్తుశిల్పి బద్దం నర్సింహారెడ్డి. మరొకరు భీంరెడ్డి నర్సింహారెడ్డి. -
1,29,766 ఓట్లు కొల్లగొట్టిన స్వతంత్రులు
[ 24-04-2024]
ఫ్లోరైడ్కు వ్యతిరేకంగా జలసాధన సమితి ఆధ్వర్యంలో 1996 లోక్సభ ఎన్నికల్లో 476 మంది స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో వీరు 1,29,766 ఓట్లు సాధించారు.
తాజా వార్తలు (Latest News)
-
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
-
యానిమేషన్ సినీ కథా రచయిత ఆత్మహత్య
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్